గుజరాత్ కాంగ్రెస్… కన్నులొట్టవోయి చావు తప్పించుకుంటుందా?

Publish Date:Aug 8, 2017

Advertisement

ఒకప్పటి కాంగ్రెస్ మహాత్మా గాంధీ కాంగ్రెస్! ఇప్పటి కాంగ్రెస్… రాహుల్ గాంధీ కాంగ్రెస్! గాంధీ అన్న పేరు అదే అయినా, కాంగ్రెస్ అదే అయినా… పరిస్థితి మాత్రం వేరు! ఇంకా చెప్పాలంటే… దుస్థితి వేరు! గాంధీ పుట్టిన గుజరాత్ లో ముగిసిన రాజ్యసభ ఎన్నికలే ఇందుకు సంకేతం! సాక్షాత్తూ సోనియా అంతరంగికుడు అహ్మద్ పటేలే అగమ్యగోచరమైన స్థితిలో పడిపోయారు! ఇక గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు…

 

గుజరాత్ అంటే ఈ తరం వారికి బీజేపి అనే తెలుసు! ఎందుకంటే, గత రెండు దశాబ్దాలుగా అక్కడ హస్తం పార్టీ చేతులు కట్టుకుని కూర్చోవటం తప్ప చేసిందేం లేదు. వరుసగా కమలనాథులు అధికార పీఠం కైవసం చేసుకుంటూనే వున్నారు. మరీ ముఖ్యంగా, 2002 అల్లర్ల నెపంతో మోదీని జాతీయ విలన్ చేద్దామనుకున్న కాంగ్రెస్ ప్లాన్ బెడిసి కొట్టి పరిస్థితి మరింత దిగజారింది. గుజరాతీలు అంతకంతకూ హిందూత్వ ఎజెండాకు జై కొట్టి కాషాయ ధ్వజాన్నే నమ్ముకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కష్ట కాలం పరాకాష్ఠకు చేరినట్లే కనిపిస్తోంది…

 

ఒకప్పుడు కాంగ్రెస్ ను ముందుకు నడిపిన గాంధీ, పటేల్ లాంటి వారు గుజరాత్ నుంచే పుట్టుకొచ్చారు. అందుకే, కాంగ్రెస్ కూడా గాంధీ భూమిలో గట్టిగానే వుండేది. కాని, రాను రాను ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల కాలంలో గుజరాత్ పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ కంచుకోటలో గొప్ప లీడర్లు పుట్టుకురావటం మానేశారు. మరో వైపు ఆడ్వాణీ రూపంలో బీజేపికి ఆయువు పట్టు గుజరాత్ లోనే దొరికింది. సోమనాథ్ నుంచే ఆయన తన రథ యాత్ర మొదలు పెట్టి బీజేపి శకానికి నాంది పలికారు! ఆ ఊపే ఇప్పటికీ గుజరాత్ లో కనిపిస్తోంది. బీజేపి రోజురోజుకి బలపడుతూనే వుంది. ఎంతగా అంటే… ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జరుగుతోన్న రాజ్యసభ ఎన్నికలు సోనియా, రాహుల్ కి కూడా నిద్రలేకుండా చేస్తున్నాయి.

 

గుజరాత్ లో అధికారం చేపట్టటం మాట ఎప్పుడో మరిచిపోయింది అక్కడి రాష్ట్ర కాంగ్రెస్. ఇక ఇప్పుడు వున్న ఎమ్మెల్యేలు కూడా చేతి పార్టీ చేయి నుంచి మెల్లగా చేజారిపోతున్నారు. సోనియా కుడి భుజం లాంటి అహ్మద్ పటేల్ పదే పదే గెలుచుకునే రాజ్యసభ సీటు ఈ సారి సాధ్యమో, అసాధ్యమో తెలియని స్థితిలో పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ 56మందితో కావాల్సినంత మద్దతు వున్న గుజరాత్ కాంగ్రెస్ అమిత్ షా వ్యూహాలు, శంకర్ సిన్హ్ వాఘేలా తిరుగుబాటుతో చిందరవందర అయిపోయింది. ఆయన, ఆయనతో పాటూ మరో ఆరుగురు బీజేపి వైపు జంప్ కావటంతో అహ్మద్ పటేల్ కు కావాల్సిన 45మంది ఎమ్మెల్యేల మద్దతు కష్టమైపోయింది. బెంగుళూరులో దాచి పెట్టుకుని తీసుకొచ్చి ఓటింగ్ కి పంపినా కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ముందు జాగ్రత్తగా ఎన్సీపీ, జేడీయూ లాంటి పార్టీలకున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేల్ని తమకు ఓటు వేయాల్సిందిగా కాంగ్రెస్ కన్విన్స్ చేసింది! అయినా కూడా రిజల్ట్స్ వచ్చే దాకా అహ్మద్ పటేల్ భవిష్యత్తు అయోమయమే! అచ్చంగా అదే స్థితిలో వుంది గుజరాత్ కాంగ్రెస్ పరిస్థితి కూడా!

 

బీజేపి తరుఫున అమిత్ షా, స్మృతీ ఇరానీ తప్పక గెలిచే స్థితి వుంది. ఇక మూడో అభ్యర్థిగా కమలం వారు నిలబెట్టిన అభ్యర్థి నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ వాడే! పైగా అతడే చీఫ్ విప్ కూడా! విప్ జారీ చేయాల్సిన వ్యక్తే బీజేపిలోకి జంప్ అయ్యాడంటే గుజరాత్ కాంగ్రెస్ గందరగోళం ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు! ఇందుకు కారణం కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వుండే రుగ్మతే! హైకమాండ్ కల్చర్ నీడలో గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవటమే పార్టీని నిండా ముంచుతోంది! అందుకు తోడు మోదీ, అమిత్ షా లాంటి బీజేపి అగ్రనాయకులు దుస్థితి మరింత దుర్భరం చేస్తున్నారు! మొత్తానికి అహ్మద్ పటేల్ ఓడితే మాత్రం సోనియా, రాహుల్ తో సహా కాంగ్రెస్ వారంతా లోపం ఎక్కడుందో ఖచ్చితంగా వెదుక్కుని తీరాలి. లేదంటే, మోదీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ కేవలం నినాదంలా వుండటం సాధ్యం కాకపోవచ్చు!

By
en-us Political News

  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 అసెంబ్లీలోనూ, మండలిలోనూ కూడా ఈ విషయంపై ఆయన మాట్లాడారు. సరే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు లేరు, కానీ మండలిలో కూడా లోకేష్ డీఎస్సీపై మాట్లాడి, మండలిలో ప్రతపక్ష నేత బొత్స సత్యనారాయణ సంధించిన పలు ప్రశ్నలకు లోకేష్ సూటిగా, అంతే క్లారిటీగా సమాధానాలిచ్చారు.  
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా కుప్పంకు దగ్గరగానే ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా సంప్రదింపులు జరిపింది. ఏపీ సర్కార్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ నుంచి కుప్పం ఎయిర్ పోర్టుకు అవసరమైన షరతులతో కూడిన  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను విజయవంతంగా సాధించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.