ఆనం బ్రదర్స్ కోసం బాబు మాస్టర్ ప్లాన్

Publish Date:Aug 9, 2017

Advertisement

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేతల్లో ఆనం బ్రదర్స్ ప్రముఖులు.. కాంగ్రెస్ హయాంలో జిల్లాతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషించారు ఈ అన్నదమ్ములు. అయితే రాష్ట్ర విభజన పేరిట కాంగ్రెస్ చేసిన ఘోరమైన తప్పిదం హస్తం పార్టీకి చెందిన ఎంతోమంది నేతల రాజకీయ భవిష్యత్తును సమాధి చేసింది. ఆనం బ్రదర్స్‌కు కూడా ఇది తప్పలేదు. దీంతో అన్నదమ్ములిద్దరూ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి రాకను పార్టీలో చాలా మంది స్వాగతించారు కూడా అయితే పార్టీ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కనబెట్టిందని ఆనం బ్రదర్స్ లోలోపల కుమిలిపోతున్నారు. దీంతో వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది.

 

దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే చర్యలు చేపట్టారు. తన కలల ప్రాజెక్ట్‌ను ఆనం రామనారాయణ రెడ్డి చేతికి అప్పగించనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అవేంటంటే చంద్రన్న భీమా, ఎన్టీఆర్ హౌసింగ్ ఈ రెండు ప్రాజెక్ట్‌లను సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చివరికి అధికారుల చేతిలో కూడా పెట్టకుండా తానే స్వయంగా వీటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో మీకు పని ఒత్తిడి ఎక్కువ అవుతోంది..కొన్నింటిని అధికారులకు అప్పగించాలని సన్నిహితులు సూచించినా ముఖ్యమంత్రి వినడం లేదట. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఆనం బ్రదర్స్ పార్టీ మారేందుకు సన్నాహలు చేస్తున్నారనే వార్త చంద్రబాబు చెవిన పడింది. వారు టీడీపీని వీడితే నెల్లూరు జిల్లాపై పట్టు జారిపోతుందని సీనియర్ నేతలు సూచించడంతో ముఖ్యమంత్రి కాస్త ఆలోచనలో పడ్డారు. దీంతో ఆనం బ్రదర్స్‌ పార్టీ మారకుండా కీలక బాధ్యతలు అప్పగించాలని భావించినట్లు తెలుస్తోంది.

 

ఆనం రామనారాయణ రెడ్డికి ప్లానింగ్, ఆర్ధిక వ్యవహారాల్లో దిట్టగా మంచి పేరుంది..అలాంటి వ్యక్తికి తన కలల ప్రాజెక్ట్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఓ వైపు ఆనం సోదరులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఇప్పటికే వారు వైసీపీకి వెళ్లకుండా అడ్డుకున్నట్లు అవుతుందని బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. దీనిపై కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

By
en-us Political News

  
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.