Publish Date:Oct 21, 2022
తాను రాజకీయ విశ్లేషకుడినని, వ్యూహకర్తనని భారీ ప్రచారం చేసుకుంటూ దేశంలో అన్ని పార్టీల దశ దిశా మార్చగల వ్యూహకర్తనని భారీ ప్రచారం చేసుకుంటున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ విషయంలో ఏమీ చేయ లేకపోయాడని పైగా అంతే అగౌరవంగా నీతిష్ కుమార్ కి దూరమయ్యాడనే ప్రచారం ఉంది. ఆయనకు ఎంతో స్వేచ్ఛగా మాట్లాడేస్తుంటారని, వాటిని అంతా లెక్కలోకి తీసుకోవాలన్నట్టుగానే వ్యవహరిస్తుంటారన్న ప్రచారం ఉంది. కానీ ఆయన్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నీతిష్ అనడం గమనార్హం.
తనకు బీజేపీతో రహస్యసంబంధాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించ డాన్ని బీహార్ ముఖ్యమంత్రి నీతిష్ కుమార్ తప్పికొట్టారు. కిషోర్ యువకుడు, అతను తనకు తోచినట్టు ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడేస్తుంటాడని అన్నారు. శుక్రవారం నీతిష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్ కిషోర్ తన పబ్లిసీటీ కోసం ఏదయినా మాట్లాడేస్తుం టాడని, అతన్ని పట్టించుకోవద్దని, అసలు అతని గురించి తన వద్ద ప్రస్తావించవద్దని అన్నారు. అతను చిన్నవాడయినా ఎంతో మర్యాదిచ్చానని, కానీ అతను అగౌరవంగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసినదే నన్నారు.
బీజేపీతో విడిపోయిన తర్వాత నీతిష్ కుమార్ ఆర్జేడీ తేజస్వినీ యాదవ్తో మళ్లీ జతకట్టారని పీకే వ్యాఖ్యా నించారు. 2017లో ఆర్జేడిని ముంచే బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీలను ఒకటి చేసే యత్నం చేస్తున్నట్టు కనపడిన్పటికీ, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరి వంశ్ మద్దతుతో బీహార్ ముఖ్యమంత్రి మరో వంక బీజేపీతో సంబంధాలు కొనసాగించారని పీకే ఆరో పిం చారు. నీతిష్ తీరును ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నీతిష్ అవసరార్ధం స్నేహాలు చేస్తుంటారని రాజ కీయ వ్యూహకర్త బీహార్యాత్రలో అన్నారు. నీతిష్ 17 ఏళ్ల పాలనలో 14 సంవత్సరలు బీజేపీ మద్దతుతోనే సాగిందని విమర్శించారు.
కాగా, నీతిష్ కుమార్ జెడీయూ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, అర్ధంలేని విమర్శలకు పాల్పడుతున్న కారణంగానూ ప్రశాంత్ కిషోర్ను 2020 జవరిలోనే నీతిష్ వదిలించుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-is-childish-says-nitish-kumar-25-145842.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.