Publish Date:Oct 21, 2022
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నలభయి ఐదు రోజుల అధికారం తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఇది బ్రిటీష్ చరిత్రలో చెప్పుకోదగ్గ సంఘటన. భారత్ మాజీ క్రికెటర్ వాసిమ్ జాఫర్ దీన్ని గురించి ట్వీట్ లో సరదా కామెంట్ చేశాడు. ఇపుడు ఇది ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఊహించనివిధంగా అన్నీ వేగంగా జరిగిపోతున్న సమయంలో టీమ్ ఇండియా పెద్దగా కంగారుపడనవసరంలేదన్నాడు. భారత్ జట్టుకు సూపర్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా గాయాల కారణంగా భారత్ జట్టుకు ఎంపిక కాలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆరంభమయిన టీ-20 ప్రపంచకప్కు వెళ్లిన జట్టులో బూమ్రా లేడని క్రికెట్ పండితులు, అభిమానులతో పాటు బీసీసీఐ కూడా విచారం వ్యక్తం చేసింది. బూమ్రా ఈ టోర్నీలో తప్పకుండా ఉండా ల్సిన అవసరం ఉందని, ఆసీస్ పిచ్ల మీద అతను విరుచుకుపడితే ప్రత్యర్థులను వొణికించి భారత్కు కచ్చితంగా విజయాన్ని అందించగలడన్న అభిప్రాయాలే అంతటా వినపడుతున్నాయి.
ఆస్ట్రేలియాలో ప్రారంభమయిన టీ-20 ప్రపంచకప్ పోటీల మీద విశ్లేషణ చేస్తూ ఇంగ్లండ్కు ప్రధాని లేరు గనుక 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల పేసర్ భారత్కు అక్కర్లేదని జాఫర్ కామెంట్ చేశాడు. పాకిస్తా న్కు మంచి ఫినిషర్ అవసరం లేదని, న్యూజిలాండ్కు ఆస్ట్రేలియాలో మంచి రికార్డు లేదని, శ్రీలంక జట్టులో అనుభవజ్ఞులు లేరని, ట్రస్ 45 రోజులకే ప్రధాని పదవికి రాజీనామా చేసింది గనుక ఇంగ్లాండ్కి ప్రధాని లేరని వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. అంతా ఊహించినదానికంటే విరుద్ధంగా జరిగి పోతున్నాయి, భారత్ కంగారుపడనవసరం లేదన్నాడు.
ఈరోజుల్లో ఊహించని సంఘటనలే ఎక్కువ జరగడం గమనిస్తున్నామనేది ట్రస్ రాజీనామా రుజువు చేసిం ది. 47 ఏళ్ల ట్రస్ కేవలం 45 రోజులకే పదవి వదిలేశారు. అంతకుముందే జూలైలో బోరిస్ జాన్సన్ అనేక వివా దాల్లో చిక్కుకుని ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఆ పదవిలోకి రావడినికి లిజ్ భారత సంతతకి చెందిన రిషీ సునాక్ నుంచి గట్టి పోటీనే ఎదుర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dont-think-about-bumratress-lost-her-post-in45-days-25-145844.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.