పవ"నిజమేనా"?

Publish Date:Mar 6, 2014

Advertisement

 

నిజం నిప్పులో కాలదు. నీటిలో నానదు. ఇజం మాత్రం ఎందులోనైనా ఇమిడిపోతుంది. నక్సలిజం, టెర్రరిజం, హీరోయిజం, విలనిజం ఇలా అవకాశం ఆసరాగా.. అవసరాలకు అనుగుణంగా ఇజం రూపుదిద్దుకుంటుంది. ఈ ఇజం లేకుండా పవనిజం అంతర్జాలాన్ని ఎలా ఆక్రమించింది? ఏ అదృశ్య శక్తి దీన్ని నడుపుతోంది? వీటన్నింటికి సమాధానమే పవన్ పొలిటికల్ ఎంట్రీ కథనాలు. నెటిజన్ల ద్వారా సామాన్య జనానికి వ్యాపించిన పవనిజం..హిప్నాటిజంలా మైమరిపిస్తోంది. పవనిజంపై పుస్తకాలు వచ్చాయి. ప్రత్యేక సంచికలు వెలువడ్డాయి. పవన్ అనే వ్యక్తిని అత్యంత ప్రభావవంతమైన శక్తిలా మార్చేందుకు తెర వెనుక మేధావులు చేస్తున్న మేదోమధనమే ఈ పవనిజమా? అనే సందేహాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న.. అనిపించుకున్న పవన్ చేతులు.. ఎందరికో చేయూతనిచ్చాయి.

 

ఒట్టి మాటలు కట్టి పెట్టి.. గట్టి మేల్ తలపెట్టవోయ్ అని వందేళ్ళ క్రితం గురజాడ చూపిన అడుగుజాడలో పయనించిన పవన్.. పావలా శ్యామల ఆరోగ్యం కోసం ఆర్ధిక సాయమందించాడు. ఉత్తరాఖండ్ ఉపద్రవానికి చలించిపోయి అందరి కంటే ముందుగా స్పందించి రూ. 25లక్షలు అక్కడి ప్రభుత్వానికి పంపాడు. అన్న కొడుకుతో ఆరెంజ్ అనే సినిమా తీసి ఓ రేంజ్ లో నష్టపోయిన నాగబాబును ఆర్థికంగా ఆదుకున్నాడు. ఈ విషయం నాగబాబు చెబితేనే అందరికీ తెలిసింది. గుప్తదానాలు, ఆప్తులను ఆదుకోవడాలు, ఆపద్ధర్మ సహాయాలు మీడియా ద్వారా బయటి ప్రపంచానికి తెలిసిపోయాయి. ప్రచారానికి, ప్రసంగాలకు పవన్ దూరంగా ఉంటారు. తన సినిమా ఆడియో విడుదల వేడుకకు కూడా హాజరు కారు. తన సినిమాలకు అర్థ శతదినోత్సవాలు, శత దినోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఇష్టపడరు. ఇదంతా గతం..ప్రస్తుతం .. సినిమా వేడుకలైనా.. స్వచ్చంద కార్యక్రమాలైనా ..ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతున్నారు ;పవన్. భావోద్వేగపూరిత, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే తన ప్రసంగాల శైలినీ మార్చేశారు.

 

పవన్ ఎందుకు ఇంతలా మారిపోయాడో విశ్లేషించే పనిలో సినీ పండితులు, రాజకీయ విశ్లేషకులు తల మునకలయ్యారు. ఇదే సమయంలో పవనిజం చాప కింద నీరులా విస్తరించింది. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పవర్ స్టార్ ఇమేజ్ తో సొమ్ము చేసుకోవచ్చని, పవనిజం కూడా ప్రాంతాలకు అతీతంగా ఓట్లు కురుపిస్తుందని పవన్ ను ఒప్పించి పూర్తి స్థాయిలో రాజకీయాల తెరపైకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారనే వాదన వినిపిస్తోంది.

 

మరో పక్క ఎన్నో ఆశలతో, మరెంతో నమ్మకంతో తన అన్న చిరంజీవి వెంట వెళితే పదవులే లక్ష్యమ్.. విలీనమే మార్గంగా కాంగ్రెస్ లో ప్రజరాజ్యాన్ని కలిపేయడం పవన్ ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని అంటున్నారు గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నాయకులు. అందుకే కొత్తగా పార్టీ పెట్టి తన సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు.

 

వీటన్నిటి కంటే..వేరే బలమైన కారణమే పవన్ పొలిటికల్ ఎంట్రీకి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల వ్యవహారశైలి, పదవులు వచ్చిన తరువాత కొంత మంది వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన పవన్ చాలా రోజుల నుంచే పోలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారట.. అందుకే కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువైన ఆరాధ్య నటుడు .. అభిమాన నాయకుడిగా మార్చే వ్యూహంతో పవన్ కోటరీ పవనిజంతో అభిమానుల నెట్ ఇంట్లో అడుగు పెట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కోరుకుంటే పదవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఫాం హౌస్ ముందు మొకరిల్లుతాయి. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఒక్క సీటు అడిగితే ఓపెన్ ఆఫర్ ఇచ్చే పార్టీలు ఉన్నాయి. పవన్ కోరుకుంటే జరగని పనిలేదు. పవన్ ఒక పవర్.

 

అలాగని పొలిటికల్ పవర్ కావాలనుకుంటే.. పవనిజం ఒక్కటే చాలదు. అన్న మోసగించినా మోములో చిరు నవ్వు చెదరకూడదు. వ్యక్తిగత జీవితంపై విమర్శలు వెల్లువెత్తినా వీధిన పడకూడదు. ఇన్ని భావోద్వేగాలను అదుపు చేసుకుంటే పవనిజం.. నిజమయ్యే ఛాన్స్ ఉంది.

 

సినిమాలోలా .. రాజకీయాల్లో నీ మాటలు నువ్వే రాసుకోవాలి.. పాటలు నువ్వే పాడుకోవాలి.. అక్కడ ఒకేసారి కొడితే వందమందిని పడతారు.. ఇక్కడ ఒక్క మాటన్న తిరగబడతారు.. రీటేక్ , రీషూట్ లు ఉండవు. యాక్షన్ సీనులో డూప్ లు అసలే ఉండరు. అంతా నా ఇష్టం! అని ఒకరికి విడాకులు ఇవ్వకుండా.. విశాల దృక్పధంతో సహజీవనానికి సిద్ధపడితే ప్రతిపక్షాలు ఎన్నికల్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాయి. అదే నిజమైతే ఎన్నో కలలుగన్న ఎన్నికల రంగం నుంచి తప్పించనూ వచ్చు.. సినీమాయా ప్రపంచం నుంచి బయట పడితే.. పవనిజం.. నిజమే ఐతే.. ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.