రాములమ్మకు బెర్త్ లేనట్లేనా ?

Publish Date:Mar 25, 2025

Advertisement

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. నలుగురు కొత్త  మంత్రుల ప్రమాణ స్వీకారానికి, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నలుగురు కొత్త మంత్రులతో నాలుగు బెర్తుల భర్తీకి నిర్ణయం జరిగింది. అయితే  ఈ నలుగురిలో రాములమ్మ పేరు లేదు. అనూహ్యంగా ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న రాములమ్మకు మంత్రి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాజా ప్రోబబుల్స్ లో ఆమె పేరు లేదు. బహుశా  ఆర్ఏసీలో ఆమెకు బెర్త్ ఇస్తారో, లేక మిగిలిన రెండు ఖాళీల భర్తీ సమయంలో అవకాశం కల్పిస్తారో తెలియదు కానీ  ఇప్పటికైతే రాములమ్మకు క్యాబినెట్ బెర్త్ లేనట్లే అంటున్నారు.  

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారీ మంత్రి వర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చినా, ఎందుకనో అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. కానీ  ఇప్పడు అధిష్టానమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి,  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ లను ఢిల్లీకి పిలిపించి మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులతో మంత్రివర్గ విస్త్రరణతో పాటుగా  రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఆరు గ్యారెంటీల అమలు ఇతరత్రా విషయాలను సుదీర్గంగా చర్చించిన మీదట మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం అనుమతి ఇచ్చిందని  తెలుస్తోంది. 

అయితే  మొత్తం ఖళీలు ఒకేసారి కాకుండా.. ప్రస్తుతానికి ఓ నలుగురు కొత్త మంత్రులతో  ఉగాది ముహూర్తానికి ప్రమాణ స్వీకారం కానిచ్చి, మిగిలిన రెండు మంత్రి పదవులు,  మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీని మరో ముహూర్తానికి వాయిదా  వేసినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణతో పాటుగా,  డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్  ఖాళీలను కూడా భర్తీచేసేందుకు ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పినట్లు సమాచారం. 
మంత్రివర్గ విస్తరణకు ఓకే చెప్పడంతో పాటుగా, ప్రమాణ స్వీకారం చేసే నలుగురు కొత్త మంత్రుల పేర్లు కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వివేక్ వెంకట స్వామి, కోమటిరెడ్డి రాజ గోపాల రెడ్డితో పాటుగా మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని నిజామబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పిచాలనే నిర్ణయం జరిగింది. ఇక నిర్ణయం కావలసింది,ముహూర్తం మాత్రమే అంటున్నారు. అది కూడా ఉగాదికి  ముందుగానే ఉంటుందని అంటున్నారు. 

అయితే  ఇక్కడితో అయిపోయినట్లు కాదని, ఇప్పటి జాబితాలో చివరి నిముషం వరకు ఎవరు ఉంటారో, కొత్తగా ఎవరు చేరతారో చెప్పలేమని,అందుకే ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో గప్ చిప్ గా వచ్చి చేరిన రాములమ్మ విజయశాంతిలాగా, మంత్రివర్గం జాబితాలో ఇంకెవరైనా ఫైర్ బ్రాండ్ దూసుకు వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అవును మళ్ళీ రాములమ్మే, బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చని అంటున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీతో పాటుగా హోం మంత్రి బెర్త్ కూడా రిజర్వు అయినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే.  

అదలా ఉంటే, అడిగిన ప్రతి సారీ నో ..అంటూ మంత్రివర్గ విస్తరణను ఎప్పటికప్పడు  వాయిదా వేస్తూ వచ్చిన అధిష్టానం ఇప్పుడు పిలిచి మరీ మంత్రి వర్గ విస్తరణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే  గోనె ప్రకాష్ రావు వంటి కొందరు రాజకీయ విశ్లేషకులు ఇది కాంగ్రెస్ కల్చర్ లో భాగమని అంటున్నారు. గతంలో చెన్నా రెడ్డి హాయాంలోనూ ఇలాగే అధిష్టానం అనుమతి కోసం నెలలకు నెలలు నిరీక్షించిన మీదట, హఠాత్తుగా రాత్రి పిలుపు రావడమే కాకుండా మర్నాడే కొత్త మంత్రు ప్రమాణ స్వీకారం జరిగిందని గుర్తు చేస్తున్నారు. అంతే కదా  రాజు తలచు కోవాలే కానీ, విస్తరణ ఎంత పని.

By
en-us Political News

  
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు.
తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమని ముఖ్యమంత్రి అన్నారు.
మహానాడు ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు ఇండియన్ రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.1667కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదని మంత్రి టీజీ భరత్ అన్నారు.
కడప నగర శివారుల్లోని పబ్బాపురం లే ఔట్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మహానాడుకు భారీ సంఖ్యలో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. పూర్తిగా మహానాడు పసుపుమయం అయ్యింది. కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతాలు పలికారు.
ఊరాసాకు ఎకరం 99 పైసలకే ఇచ్చినట్టు నిలిపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. కడప నగరంలో పబ్బాపురం లే ఔట్ లో నిర్వహించిన మహానాడు మొదటి రోజు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ వరుకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ జీవో ఆర్టీ నంబర్ 1028ను జారీ చేశారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత, సొంత తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన లేఖ సృష్టించిన, సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపణలు ఇప్పటిలో ఆగేలా లేవు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే భద్రతకు కీలకమైన "కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పరిశోధన సంస్థను ఏర్పాటు చేయడానికి రూ.265 కోట్లు మంజూరు చేసింది.
కరకట్ట కమల్ హసన్ ఆర్కేపై కేసు నమోదైంది. మంగళగిరిలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ మీటింగ్‌లో ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఆ పార్టీ పెద్ద పండుగ మహానాడును కడపలో నిర్వహిస్తున్నారు. మంగళవారం (మే 27)న ప్రారంభమైన మహానాడు గురువారం (మే 28) వరకూ సాగుతుంది. కడప అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. దశాబ్దాలుగా కడప వైఎస్ కుటుంబానికి పెట్టని కోటగా నిలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.