Publish Date:May 22, 2025
నూతన రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్ సర్టిఫికెట్ గానీ, పెళ్లి పత్రిక గానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలు గానీ అవసరం లేదని ఆయన తెలిపారు
Publish Date:May 22, 2025
వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ సర్వం తానై చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కర్మఫలం అనుభవించడానికి రెడీ కాక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
Publish Date:May 22, 2025
ప్రజా సమస్యలు పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
Publish Date:May 22, 2025
ఇప్పటి వరకూ కేంద్ర మంత్రిగా కిషన్ రాష్ట్రానికి చేసిన మేలు ఏంటన్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వరకూ అందరూ అడిగి చూశారు. నో ఆన్సర్. ఇక రాజాసింగ్ ని అడిగితే కిషన్ రెడ్డి కిరికిరిలన్నీ ఇట్టే బయట పెట్టేస్తారు.
Publish Date:May 22, 2025
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ సర్వోత్న న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని జస్టిస్ గవాయి మండిపడ్డారు.
Publish Date:May 22, 2025
విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ కన్ఫెషన్ రిపోర్ట్ బయటకు రావడంతో ఒక్కసారిగా కేసులో క్లారిటీ వస్తోంది. సిరాజ్ , హైదరాబాద్కు చెందిన సమీర్, వరంగల్కు చెందిన ఫర్హాన్, యూపీకి చెందిన బాదర్తో కలిసి ఉగ్రవాద గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నారు.
Publish Date:May 22, 2025
అరెస్టు చేయడానికి వచ్చినపుడు బయట పోలీసుల ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అది చూసి నిందితుడు రెచ్చిపోయి, ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తాడు. అరెస్టు చేసి సెల్ లో వేశాకా, పోలీస్ మర్యాద మరో రకంగా ఉంటుంది.
Publish Date:May 22, 2025
Publish Date:May 22, 2025
ఇప్పటికే మొన్నటి ఆపరేషనన్ సిందూర్ ద్వారా ముజఫరాబాద్ లో లష్కరే శిబిరం ధ్వంసమైంది. ఇందులో హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ అతడి ఐదుగురు కమాండర్లు హతమయినట్టు వార్తలొచ్చాయ్. వీరితో పాటు మరో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారన్న రిపోర్టులొచ్చాయి. వీరిలో ముగ్గురు లష్కరే నాయకులున్నారు. ఒక దశలో హఫీజ్ సయీద్ సైతం చనిపోయాడన్న కథనాలు వెలువడ్డాయ్. అయితే ఈ దిశగా అధికారిక ప్రకటనలేవీ లేవు.
Publish Date:May 22, 2025
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న, వినయ్, విజయ్, కృష్ణ, నరసింహా.. ఇలా పలు పేర్లతో పిలిచే ఈ నక్సలైట్ నాయకుడి మరణం అతి పెద్ద విజయంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. హోం మంత్రి అమిత్ షా అయితే అమితానందం వ్యక్తం చేశారు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తి భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో హతమార్చడం ఇదే తొలిసారి అంటూ అమిత్ షా చేసి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Publish Date:May 22, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Publish Date:May 21, 2025
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయనీ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలనీ కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
Publish Date:May 21, 2025
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు.