కొత్త వి"నాయకులు"

Publish Date:Mar 7, 2014

Advertisement

 

వినాయక చవితి వస్తోందంటే చాలు.. ఉత్సవ కమిటీలు హడావిడి అంటా ఇంతా కాదు. పోటాపోటీగా పందిర్లు ఏర్పాటు, విద్యుద్దీపాలంకరణతో ఊరూ వాడా మెరిసిపొతాయి. దోనీ గణపతి, రోబో గణేష్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు గణపతి విగ్రహాలను తీర్చిదిద్ది నిలుపుతారు. అందరూ పూజించేది వినాయకుడినే .. కొలిచేది విఘ్ననాయకుడినే .. గణేష్ నవరాత్రులలో మాత్రం వీధికి ఒకలా గణనాధుడు మనకు కనిపిస్తాడు. కొత్త దేవుడండీ ..సరికొత్తా దేవుడండీ అని భక్తులు పాడుకొనేలా వీధి మారేసరికి గణపతి రూపాలు కూడా మారిపోతాయి. గతేడాది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల నేపధ్యంలో గణపతి కూడా సీమాంధ్ర, తెలంగాణా రూపాలను సంతరించుకున్నాడు. ప్రస్తుతం విభజన పూర్తి అయిపోయింది. దగ్గరలో వినాయకచవితి కూడా లేదు. కానీ సరికొత్త వినాయకులు పుట్టుకొస్తున్నారు. ఈ వినాయకులు ఎవరని మీరు ఆశ్చర్యపోవద్దు. మన దేశంలో ఏ పని కావాలన్న వినాయకుడి మాదిరిగానే వీరినే ముందు దర్శించుకోవాలి. దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి. దక్షిణ సమర్పించుకోవాలి. ఆనక ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాలి. ఇవన్నీ పూర్తి అయితే స్వాముల అనుగ్రహం పొంది కోరుకున్న పని జరుగుతుంది. వీరి దర్శనం అయితే ఇంకా శివుడిని ప్రార్ధించాల్సిన పని కూడా అంతగా ఉండదు. ఆయన రాష్ట్రంలో గవర్నర్, కేంద్రంలో రాష్టపతి లాంటి వాడు. ఆమోదముద్ర వేసి పారేస్తాడు.

 

రాజకీయ నవరాత్రోత్సవాలు వంటి ఎన్నికలకు ప్రకటన వెలువడింది. ఊరుకో రాజకీయ వి"నాయకుడు" కొలువైపోతున్నాడు. ఇందులో ప్రజల విఘ్నాలు తొలగించేది ఎందరో, దక్షిణలు, నైవేద్యాలు మింగేసి దయాదాక్షిణ్యాలు లేకుండా దోచుకునేది ఎందరో భక్తులైన ఓటర్లకు కొద్దిరోజుల్లో తత్త్వం బోధపడనుంది. ఎన్నికల నవరాత్రోత్సవాలు ముగిసేసరికి జనం కొంత మంది నేతాగ్రేసరులను నిమజ్జనం చెసేస్తారు. ఇవన్నీ కొత్తా దేవుళ్ళం అనిపించుకునేందుకు ఈ ఎన్నికల్లో చాలా మంది బరిలోకి దిగుతున్నారు.

 

మ్యాచ్ అయిపోలేదని అందరినీ చివరి బంతి వరకూ గ్రౌండ్లో కూర్చో పెట్టి ప్రత్యేక రాష్రం సినిమాను శుభం కార్డు పడేవరకు చూపించిన నల్లారి వారు పార్టీ పెడుతున్నారు. నిజమండీ నమ్మండీ .. స్వయంగా ఆయనే చెప్పేశారు. ఎన్నికల తరువాత కిరణ్ అనే వినాయకుడు కాంగ్రెస్ లో నిమజ్జనం కాక తప్పదని తెలుగు తమ్ముళ్ళు మైకు పట్టుకు అరుస్తున్నారు. జైలు..బెయిల్ పార్టీగా టీడీపీ నేతలు వర్ణిస్తున్న వై సి పీ కూడా 10 జనపథ్ ఆలయంలో విలీనం జరిగితీరుతుందని.. దమ్ముంటే బెట్టింగ్ కాయమంటున్నారు. ఇక గత ఎన్నికలకు ముందు వచ్చిన చిరంజీవి ..ప్రజరాజ్యం పార్టీ స్థాపించి.. వై ఎస్ రాజ్యం ఏర్పడేందుకు ప్రత్యక్షంగా సహకరించాడు. పరోక్షంగా టీడీపీని అధికారంలోకి రాకుండా అడ్డుకున్నారు మన అందరివాడు. పార్టీ లక్ష్యం నెరవేరకపోయినా ..తన ‘చిరు లక్ష్యం’ మాత్రం నెరవేర్చుకున్నారాయన. ఓటడిగే ఎన్నిక నుంచి చాటుమాటుగా ఎన్నికయ్యే రూటు చేరుకున్నాడు. కాంగ్రెస్ అనే మహాసముద్రంలో తన ప్రజా రాజ్యాన్ని నిమజ్జనం చేశాడీ వినాయకుడు.

 

ఎన్నికలకు ముందు తన సైన్యం బరిలో దిగుతుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మరో వింత వినాయకుడి అవతారం ఎత్తనున్నాడు. అన్న మాదిరిగానే ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ ఎవరిని పవర్ కు దూరం చేస్తాడో అనే టెన్షన్ తో పాత వినాయకులు బిక్క చచ్చిపోయున్నారు. పవన్ ఎవరి పుట్టి ముంచుతాడో అనే భయంతో పార్టీలన్నీ ఎన్నికల నవరాత్రోత్సవ జాగారం చేస్తున్నాయి.

 

ప్రాంతం కార్డుతో మరికొన్ని పార్టీలు, కులం పేరుతొ ఇంకొన్ని పార్టీలు తమ వినాయకులను ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి వినాయకచవితికి ఘనంగా పూజలు అందుకునే వినాయకు విగ్రహాలను నవరాత్రోత్సవాలు ముగిసిన వెంటనే నిమజ్జనం ఆనవాయితీ. ఆలాగే ప్రతి ఐదేళ్ళకు ఓసారి జరిగే ఎన్నికల వేడుకల సందర్భంగా కొత్త దేవుళ్ళను నిమజ్జనం చేస్తారు జనం. మరికొందరు వినాయకులు శివాలయాల్లాంటి జాతీయ ప్రాంతీయ పార్టీల కార్యాలయాల ప్రాంగణాలకు చేరుకొని ఉత్సవ విగ్రహాల్లా పూజలు అందుకుంటున్నారు.

 

ఆలె నరేంద్ర, దేవేందర్ గౌడ్ , కాసాని జ్ఞానేశ్వర్, చిరు ప్రజారాజ్యం, విజయశాంతి తల్లి తెలంగాణా, లక్ష్మిపార్వతి, హరికృష్ణ వంటి వారు స్థాపించిన పార్టీలు ఇప్పుడు వికీపీడియా లో వెతికినా దొరకవు. మరి కొత్తా పార్టీలు పెట్టే వారంతా పాత వినాయకులుగానే మిగిలిపోతారా.. లేదంటే గణేష్ మహారాజ్ కీ జై అనిపించుకుంటారా? అనేది ప్రజాస్వామ్యానికి మహా భక్తులైన ఓటఋ మహాశయులు తేలుస్తారు.

By
en-us Political News

  
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.