బేంబూ వాలా దీదీ.. నేహ విజయగాధ.. ఎందరికో స్ఫూర్తిదాయకం!

Publish Date:Feb 16, 2026

Advertisement

సంక్షోభాలలో అవకాశాలు వెతుక్కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతుంటారు. అలా రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన సంక్షోభం నుంచి అవకాశాలను అన్వేషించి పేరు వినా మరేమీ మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి బాటలో నడిపారు. నడిపిస్తున్నారు.  చంద్రబాబును ఆదర్శంగా తీసుకుందో ఏమో ఓ యువతి ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి విజయం సాధించింది.  రూ. 5 వేలు కూడా అప్పుపుట్టని పరిస్థితి నుంచి  నెలకు రూ.50 వేలు సాధించే స్థితికి చేరుకుంది.

ఆమె పేరు నేహ. రాంచీకి చెందిన ఈ యువతి  గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే సరైన ఉద్యోగం దొరక లేదు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ స్థితిలో తనకు తెలిసిన పెయింటిగ్ ను వృత్తిగా మార్చుకోవాలని తలపోసింది. అయితే అందుకు అవసరమైన పెట్టుబడి డబ్బు ఆమె వద్ద లేదు. ఒక్క ఐదు వేల రూపాయలు అప్పుదొరికితే చాలు.. తాను అనుకున్నది చేయగలనన్న ఆత్మవిశ్వాసం నేహది. అయితే ఆమెకు ఆ ఐదువేలు అప్పు ఇచ్చేవారే కరవయ్యారు.  దీంతో ఆమె ఏం చేయాలి? అసలు తానేమైనా చేయగలనా? అని దిగులు పడింది. ఆ పరిస్థితుల్లో తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తో ప్రభుత్వం నుంచి రూ. 50 వేల రూపాయల రుణం తీసుకుంది.  ఆ సొమ్ముతో వెదురుతో వస్తువులు,   ఆభరణాలు తయారు చేయడంలో శిక్షణ పొందింది.  అలా శిక్షణ పొందిన నేహ వెదురుతో   నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్‌లు తదితర ఆర్నమెంట్స్ తయారు చేసి, వాటిపై తన పెయింటింగ్ నైపుణ్యం ఉపయోగించి ఆర్గానిక్ పెయింటింగ్ చేయడ మొదలు పెట్టింది.   పర్యావరణ హితం, చూడడానికి అద్భుతంగా కనిపించే ఈ ఆభరణాలకు మంచి గిరాకీ లభించింది.

పర్యావరణ ప్రేమికులు నేహ తయారు చేసే ఆభరణాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆమె వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది. కేవలం రాంచీకే పరిమితం కాకుండా.. కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా లలో  జరిగే ఎగ్జిబిషన్లలో స్టాల్స్ ఏర్పాటు చేసి తన వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఇప్పుడు నేహకు దేశవ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. తన ప్రతిభ, నైపుణ్యానికి సానబట్టి, సృజనాత్మకతతో ఆమె చేస్తున్న వెదురు ఆభరణాల ద్వారా ఇప్పుడు ఆమె నెల సంపాదన రూ. 50 వేలు దాటింది. దీంతో ఆమె తన కుటుంబాన్ని కూడా పోషించగలుగుతున్నారు. ఆర్థికంగా స్థరపడ్డారు. ఇప్పుడంతా ఆమెను బేంబూ వాలీ దీదీ అని పిలుస్తున్నారు.  వివాహాలు,   రిసెప్షన్ల కోసం ఆమె వెదురు ఆభరణాలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడు నేహ లేడీ ఎంటర్ పెన్యూర్.  తనలా ఉపాధి కోసం వెతుక్కుంటున్న వారికి వెదురు ఆభరణాల తయారీలో శిక్షణనిస్తూ మరింత మంది లేడీ ఎంటర్ పెన్యూర్ లను తయారు చేస్తున్నది. 

By
en-us Political News

  
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్‌తో కలిసి బైక్‌పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్‌కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్‌పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు. గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.