యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య..!

Publish Date:Jul 19, 2026

Advertisement

 

భయంతో యువకుడి సుసైడ్..!

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాజానికి సేవ చేయాలనే ఉన్నత ఆశయాలతో, ఎన్నో అవధులు లేని ఆశలతో డాక్టర్ చదువుతున్న ఇరవై ఏళ్ల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న ప్రేమోన్మాదానికి బలవ్వగా, ఆమె మృతికి కారణమైన ఇరవై రెండు ఏళ్ల చిలుముల రామ్ చరణ్ అనే యువకుడు కూడా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కన్నవారి కలలను నిజం చేస్తూ సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న లక్ష్మీ ప్రసన్న ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం తన స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. అయితే, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు రామ్ చరణ్‌ను మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో దూలానికి ఉరివేసుకుని కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి ఈ ఘోరాన్ని గమనించి కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం అందించింది. శనివారం ఉదయానికి నిందితుడు రామ్ చరణ్ కూడా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న తన తండ్రి నర్సింహ సమాధిపై తన రక్తంతో లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్ అయిన 'చిన్నారి' అనే పేరును రాసి, పక్కనే ఉన్న తాటిచెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

 శుక్రవారం సాయంత్రం రామ్ చరణ్ మరో వ్యక్తితో కలిసి లక్ష్మీ ప్రసన్న ఇంటికి వెళ్లినట్లు స్థానికులు చెప్తుండటంతో, యువతి మృతి వెనుక హత్య కోణం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వగ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. ఈ ఘటనపై శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Nalgonda MBBS student suicide, Lakshmi Prasanna medical student death, Kattangur Munukuntla news, Ram Charan suicide Nalgonda, Suryapet medical college student, Telangana crime updates, CM Revanth reddy, Telangana goverment

By
en-us Political News

  
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
ట్రైనీ ఐపీఎస్‌కి న్యాయం జరగాలి..విచారణ పూర్తికాకముందే దోషిగా ప్రకటించడం సరికాదు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.