20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం : మంత్రి నారా లోకేష్

Publish Date:May 13, 2026

Advertisement

 

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. “మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (NSE), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సిఐఐ సంయుక్తంగా నిర్వహించిన “SME IPO – Alternative Funding Option For Growth” అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలకు మూలధన మార్కెట్ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... యువగళం పాదయాత్రే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణ యువగళం పాదయాత్రలో తనకు ఎదురైన ఒక సంఘటన 20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ప్రేరణగా నిలిచిందని మంత్రి లోకేష్ తెలిపారు. 

“226 రోజులు, 3132 కిలోమీటర్లు నడిచిన యువగళం పాదయాత్రలో ఎన్నో కుటుంబాల కష్టాలు, ఆశలు, ఆకాంక్షలను దగ్గరగా చూశాను. ఒకరోజు పెనుగొండలో కియా వద్ద సెల్ఫీలు దిగేందుకు దారుణమైన ఎండల్లో 23 కి.మీ నన్ను జాతీయ రహదారిపై నడిపించారు. అక్కడే కియా అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న పద్మావతి అనే చెల్లి నాతో కలిసి నడిచింది. కియా, అనుబంధ పరిశ్రమలు రాకముందు ఆమె గృహిణి. బాగా చదువుకుంది కానీ ఉద్యోగం చేయలేదు. 

కియా అనుబంధ సంస్థలు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులను ఒప్పించి ఉద్యోగంలో చేరింది. నెలకు రూ.30 వేలు సంపాదిస్తోంది. అప్పటివరకు భర్త మీద ఆధారపడిన ఆమె, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని కూడా చూసుకుంటోంది. ఆమె కథ విన్న తరువాత నాకు ఉద్యోగ కల్పన ఎంత ముఖ్యమో అర్థమైంది. ఆ ఆలోచనల నుంచే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం పుట్టింది. మేము ఇచ్చిన మ్యానిఫెస్టో ‘సూపర్ 6’ హామీల్లో కూడా మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాల కల్పనే. ఈ లక్ష్య సాధన కోసం అందరం పని చేస్తున్నాం.” అని పేర్కొన్నారు.

 పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ 

“గత 23 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌లా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు 800 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు కుదిరాయి. గూగుల్ రూ.1.35 లక్షల కోట్లు, ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చాయి. వాటికి శంకుస్థాపనలు జరిగాయి. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. రాయలసీమలోని పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కేంద్రం ‘AMCA’ ప్రాజెక్టు కూడా ఏపీలో ఏర్పాటు కానుంది” అని వెల్లడించారు.

 గూగుల్ వల్లే క్యారియర్ ఏపీకి వచ్చింది – ఇదే మల్టిప్లయర్ ఎఫెక్ట్ 

“ప్రతి పెట్టుబడి వెనుక ఒక ప్రత్యేక కథ ఉంటుంది. డేటా సెంటర్లు వస్తే ఉద్యోగాలు ఎలా వస్తాయని చాలా మంది నన్ను ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా డేటా సెంటర్లు ఏర్పాటుకు విశాఖ నగరానికి అనేక కంపెనీలు క్యూ కట్టాయి. ఇప్పటికే గూగుల్ కంపెనీ శంకుస్థాపన జరగగా, మరికొద్ది రోజుల్లో ఇంకో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రానుంది. దానికి కూడా మంత్రివర్గం త్వరలో ఆమోదం తెలపనుంది. 

డేటా సెంటర్ ఎంత ముఖ్యమో, డేటా సెంటర్‌కు కావాల్సిన ఎకోసిస్టమ్ కూడా అంతే ముఖ్యం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావడంతోనే రాయలసీమకు క్యారియర్ కంపెనీ వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్స్ అవసరం అవుతాయి. ఆ అవసరాన్ని తీర్చేందుకు క్యారియర్ కంపెనీ శ్రీసిటీలో పెట్టుబడులు పెడుతోంది. దీనినే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అంటారు. ఒక పెద్ద పెట్టుబడి వస్తే, దాని చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ” అని వివరించారు.

 క్లస్టర్ మోడల్‌తో అభివృద్ధి వికేంద్రీకరణ 

“మొదటిసారిగా మేము ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని కలిసికట్టుగా పని చేస్తున్నాం. ‘ఒకే రాజధాని – అభివృద్ధి వికేంద్రీకరణ’ ప్రభుత్వ లక్ష్యం. మన ఎకానమీ 200 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2047 కల్లా 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. దాని కోసం క్లస్టర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 22 క్లస్టర్ల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాం.
 
రాయలసీమలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ కోస్తాంధ్రలో CBG ప్లాంట్లు, ఆక్వా, అమరావతిలో క్వాంటం టెక్నాలజీ ఉత్తరాంధ్రలో ఫార్మా, డేటా సెంటర్లు, మెడికల్ ఎక్విప్‌మెంట్, ఐటీ రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాం. నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈలు కీలకం 

“మాకు గూగుల్ ఎంత ముఖ్యమో, రూ.50 లక్షలతో ప్రారంభమయ్యే ఎంఎస్ఎంఈ కూడా అంతే ముఖ్యం.  ఆర్సెలార్ మిట్టల్ ఎంత ముఖ్యమో, కోటి రూపాయలతో ప్రారంభమయ్యే చిన్న సంస్థ కూడా అంతే ముఖ్యం. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం సాధించాలంటే ఎంఎస్ఎంఈల పాత్ర కీలకం. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు అడుగులు వేస్తున్నాం. 

ప్రతి ఎంఎస్ఎంఈకి అనుమతుల నుంచి రాయితీల వరకు అన్ని ప్రక్రియలను సరళీకృతం చేస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లు ఎక్కడికీ వెళ్లకుండా అన్ని అనుమతులు ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు 20 లక్షలకు పైగా ఉన్నాయి. వాటన్నింటినీ ప్రోత్సహించే బాధ్యత ఎంఎస్ఎంఈ శాఖ మంత్రిదే. ఇది సాధ్యం కావాలంటే ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు కావాలి. ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చెందితే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వాటి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అదే ప్రభుత్వ లక్ష్యం” అని తెలిపారు.

 మూడు నెలల్లో 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలి 

“NSE ద్వారా చిన్న కంపెనీలు పెద్ద సంస్థలుగా ఎదిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు NSEలో 723 కంపెనీలు లిస్టై రూ.22,415 కోట్ల నిధులు సమీకరించాయి. అందులో 158 సంస్థలు మెయిన్ బోర్డుకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కేవలం మూడు సంస్థలు మాత్రమే NSEలో లిస్ట్ అయి రూ.100 కోట్ల నిధులు సమీకరించాయి. వచ్చే మూడు నెలల్లో కనీసం 100 కంపెనీలు NSEలో లిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈ శాఖ పనిచేయాలి” అని సూచించారు.

 దేశం చూపు..మ‌న వైపు

ఔత్సాహికవేత్తల్లో పోటీతత్వం.. పట్టుదల ఉండాలి. మ‌న దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికి రావడం గర్వకారణం. పారిశ్రామికవేత్తలకు ఏ కష్టం వచ్చినా ఒక మెసేజ్ దూరంలో నేను ఉంటా.  ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న కంపెనీలు ప్రపంచ స్థాయి పెద్ద సంస్థలుగా ఎదగాలి. మరిన్ని ఉద్యోగాలు, మరింత‌మంది పారిశ్రామికవేత్తలు, మరిన్ని విజయగాథలు సృష్టిద్దాం” అని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు NSE సీఈఓ, ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, కేశినేని శివనాథ్ (చిన్ని), ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ ఎం. విశ్వ, SEBI, NSE, ఇండోరెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టీల్ సిటీ సెక్యూరిటీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.


 

By
en-us Political News

  
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో, తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భాగ్యనగర ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉపశమనం పొందారు. మంగళవారం (మే 26) అర్థరాత్రి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరాన్ని భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులకు తెగబడితే.. తాము చేసే ప్రతీకారం చాలా తీవ్రంగా, బలంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సారి యుద్ధం మొదలైతే.. ఇరాన్ రియాక్షన్ ప్రాంతీయ సరిహద్దులకే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తుందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది.
దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులకు వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భక్తుల రద్దీతో కిక్కిరిసే క్యూలైన్లలోనే కుక్కలు సంచరిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.
అయితే ఎవరు ఔనన్నా కాదన్నా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. బారాసత్ టీఎంసీ ఎంపీ కాకొలి ఘోష్ దస్తీదార్, ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన ఒక అధికారిక సమీక్షా సమావేశానికి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల లోక్‌సభలో టీఎంసీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాకొలి ఘోష్, ఆ తర్వాత బారాసత్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై-కేటగిరీ భద్రతను కల్పించింది.
ఈ వివాదం మొత్తం పినరయి విజయన్ కుమార్తె టి. వీణా థాయికండియిల్ చుట్టూ తిరుగుతోంది. ఆమెకు చెందిన బెంగళూరు ఆధారిత ఐటీ సంస్థ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు, కొచ్చికి చెందిన సీఎంఆర్ఎల్ కంపెనీకి మధ్య జరిగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం.
కొండంత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సాయి సుదర్శన్ దురదృష్టకరమైన రీతిలో ఔటవ్వడం పెద్ద దెబ్బగా మారింది. సాధారణంగా హిట్ వికెట్ ఔట్ అవ్వడం మనం చూసే ఉంటం. కానీ సాయి సుదర్శన్ హిట్ వికెట్ అయిన తీరు మాత్రం ఇప్పటి వరకూ ఎన్నడూ చూసి ఉండం.
ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసిన ఈశాన్య ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ బృందం అక్కడ లభ్యమైన బుల్లెట్ షెల్స్, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక మరేదైనా వివాదం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 93 పరుగులు నాటౌట్ గా నిలిచి గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బెంగళూరు గుజరాత్ పై ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో కదం తొక్కారు.
తెలంగాణలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు.
వైజాగ్ బీచ్‌లో అరుదైన వింత.. సముద్రాన్ని ముద్దాడిన ఆకాశం
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన వేతన సవరణ ఉత్తర్వులు చివరకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.