ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ఎంపీ చామల... సంచలన ఆరోపణలు

Publish Date:Jun 6, 2026

Advertisement

 

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం  ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో బాధితుడిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపించారు.

జులై 30 నుంచి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు SIT గుర్తించిందని ఆయన వెల్లడించారు. తన ఐఫోన్‌కు ముందుగానే భద్రతా హెచ్చరిక (అలర్ట్) వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సంభాషణలను తెలుసుకునే ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.

అప్పటి ప్రభుత్వంలో సొంత పార్టీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పేర్కొన్న ఆయన, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని అన్నారు. ఈ వ్యవహారం గురించి అప్పటి బీఆర్ఎస్ నేతలకు తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. అధికారం కోసం ఏదైనా చేసే విధంగా వ్యవహరించారని విమర్శించారు.

ఈ కేసులో నిందితులకు తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును SIT వేగవంతం చేసిన నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులను విచారణకు పిలుస్తోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఆయన కమ్యూనికేషన్ వివరాలు, కాల్ రికార్డులు, అనుమానాస్పద ట్యాపింగ్ ఘటనలకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరు కీలక వ్యక్తులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 

By
en-us Political News

  
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్‌కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్‌తో పాటు 4 ఆటో రైడ్స్‌ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.
వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించే వ్యూహంతో సెలక్టర్లు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేయడమే కాకుండా, ఆయనను జట్టు నుంచే తప్పించారు. అలాగే.. ఐపీఎల్ 2026 సీజన్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. ఇక తెలుగుతేజం, యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు.
డీఎస్సీ పరీక్షల్లో విఫలమైన లక్షలాది మంది నిరుద్యోగ యువతలో ఉండే సహజమైన అసంతృప్తిని, నిరాశను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో ఉద్రిక్తతలు మరియు విభేదాలు సృష్టించేలా సాగుతున్న ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ జగన్ నైజానికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ , సీబీఎస్‌ఈ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ కుదుపునకు దారితీసింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.