సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు. ఇప్పటికే 400 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన ఆయన, శనివారం మరో 210 మంది పిల్లలకు సైకిళ్లు పంపిణీ చేసి వారి ఆనందానికి కారణమయ్యారు. స్థానిక పీఎస్ఆర్ గార్డెన్లో జరిగిన ఈ కార్య క్రమంలో ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల బాలురు, బాలికలకు ప్రత్యే కంగా సైకిళ్లు అందజేశారు. ప్రతి చిన్నారికి జగ్గారెడ్డి స్వయంగా సైకిల్ అందించి వారిని ప్రోత్సహించారు.
చిన్నారుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం, అలాగే చదువుపై ఆసక్తి కలిగించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్య మని ఆయన తెలిపారు. గత వారం టోకెన్లు పొందిన చిన్నారులకు ఈ విడతలో సైకిళ్లు పంపిణీ చేశారు. టోకెన్లు పొందలేకపోయిన చిన్నారుల కోసం మరో విడత పంపిణీ చేపట్టనున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. అందుకోసం చిన్నారుల ఆధార్ వివరాలు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు నమోదు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
"సైకిల్ రాకపోయిందని ఏ చిన్నారి నిరాశ చెందవద్దు. పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సైకిల్ అందజేస్తామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో అక్కడికి వచ్చిన చిన్నా రులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల సంక్షేమం కోసం కొనసాగుతున్న ఈ కార్యక్ర మం స్థానికంగా విశేష ఆదరణ పొందుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagga-reddy-distributes-bicycles-to-children-in-sangareddy-36-222096.html
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్తో పాటు 4 ఆటో రైడ్స్ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.