మాస్కోలోని స్బేర్ సిటీని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ & ఇన్నోవేషన్ డైరెక్టర్ ఆల్బర్ట్ ఎఫిమోవ్ స్బేర్ సిటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవ్జెనియ్ చులానోవ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇలియా పుల్నర్ మంత్రి లోకేష్ బృందానికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వ్యాధినిర్ధారణ, ఇతర ఆవిష్కరణలతో కూడిన స్బేర్ బ్యాంక్ ఎటిఎంను పరిశీలించి, పనితీరును అడిగి తెలుసుకున్నారు.
తర్వాత స్బేర్ సిటీ ప్రతినిధులు అక్కడి ఆర్ & డీ, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్ కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యంత విశ్వసనీయమైన ఎంటర్ప్రైజ్ హార్డ్వేర్ అప్టైమ్ను నిర్ధారించడం, అంతర్గత సాఫ్ట్వేర్ ఎకోసిస్టమ్లను అమలు చేయడం, స్థానికీకరించిన కార్పోరేట్ టెక్ ఆధునీకరణను ముందుకు నడపడంపై తాము దృష్టిసారించినట్లు వారు తెలిపారు.
ఆటోమేటెడ్ మౌలిక సదుపాయాలు, స్మార్ట్ పరికరాల నెట్వర్క్లు, విస్తృతమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) ఛార్జింగ్ గ్రిడ్ల అధిక-లోడ్ డిమాండ్లను నిర్వహించగల వినూత్న విద్యుత్ వ్యవస్థలను అమలు చేయడం తమ లక్ష్యమని చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన స్బేర్ సిటీ భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని మంత్రి లోకేష్ కొనియాడారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh-visited-sber-city-36-222098.html
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక అపూర్వమైన, వినూత్నమైన పోరాటం రోడ్డెక్కింది.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది.
టీడీపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్నట్లు పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లేనిపోని వివాదాలకు కారణమవుతున్నారు.
భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బత్తిని కుటుంబ సభ్యుల సాంప్రదాయ చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
సంగారెడ్డి జిల్లాలో చిన్నారుల కోసం చేపట్టిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరింత విస్తరించారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్తో పాటు 4 ఆటో రైడ్స్ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.