మొదటి సారి నా సర్వే తప్పయింది

Publish Date:Jan 30, 2019

Advertisement

 

తెలంగాణ ఎన్నికల సమయంలో విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో మహాకూటమి గెలుస్తుందని వెల్లడించగా..ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడితోనే తప్పుడు సర్వే ప్రకటించారని ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. అయితే ఫలితాల అనంతరం లగడపాటి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడింది లేదు.  కాగా ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను ప్రకటించిన సర్వేకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో తనపై వచ్చిన ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు. 

"గత కొన్ని రోజులుగా నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందిచాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చా. ఎవరి ప్రలోభాలకు నేను లొంగే వ్యక్తిని కాదు. స్వతంత్ర వ్యక్తిని. చెప్పిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి తప్పుకున్నా. ఎంతో మంది ఒత్తిడి చేసినా మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు. నా సర్వే తప్పయితే తప్పని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా వల్ల ఎక్కడైనా తప్పు జరిగితే క్షమాపణ చెబుతా. 2003 నుంచి అనేక రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలు చేశా. పార్టీలు, మీడియాతో సర్వే వివరాలు పంచుకున్నాను. ఎప్పుడూ సర్వే వివరాల్లో పెద్దగా తేడా రాలేదు. మేం చేసిన సర్వే ఫలితాలు మొదటిసారి తారుమారయ్యాయి. 

పోలింగ్‌కు సంబంధించి రాజకీయ పార్టీలకు అనేక అనుమానాలు ఉన్నాయి. పోలింగ్‌ శాతం వివరాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. ఆ వివరాలు చెప్పడానికి ఈసీకి ఒకటిన్నర రోజులు పట్టింది. ఎలక్ట్రానిక్‌ యుగంలో ఇంత సమయం ఎందుకు పట్టింది. తెలంగాణ ఎన్నికల్లో గణనీయంగా డబ్బు ప్రభావం ఉందని చెప్పా. ఇబ్రహీంపట్నం సహా వివిధ నియోజకవర్గాల్లో వీవీ ప్యాట్‌లు లెక్కించాలని కోరారు. వీవీ ప్యాట్‌లు లెక్కిస్తే అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై హైకోర్టులో కేసు విచారణ జరగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బలం గణనీయంగా పెరిగింది" అని వివరించారు. "రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు సర్వే వివరాలు చెప్పను. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే చెబుతాను. నేను మాటమీద నిలబడే వ్యక్తిని. నా అనుమానాలు నివృత్తి చేసుకున్నా. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత వివరాలు వెల్లడిస్తా’’ అని రాజగోపాల్‌ వెల్లడించారు.

By
en-us Political News

  
మంత్రి పదవి విషయంలో మనుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌పై మంత్రి వెంకట్‌ రెడ్డి స్పందించారు.
సికింద్రాబాద్ సృష్టి షెర్టిలిటీ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
దేశంలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం మరోసారి ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సిద్ధమని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఏంటీ జ‌గ‌న్ మోహ‌న రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న‌పై ఉన్న 31 కేసుల‌లో 3452 సార్లు.. వాయిదాలు తీసుకుని ప్ర‌పంచ రికార్డు సృష్టించారా? ఇందుకోసంగానూ ఆయ‌న 6904 కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు చేశారా? ఆశ్చర్యం కలిగిస్తున్నా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. బేసిగ్గా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్యమంత్రిగా త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో .. సీఎంగా తన హోదా కారణంగా బిజీబిజీ అంటూ వాయిదాల మీద వాయిదాలు తీసుకున్న‌సంగ‌తి తెలిసిందే.
బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబ‌ర్ 1/12లో రోడ్డు కుంగిపోయింది. అటు వచ్చిన వాటర్ ట్యాంకర్ ఒక్కసారిగా దిగబడిపోయింది. దీంతో వాట‌ర్ ట్యాంక‌ర్ డ్రైవ‌ర్‌తో పాటు క్లీన‌ర్‌కు తీవ్ర గాయాల‌య్యాయి.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దీర్ఘకాలంగా సాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును క్వాష్ చేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం అనుమతించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై డిపాజిటర్ల నుంచి ఎటువంటి అభ్యంతరం, ఆరోపణా లేకపోవడంతో కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.
ఋతుపవన ద్రోణి, బంగాళాఖాతం లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ పట్టణంలో క్లౌడ్ బరస్ట్ ధాటికి కొండ చరియాలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహంతో వందలాది ఇళ్లను ముంచేంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయాన్ని సీబీఐ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడంతో.. ఇప్పడు చర్చ ఈ కేసులో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపైకి మళ్లింది.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్ కు పంపించారు.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
వాన రాకడ.. ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. ఏదీ మన చేతుల్లో ఉండదు. మరణం ఎప్పుడు, ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం. పెద్ద పెద్ద ప్రమాదాల బారిన పడి కూడా ప్రాణాలతో బయటపడే వారుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.