Publish Date:Jan 30, 2019
అస్సాంలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్నారితో పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల సభల్లో ఆందోళనకారులు నల్ల చొక్కాలు ధరించి,నల్ల జండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనొవాల్ బిస్వాంత్ జిల్లాలో ర్యాలీని నిర్వహించారు. నిరసనల నేపథ్యంలో సొనోవాల్ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి నల్ల చొక్కాలు వేసుకురావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.
ఈ నేపథ్యంలో ఓ మహిళ, మూడేళ్ల తన చిన్నారితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. కారణం అడగ్గా.. మీ చిన్నారి నల్ల స్వెట్టర్ వేసుకున్నాడు. దాన్ని విప్పేస్తేనే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. అంతేకాక స్వయంగా వారే ఆ చిన్నారి స్వెట్టర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ చర్యకు భయపడిన చిన్నారి ఏడవడం ప్రారంభించాడు. దీంతో ఆ మహిళే తన కుమారుడి స్వెట్టర్ ను విప్పేసింది. ‘నా మూడేళ్ల చిన్నారి నల్ల రంగు స్వెటర్ వేసుకున్నాడు. దీంతో నా కుమారుడిని ఆ సమావేశానికి హాజరుకానివ్వబోమని భద్రతా సిబ్బంది అన్నారు. ఆ స్వెటర్ను విప్పేయాలని ఆదేశించారు’ అని ఆ చిన్నారి తల్లి మీడియాకు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించిన భద్రతా సిబ్బంది తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు . నల్ల రంగును చూస్తేనే పోలీసులు, అధికారులు ఒణికిపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. చిన్న పిల్లోడు సీఎం సభ అడ్డుకుంటాడా? అని ప్రశ్నిస్తున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సొనోవాల్ దీనిపై దర్యాప్తు జరపాలని డీజీపీని ఆదేశించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/crying-toddler-forced-to-remove-black-jacket-before-assam-cms-rally-39-85608.html
తెలంగాణలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాది కొత్తగూడెంలో పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందజేశారు.
తొలి ఏకాదశి సందర్బంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆషాడ సారెను సమర్పిస్తే మరింత శుభం కలుగుతుందనే నమ్మకంతో వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చాయి.
నెల్లూరులోని ప్రసిద్ద బారాషషీద్ దుర్గ వద్ద రొట్టెల పండుగ ఇవాళ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ పండుగ ఐదు రోజుల పాటు జరిగే పాటు జరగనున్నది.
పేలుడు పదార్థాలు లభ్యమైన కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉన్న పార్టీలో ఉన్నట్టు ఉండి ఉంటే వీళ్ల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదేమో. కానీ అత్యాశ కొంప ముంచేసింది. పెట్టిన చేతినే కరవడంతో పాము, మొసలినే మించి పోయారీ ఇద్దరూ. కారణం ఈ భూ ప్రపంచంలో పెట్టిన చేతినే కరిచే బుద్ధి కేవలం పాము, మొసలికి మాత్రమే ఉంటుందట.ఆ
క్యాప్షన్ కొత్తగా ఉందన్న మాటే కానీ మేటర్ మాత్రం చాలా చాలా పాతదే. పెద్దగా కంగారు పడకండి. కారణం ఏంటంటారా? అప్పుడే అభ్యర్ధుల ప్రకటన చేస్తున్నారట అతి- ఉత్సాహి జగన్. ఇప్పటికే వంద మంది పేర్లు వంద సీట్లకు ఖరారు చేసేశారట.
హైదరాబాద్ నడి బొడ్డున 1982 మార్చి 29న పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టీఆర్ఎస్ అయినా పుట్టిన పుష్కర కాలానికిగానీ అధికారంలోకి రాలేదు. అదే టీడీపీ ఏకంగా 9 నెలల్లోనే అధికారం చేపట్టి ప్రపంచ రాజకీయ చరిత్రలోనే మరెవరికీ సాధ్యం కాని ఒక చరిత్రను సృష్టించింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది.
ప్రపంచ అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా పార్టీ పేరుతో నూతన పార్టీ ప్రకటించారు. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్చ ఇచ్చేందుకే పార్టీ ఏర్పాటు చేశానని ఎలాన్ మస్క్ తెలిపారు.
ఎడ్జ్బాస్టన్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లోనూ భారత్ 427/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు.
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ను అరెస్ట్ చేసి 81 లక్షల రూపాయల విలువైన 26 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు.
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి స్కూల్ వద్ద గుప్తనిధుల కోసం వినాయక విగ్రహాన్ని పగులగొట్టి త్రవ్వకాలకు పాల్పడిన 13 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.