రూ.5 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే

Publish Date:Feb 21, 2026

Advertisement

 

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే చంద్రులామని లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు వలవేసి పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన శనివారం గడగ్ జిల్లాలో చోటుచేసుకుంది. షిరాహట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

గడగ్ జిల్లాలో నీటి పారుదల శాఖకు సంబంధించిన ఓ పనికి అనుమతి, ఆమోదం కోసం క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్‌ను ఎమ్మెల్యే రూ.11 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. క్లియరెన్స్ ఇవ్వాలంటే మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టర్ కర్ణాటకలోని అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త అధికారులుకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసులు సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంలో ట్రాప్ ఏర్పాటు చేశారు. మొత్తం రూ.11 లక్షల్లో అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యేను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం స్వీకరణకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.ఈ కేసుతో సంబంధం ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో అవినీతి నిరోధక చర్యల్లో లోకాయుక్త కీలక పాత్ర పోషిస్తోంది.

By
en-us Political News

  
ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేశారు.
జూబ్లీహిల్స్‌ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు.
పాకిస్థాన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణంతో నిత్యావసర వస్తువుల ధరలు తార స్థాయికి చేరాయి.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఒకే రోజు రెండు సార్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పెళ్లి జరగనుంది
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్ 36లోని మంగళగౌరి షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెంటనే గుర్తొచ్చే పేరు నారా లోకేష్.
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటి యజమాని తాళం చెవిని దాచిన ప్రదేశాన్ని చూసి 14 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన జగద్గిరిగుట్ట, ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో వెలుగుచూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.