జగన్ ఫ్రస్ట్రేషన్ లో బ్యాలెన్స్ తప్పేశారా?

Publish Date:Jul 15, 2026

Advertisement

తప్పు ఒప్పు లేదు.. ఉచ్ఛం, నీచం లేదు... చట్టం, రాజ్యాంగం పట్టదు.. పాపం పుణ్యం అసలే లేదు. కావలసింది ఒక్కటే మరోసారి అధికారం దక్కించుకోవడం. అందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కనీ అంతిమ లక్ష్యం అధికారమే. మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి   ఎంతకైనా సిద్దపడుతున్నారు. 2019 గత ఎన్నికలలో బాబాయ్ హత్య, కోడికత్తి లాంటి ఎన్నో డ్రామాలను రక్తి కట్టించిన జగన్ కు 2024 ఎన్నికలలో గులకరాయి వంటి ఎత్తుగడలు వికటించాయి. ఇక ఇప్పుడు 2029 ఎన్నికలలో విజయంపై జగన్ కుఇప్పటి నుంచే భయాలు పట్టుకున్నాయి. 

ఆ భయంతోనే జగన్ లో ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఆయన తాజాగా విశాఖ పట్నం పర్యటనలో మాట్లాడిన మాటలనే ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.  సరే సముద్రంలో బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి.. తాను అధికారంలోకి రాగానే వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చేశారు. అక్కడితో ఆగకుండా.. బోటు ప్రమాదానికీ, ఆ ప్రమాదంలో మత్స్యకారులు మరణించడానికి చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం, నిర్వాకమే కారణమంటూ విమర్శలు గుప్పించేశారు. సాధారణంగా జగన్ ప్రభుత్వంపై చేసే విమర్శలన్నీ ఆవు కథలాగే ఉంటాయి. అవి పక్కన పెడితే..

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.  బైక్ యాక్సిడెంట్ చేసి ఓ నిరుపేద వ్యక్తి మరణానికి కారణమవ్వడమే కాకుండా, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అసలు సంబంధం లేని మరో యువకుడిని నిందితుడిగా ఇరికించే ప్రయత్నం చేసి... ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాతే నిందితుడు సిదిరి అప్పలరాజు కుమారుడు పోలీసులకు లొంగిపోయాడు.  అటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ..  18 ఏళ్ల పిల్లోడిపై కేసు పెట్టడం తప్పు అన్నట్లుగా జగన్ మాట్లాడటం రాజకీయ పరిశీలకులనే కాదు, సామాన్య జనాలను కూడా విస్మయపరుస్తోంది. 

ఈ కేసులో నిందితుడిని వెనకేసుకురావడం ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రాథమిక సూత్రాన్ని జగన్ రెడ్డి విస్మరించారు.   నిందితుడు తమ పార్టీ నేత కుమారుడైనందున..  ఈ ప్రమాదంలో చనిపోయిన ఒ గొర్రెల కాపరి ప్రాణానికి అసలు విలేవే లేదన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తికి చట్టాలపై కనీస అవగాహన లేకపోవడం, లేదా తెలిసి కూడా తప్పుడు కేసులను సమర్థించడం చూస్తుంటే ఆయన  మైండ్ సెట్ ఎలాంటిదో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు.  

Sidiri Appalaraju, Son, Accident, Defend

By
en-us Political News

  
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.