Publish Date:Feb 13, 2026
పక్కింటి వారితో మనస్పర్థలు రావడం సహజమే.. కానీ ఆ కోపం హద్దులు దాటి ఇతర మతాల విశ్వాసాలను దెబ్బతీస్తే సహించేది లేదని సింగపూర్ కోర్టు స్పష్టం చేసింది. సింగపూర్లో నివసిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి.. దీపావళి పండుగ రోజున పక్కింటి వారితో జరిగిన చిన్న గొడవతో.. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించాడు. ముఖ్యంగా వారి వరండాలో పంది మాంసం చల్లి వారిని ఇబ్బందికి గురి చేశాడు.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆపై ఈ కేసు న్యాయస్థానానికి వెళ్లగా.. అతడి తప్పును తీవ్రంగా పరిగణించిన కోర్టు.. అతడికి 14 వారాల జైలుశిక్ష విధించింది. ముఖ్యంగా గొడవను మతపరమైన అంశంగా మార్చడం, ఇతర మతాల విశ్వాసాలను అవమానించడం వంటివి చేయడం అతడిని చిక్కుల్లోకి నెట్టింది.
భారత దేశానికి చెందిన 36 ఏళ్ల విక్నేశ్వరన్ వి మోగనవల్ సింగపూర్లో నివసిస్తున్నాడు. అతని ఇంటి పక్కన నివసించే వారు వేరే మతానికి చెందిన వారు. వారి పిల్లలు తరచూ వరండాలో ఆడుకుంటూ అల్లరి చేస్తున్నారని, దానివల్ల తనకు ఇబ్బంది కలుగుతోందని విక్నేశ్వరన్ పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయితే గతేడాది దీపావళి పండుగ రోజున ఈ గొడవ మరింత ఎక్కువైంది. ముఖ్యంగా పండుగ పూట పిల్లల అల్లరి వల్ల తన ఇంట్లో వేడుకకు ఆటంకం ఏర్పడిందని అతను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.
దీపావళి రోజున పొరుగువారిపై కక్ష పెంచుకున్న విక్నేశ్వరన్.. వారి మత విశ్వాసాలను కించపరిచేలా వ్యవహరించాడు. ఆ మతంలో నిషిద్ధంగా భావించే పంది మాంసాన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చి.. వారి ఇంటి వరండాలో చల్లాడు. ఇది చూసిన పొరుగువారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో కూడా అతను దురుసుగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా వారిని కూడా దూషించాడు. దీంతో పోలీసులు విక్నేశ్వరన్ను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణ అనంతరం అతని మానసిక స్థితిని పరిశీలించడానికి కొంతకాలం మానసిక చికిత్స కేంద్రంలో కూడా ఉంచారు. ఇటీవల ఈ కేసు విచారణకు రాగా.. విక్నేశ్వరన్ తన తప్పును అంగీకరించి కోర్టుకు క్షమాపణలు చెప్పాడు. అయితే మత సామరస్యం దెబ్బతినేలా ప్రవర్తించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని సింగపూర్ కోర్టు తీవ్రంగా పరిగణించింది. నిందితుడికి 14 వారాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పును ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indianorigin-man-jailed-in-singapore-36-214041.html
సంగారెడ్డి జిల్లాలో టీజీఆర్టీసీ అధికారుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ హైకోర్టు, సివిల్ కోర్టులో మెరిట్స్పై విచారణ పూర్తయ్యే వరకు ఆమె పరువుకు భంగం కలిగించే కథనాలు ప్రచురించవద్దని మీడియా సంస్థలు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబ్ వంటి ప్లాట్ఫారమ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా సివిల్ కోర్టు పిటిషన్ విచారణ కొనసాగిం చాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. అమరావతి ప్రాంతంలో ఆధునిక వైద్య సదుపాయాలను విస్తరిం చేందుకు కీలకంగా భావి స్తున్న ఈ ఆస్పత్రిని అమ రావతి సమీపంలోని తుళ్లూరు వద్ద 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.
2026 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదలైన టెన్త్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పాలకొండ నుంచి సీతంపేట వైపు వెళ్లే ఘాట్ రోడ్డులో ప్రయాణి స్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
నిందితులు ఇద్దరూ చాట్ జీపీటీ సాంకేతికతను ఆశ్రయించారు. రమణమ్మ వ్యక్తిగత వివరాలను, ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న ప్రాంతం, బదిలీ కోరుకుంటున్న ప్రాంత వివరాలను ఏఐకు అందించి.. తద్వారా ఆరోగ్య శాఖ జారీ చేసినట్లుగా కనిపించే అత్యంత ఖచ్చితమైన బదిలీ ఉత్తర్వుల కాపీని సృష్టించారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,525 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించగా, ప్రస్తుతం 6,500 పైగా కేంద్రాలు పని చేస్తున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అయితే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాపోతున్నారు రైతులు. 44 నుంచి 45 డిగ్రీల ఎండల్లో రైతులు తమ ధాన్యం రాశులతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.
ప్లాంట్ కార్యకలాపాలను మునుపటిలా వేగవంతం చేసేందుకు అదనంగా రూ. 8,097 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నిధుల కేటాయింపుతో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయి. ఉత్పత్తి రంగంలో స్థిరత్వం, పునరుజ్జీవనాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఆమోదించిన ఈ ప్రతిపాదనను.. ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం జరిగింది.
కూలీలు, కార్మికులు, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన స్తంభాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి, నిర్మాణ రంగ విస్తరణ ఇవన్నీ కార్మికుల శ్రమ ఫలితమేనన్న అచ్చన్నాయుడు.. . వారి కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు, ప్రతిఫలం లభించేలా చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెట్రోల్ బంక్లో ఒక ఆటోకు గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆటోలో నుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పక్కనే నిలిపి ఉంచిన మరో ఆటోకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరెగుతూ దట్టమైన పొగలు ఆ ప్రాంమంతా వ్యాపించాయి.
ఇది సాధారణ చోరీ ప్రయత్నమా.. అల్లరిమూకలా పనా... అన్న సందేహం రావడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఓ నలుగురు పోకిరీ యువకులు క్వాలిస్ కారులో రాత్రి వేళల్లో నగర వీధుల్లో సంచరిస్తూ షాపింగ్ మాల్స్, పెద్ద అద్దాలున్న దుకాణాలను టార్గెట్ చేసుకొని గిల్లెర్కు గోలీలు అమర్చి అద్దాలపై గురి పెట్టి కొట్టి పగలగొట్టి వినోదించడం అలవాటుగా మార్చుకున్నారు.
జపాన్ ప్రధానమంత్రి సనాయే టకాయిచీతో ఫోన్ లో మాట్లాడిన పెజెష్కియాన్, పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న అభద్రతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని విమర్శించారు. ఇరాన్ నౌకలపై అమెరికా పాల్పడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఇలాంటి తీరును ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు.