నైరుతి ఆశలు ఆవిరి..!

Publish Date:May 16, 2016

Advertisement

వేసవి తాపంతో అల్లాడుతూ..వడగాల్పులు, ఉక్కపోతలతో వానెప్పుడు పడుతుంది రా బాబూ..!  అని ఎదురు చూస్తున్న ప్రజలకు చేదు వార్త. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి ఏడాది జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు భారత భూభాగాన్ని తాకాలి. కాని రుతుపవనాల పురోగమనానికి దోహదపడే వాతావరణం హిందూ మహా సముద్రం పరిసరాల్లో నెలకొనాలి. నిజానికి మే నెలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తరువాత బలపడి అండమాన్ నుంచి తూర్పు తీరం దిశగా రావాలి. అయితే ఈ ఏడాది ఆగ్నేయ బంగాళాఖాతంలో కాకుండా శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందునే కేరళకు రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

 

నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి మోడల్ రూపకల్పనలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. వాయువ్య భారతంలో కనీస ఉష్ణోగ్రతలు, ముందస్తుగా శ్రీలంకలో కురిసే వర్షాలు, దక్షిణ చైనా సముద్రంపై అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితర అంశాల ఆధారంగా రుతుపవనాల రాకను ఐఎండీ నిర్ధారిస్తుంది. ఈ అంశాలు ప్రతికూలంగా ఉండటంతో రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

 

తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే ఈ ఏడాది వర్షాలు సకాలంలోనే పలకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 7కు నాలుగు రోజులు ముందుగానీ, నాలుగు రోజుల తర్వాత గానీ కేరళను తాకే అవకాశలుండటంతో..కేరళను తాకిన తర్వాత పది రోజులకు తెలంగాణ, ఏపీల్లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది రుతుపవనాలు జూన్ 5న కేరళను తాకగా..10న రాయలసీమలోకి ప్రవేశించాయని..13న తెలంగాణలోకి విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి ఒక్కోసారి 15-20 రోజులు పట్టే అవకాశాలున్నాయని కూడా నిపుణులు అంటున్నారు.

 

రుతుపవనాల రాక ఆలస్యం కానుందని వాతావరణ శాఖ చేసిన ప్రకటన ప్రజల్లో నిరాశ కలిగించింది. పుష్కలంగా వర్షాలు కురుస్తాయని చెప్పిన అధికారులు రుతుపవనాల రాక ఆరు రోజు లేటవుతుందని చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. భారతదేశ వ్యవసాయరంగం ప్రధానంగా రుతుపవన వ్యవసాయమనే చెప్పవచ్చు. రుతువుల ఆధారంగానే మనదేశంలో వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం దేశ ఆర్ధిక వ్యవస్థకి వెన్నెముక . రుతుపవనాల్లో నమోదయ్యే అటుపోట్లు ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అవి సకాలంలో వచ్చి సమృద్థిగా వర్షాలు కురిస్తే...అంతకన్నా దేశానికి కావల్సిందేమి లేదు. కానీ వాతావరణంలో మార్పుల ఫలితంగా రుతుపవనాలు సరైన సమయానికి రావడం లేదు. దీని వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

 

దేశంలో సుమారు మూడింట రెండొంతులు వర్షాధారిత వ్యవసాయమే. ఎలాంటి నిర్మాణానికైనా పునాది పటిష్టంగా ఉండాలంటారు. సంవత్సరంలో తొలి పంట పండే ఖరీఫ్ వ్యవసాయానికి గాని ఆర్ధిక రంగానికి గాని పునాది లాంటిది. అలాంటి ఖరీఫ్ సీజన్ నైరుతి రుతుపవనాల ఆధారంగానే ప్రారంభమవుతుంది.  సకాలంలో ఎరువాక ప్రారంభించాలనుకుంటున్న అన్నదాతల్లో వాతావరణ శాఖ ప్రకటన నిరుత్సాహన్ని నింపింది. వాతావరణ శాఖ వాళ్లు ఏమైనా దేవుళ్లా వారు చెప్పినట్టు జరగడానికి అని మీరు అనుకోవచ్చు. కాని దేశంలో రుతుపవనాల ప్రవేశానికి సంబంధించి ఐఎండీ ముందస్తు అంచనాలను గత 11 ఏళ్లుగా విడుదల చేస్తోంది. గత ఏడాది తప్ప మిగిలిన పదేళ్లలో వాతావరణ శాఖ చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. దీంతో నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా సకాలంలో వర్షాలు పడాలని ఆశిద్దాం..
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.