"బంగారుతల్లి"ని వదిలించుకున్న తెలంగాణ..!

Publish Date:May 14, 2016

Advertisement

ఆడపిల్లల సంక్షేమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన "బంగారుతల్లి" పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి జగదీశ్వర్ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకాన్ని టీ సర్కార్ రద్దు చేస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా..అధికారికంగా మాత్రం ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. లింగ నిష్పత్తిలో అట్టడుగుకు చేరుకుంటున్న ఆడపిల్లల జనాభాను పెంచడం..భ్రూణ హత్యలను నివారించేందుకు  అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి "కిరణ్‌కుమార్ రెడ్డి" ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఎవరూ ఈ పథకాన్ని రద్దు చేయకుండా "ఆంధ్రప్రదేశ్ బంగారు తల్లి బాలికాభ్యుదాయ, సాధికారిత చట్టం-2013" పేరున దీనికి చట్టబద్థత సైతం కల్పించి "ఆడపిల్లల భారం ఇక ప్రభుత్వానిదే"నన్నారు. అప్పట్లో ఇది సీఎం మానసపుత్రికగా చలామణీ అయ్యింది.

 

జూన్ 1, 2014న బిల్లు అమల్లోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టగానే వారి పేరు మీద ప్రత్యేక ఖాతాలు తెరిచి రూ.2500 మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాన్పు అనంతరం తొలి రెండేళ్ల అవసరాల కోసం రూ.1000, మూడు నుంచి ఐదేళ్లు వచ్చేవరకు రూ.1500 ఇచ్చే విధంగా చట్టంలో మార్గదర్శకాలున్నాయి. అలాగే పాఠశాల అడ్మిషన్ సమయంలో అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు రూ.2000, ఎనిమిదో తరగతిలో రూ.2500, తొమ్మిది, పదో తరగతుల్లో రూ.3000, ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి రూ.3500, డిగ్రీలో చేరేనాటికి రూ.4000 ఇవ్వాలని బంగారు తల్లి పథకం నిబంధనలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలోని ఒక్కొ పథకాన్ని రద్దు చేయడమో లేదంటే నిధులు నిలుపదల చేయడమో చేస్తూ వస్తున్నారు. అలాంటి పథకాల్లో "బంగారు తల్లి" కూడా ఒకటి.

 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2014 జూన్ నుంచి ఇప్పటి దాకా బంగారుతల్లి పథకం కోసం ప్రభుత్వం నుంచి ఒక్కపైసా విడుదల కాలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కింద నడిచే ఈ పథకానికి తెలంగాణ తొలి పద్దులో సైతం నిధుల కేటాయింపులు చేయలేదు. ఈ పథకం కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అధికారిక సమాచారం ప్రకారం 67,848 ఆడపిల్లల కుటుంబాలు దాదాపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో సహా దరఖాస్తులు చేసుకున్నాయి. కాని ఒక్కరంటే ఒక్క లబ్థిదారున్ని కూడా ఎంపిక చేయలేదు. దీని కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర ఆడపిల్లల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

 

అయితే ఈ పథకాన్ని రద్దు చేయడానికి గల కారణాలపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధితో పాటు వివాహానికి భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు తగినంత సిబ్బంది లేరని, బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాల్లోని నిరుపేద మహిళల వివాహానికి  కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ వంటి పథకాల కింద కోట్లు ఖర్చు చేస్తున్నామని..అలాంటప్పుడు మళ్లీ బంగారు తల్లి పథకం అవసరం లేదని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వాదన ఏ మాత్రం సమంజసంగా లేదు. అయితే రెండేళ్లుగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి.. తదితర విషయాలపై గాని ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక ఉన్నపళంగా రద్దు చేయడం మాత్రం ఏ మాత్రం బాగోలేదు. ఒక ఊరికి వెళ్లడానికి వంద దారులున్నట్టు, ఒకే రకమైన ఉపయోగం కోసం చాలా రకాల పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రజలు వాటిలో తమకు నచ్చిన దానిని ఎన్నుకుని దరఖాస్తు చేసుకుంటారు. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమం ఎన్ని పథకాలున్నాయని కాదు వాటి వల్ల ప్రజలకు లబ్ధి కలిగిందా లేదా అన్నదే కావాల్సింది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.