ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే!

Publish Date:May 17, 2016

Advertisement

 

2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల తరువాత యావత్‌ దేశం దృష్టినీ ఆకర్షించిన ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు మినహా, ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిందనిపించారు. ఓటింగ్‌ ప్రక్రియ అలా ముగిసిందో లేదో, పలు సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించేశాయి. ఆశ్చర్యకరంగా ఈ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైన ఫలితాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకే అసలు ఫలితాలు వెల్లడవ్వక ముందే ఆయా రాష్ట్రాల్లో సంబరాలు మొదలైపోయాయి. ఈ ఎగ్జిట్‌ పోల్సే కనుక నిజమైతే, ఓటర్లు ప్రతి రాజకీయ పార్టీకీ కొన్ని సూచనలు చేసినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే- ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడైన వెంటనే తాజావార్తగా మారిన అంశం, తమిళనాట జయ పరాభవం.

తమిళ తంబిలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ దఫాకో ద్రవిడ పార్టీకి అవకాశం ఇస్తారన్న విషయం తెలిసిందే. కానీ కరుణానిధికి వయసు మీద పడటం, ఆయన పుత్రరత్నం అళగిరి సొంత పార్టీకి గోతులు తవ్వడం చూస్తే అక్కడ ‘జయ’కేతనానికి అడ్డులేదని అనిపించింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కుందేలు, తాబేలు పరుగుపందెం కథ గుర్తుకురావడం మొదలైంది. అబ్యర్థులను ఎడాపెడా మార్చేయడం దగ్గర్నుంచీ, మందకొడిగా ప్రచారం చేయడం వరకూ జయ అతి విశ్వాసం అసలుకే ఎసరు పెట్టింది. జయకు భిన్నంగా 92 ఏళ్ల కరుణానిధి ప్రచారంలో దూసుకుపోయారు. వయసుకు అతీతంగా తాను పాలించి తీరతానన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించారు. తుపానులో పులిహోర పొట్లాల మీద సైతం అమ్మ బొమ్మ వేయించే అన్నాడీఎంకే కరుణ తాకిడికి వెనక్కి తగ్గింది. వీటికి తోడు రుణ మాఫీ వంటి పథకాలతో కట్టుదిట్టంగా ఏర్పరిచిన డీఎంకే మేనిఫెస్టో కూడా ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసాన్ని రగిల్చింది. ఇక కేప్టెన్‌ విజయ్‌కాంత్‌ ఆటలో అరటిపండులా మిగిలిపోవడమే కాకుండా, ఓట్లను చీల్చి అన్నాడీఎంకేకు పరోక్షంగా నష్టం కలిగించినవారయ్యారు.

కాంగ్రెస్‌- వరుస ఎదురుదెబ్బలతో తల బొప్పి కట్టించుకున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ఫలితాలు మరింత శిరోభారంగా మారనున్నాయి. అసోంలో మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న గోగోయ్‌ ఇప్పుడు గద్దె దిగనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు కేరళలోనూ రోజుకో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఊమెన్‌ చాందీని సాగనంపేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌, అగస్టా చాపర్ వంటి స్కాములతో తలగోక్కొంటున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రాంతీయంగా కూడా గడ్డు పరిస్థితి ఎదురు కానుంది. ఈ ఎన్నికల తరువాత దేశంలోని దాదాపు ఐదో వంతులో మాత్రమే కాంగ్రెస్‌ పాలన నిలిచి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి జాతీయ స్థాయిలో ఆ పార్టీ పునర్వైభవం సాధించడం ఎంత కష్టమో తెలుస్తోంది. మరి ఆ కష్టమైన లక్ష్యాన్ని సాధించే సత్తా రాహుల్‌కు ఉందా!

భాజపా- అసోంలో భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్ చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే తొలిసారి ఈశాన్యంలో కమలం విరబూయనుంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఒకటీ అరా స్థానాలకే అది పరిమితం కానుంది. అసోంలో మూడు దఫాలుగా గెలుస్తూ వస్తున్న పార్టీని మార్చాలని ఓటర్లు భావించడం సహజమే! అందుకు ప్రత్యామ్నాయంగా భాజపా ముందుకు దూసుకురావడం మంచిదే! కానీ ఈ విజయంతో దేశంలో తమకి తిరుగులేదని భాజపా భావిస్తే కనుక త్వరలోనే ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. ఇప్పటికే దక్షిణాదిన బీజేపీకి వ్యతిరేకంగా గాలులు వీయడం మొదలయ్యాయి. ఇక ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన పేరుతో భాజపా ప్రతిష్ట మసకబారింది. మధ్యతరగతి ప్రజల పీఎఫ్ మీద మాటిమాటికీ కన్నేయడం, నల్లధనాన్ని వెలికితీయడంలో విఫలం కావడం చూస్తుంటే భాజపా, కాంగ్రెస్‌లు ఒకే తాను ముక్కలేమో అన్న అనుమానం ప్రజలకి కలుగుతోంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు భాజపా చాలానే కష్టపడాల్సి ఉంది.

వామపక్షాలు- మన దేశంలో వామపక్షాలకు పెట్టని కోటలు రెండు. ఒకటి పశ్చిమబెంగాలు, రెండు కేరళ! ఈసారి ఎన్నికల్లో కేరళ వామపక్షాల కైవసం అవనుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇది చెప్పుకోదగ్గ విజయం ఏమీ కాదు. కేరళ ముఖ్యమంత్రి సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోవడం అక్కడ వామపక్షాలకు కలిసి వచ్చింది. పైగా తమిళ తంబిలలాగానే, కేరళ సహోదరులకు కూడా పార్టీలను మార్చి మార్చి గెలిపించుకునే అలవాటు ఉంది. ఇక పశ్చిమబెంగాల్లో మమతను ఓడించలేకపోవడం ఆ పార్టీకి పెను పరాభవం. ఈ ఎన్నికల యుద్ధానికి ముందు నారదా స్కాం, కోల్‌కతా ఫ్లై ఓవర్‌ సంఘటన, తృణమూల్‌ మూకల హింస... తదితర అస్త్రాలు వామపక్షాలకు ఎన్ని అందినా కూడా అవి మమతను నివారించలేకపోయాయి. అందుకు కారణం వారి స్వయంకృతాపరాధాలే! దశాబ్దాల తరబడి వామపక్షాలు సాగించిన పాలనతో బెంగాలీ బాబులు విసుగెత్తిపోయారు. ఒక తరం పాటు తలెత్తుకు తిరగలేనంతగా బెంగాల్‌ వెనుకబడిపోయింది. అలాంటి దౌష్ట్యం కంటే మమత మొండి వైఖరే మేలన్న అభిప్రాయానికి జనం వచ్చేశారు. బెంగాల్లో వామపక్షం మళ్లీ వెలగాలంటే, వారి పాలన తాలూకు జ్ఞాపకాలు చెరగాల్సిందేనేమో!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.