యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక మలుపులు

Publish Date:Jan 2, 2026

Advertisement

 

హిందూ దేవతలను కించపరిచే విధంగా వీడియో కంటెంట్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్న ఆరోపణలతో యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారా లను సేకరించేందుకు పోలీసులు సోషల్ మీడియా సంస్థలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పంజా గుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి అధికారిక లేఖ రాశారు. యూట్యూబర్ అన్వేష్ దేవుళ్లపై చేసిన వివాదాస్పద వీడియోలకు సంబంధించిన కంటెంట్ లింకులు, అన్వేష్‌కు చెందిన యూజర్ ఐడీ, అకౌంట్ వివరాలు, వీడియోలు అప్‌లోడ్ చేసిన తేదీలు, ఐపీ అడ్రస్ సమాచారం వంటి కీలక వివరాలను అందిం చాలని కోరారు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ సంస్థ నుంచి స్పందన కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నుంచి పూర్తి సమాచారం అందిన వెంటనే అన్వేష్‌పై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచా రణలో అన్వేష్ విదేశాల్లో నివసిస్తూ భారతీయ చట్టా లకు విరుద్ధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు గుర్తించారు. భారతదేశంలో మత విశ్వా సాలు, ప్రజాభావాలను దెబ్బతీసే విధంగా కంటెం ట్‌ను ప్రసారం చేయడం తీవ్రమైన నేరమని పోలీ సులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారికి కఠిన చర్యలు తప్ప వని పోలీసులు హెచ్చరిస్తు న్నారు.

అన్వేష్ వీడియోలపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పలు హిందూ సంఘాల నాయకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు అందజే శారు. హిందూ దేవతలపై అభ్యంత రకర వ్యాఖ్యలు చేసి మత భావాలను కించపరిచారని ఆరోపిస్తూ అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంలో కరాటే కళ్యాణి కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఈకేసుకు కీలకంగా మారింది. ఆమె ఫిర్యాదులో అన్వేష్ వీడి యోలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, హిందూ సమాజాన్ని అవమా నపరిచేలా ఉన్నాయని కరాటే కళ్యాణి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

పలు ఫిర్యాదులు రావడంతో పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను సహించ బోమని పోలీసులు స్పష్టం చేశారు. దేశంలో ఉన్న చట్టాలు అందరికీ సమానమని, విదేశాల్లో ఉన్నా కూడా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొ న్నారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి సమాచారం అందిన తరువాత అవసరమైతే లుక్‌ఔట్ నోటీసులు, అంతర్జాతీయ సహకారం దిశగా కూడా చర్యలు తీసుకునే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగు తున్న నేపథ్యంలో ఇంకా సోషల్ మీడియాలో వివాదాస్పద కంటెంట్‌పై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

By
en-us Political News

  
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులు ఆమోదం తెలిపింది
ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రకంగా పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా కఠిన చట్టాన్ని తీసుకువచ్చిన తొలి దేశంగా నిలిచింది. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అదే బాటలో పయనిస్తూ 15 ఏళ్ల వయస్సును డిజిటల్ మెజారిటీ గా నిర్ణయించింది.
అదే సమయంలో మందుబాబులు కూడా పండుగ చేసుకున్నారు. పబ్ లు బార్ లలో అర్ధరాత్రి వరకూ తాగి చిందులేశారు. అక్కడితో ఆగకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుబడిన వారి సంఖ్య కూడా హైదరాబాద్ లో అధికంగానే ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.