తెదేపా, వైకాపాలకు హైదరాబాద్ తో కాంగ్రెస్ చెక్ పెడుతుందా

Publish Date:Sep 4, 2013

Advertisement

 

హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ఇరు ప్రాంత ప్రజలకు అమోదయోగ్యమయిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లు రక్షణ శాఖ మంత్రి ఎకె అంటోనీ సీమాంద్ర నేతలతో అన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీమంధ్రలో ప్రజలు, ఉద్యోగులు, పార్టీలు విభజనను వ్యతిరేఖిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తున్నపటికీ, హైదరాబాద్ విషయంలో వారికి అనుకూలమయిన నిర్ణయం జరిగితే వారు శాంతించే అవకాశం ఉందని, అదేవిధంగా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు, ప్రజల భయాందోళనలు పోగొట్టేందుకు కూడా ఇదే సరయిన పరిష్కారమని కేంద్రం ఆలోచిస్తున్నట్లుంది.

 

అయితే, అందుకు టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస ఇతర తెలంగాణావాదులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోరని కేంద్రానికి తెలియకపోలేదు. కానీ, తెలంగాణా ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు ప్రతిగా, ఈ తాత్కాలిక ప్రతిపాదనకు అంగీకరించమని కాంగ్రెస్ కోరవచ్చును. తద్వారా రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయగలిగే అవకాశముంటుందని వారికి కేంద్రం నచ్చజెప్పి, తనకు సహకరించవలసిందిగా కోరవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీ తెరాసను తనలో విలీనం చేసుకోగలిగితే తన నిర్ణయాలను అమలుచేయడానికి పెద్దగా శ్రమ పడనవసరం లేదు. కానీ విలీనం అంత సులువు కాదు. విలీనం జరిగినా, జరుగకపోయినా కేంద్రం వారి కొన్ని డిమాండ్లకు అంగీకరించి వారిచే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు అంగీకరింపజేసే అవకాశముంది.

 

అదే జరిగితే, తమ హక్కులు, భద్రత గురించి నిరవధిక సమ్మె చేస్తున్నఏపీ యన్జీవోలు కూడా వెనక్కి తగ్గే అవకాశముంది. దానితో ‘సమైక్యం-సమన్యాయం’ అంటూ ఉద్యమిస్తున్న తెదేపా, వైకాపాలు కూడా తమ ఆందోళనలు నిలిపివేయక తప్పదు. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలించే అంశం.

 

ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంతా కాలం ఎందుకు జాప్యం చేసిందంటే, ముందే ఈ ప్రకటన చేసి ఉంటే, తెదేపా, వైకాపాలు ఈవిధంగా సమైక్య ఉద్యమాలు చేసేవి కావు, వైకాపా తెలంగాణాను వదులుకొనేది కాదు. పైగా ఆ రెండు పార్టీలు మరో సరికొత్త వ్యూహంతో, కొత్త డిమాండ్ తో తమను ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఒకప్పుడు తెలంగాణకు అనుకూలమని లేఖలు ఇచ్చిన వైకాపా, తెదేపాలను ఇంత కాలం సమైక్య ఉద్యమాలు చేయనిచ్చితమ వేలితో తమ కళ్ళు పొడుచుకొనేలా చేయడమే కాకుండా, ఇంతకాలం పాదయాత్రలు, బస్సు యత్రలతో ఇబ్బంది పెడుతున్న ఆ రెండు పార్టీల నేతలని ఈ నిర్ణయంతో చావు దెబ్బ తీయగలదు.

 

తెలంగాణా ఏర్పాటు చేసిన కారణంగా తెలంగాణా ప్రజల ఓట్లను, సీమంధ్ర ప్రజల ఒత్తిడికి లొంగి హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కారణంగా సీమంధ్ర ప్రజల ఓట్లను కూడా దండుకోవచ్చునని కాంగ్రెస్ ఆలోచన. అదేవిధంగా నెలరోజులపైగా ఉద్యమాలు చేస్తున్నసీమంధ్ర ప్రజల అహం చల్లార్చి, వారికి తాము కేంద్రం మెడలు వంచామనే తృప్తి కలిగింపజేసి అంతిమంగా వారిచే గౌరవప్రదంగా ఉద్యమం విరమింపజేసేందుకే ఈ జాప్యమని భావించవచ్చును. అందుకే సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎంత తీవ్రంగా సాగుతున్నపటికీ కాంగ్రెస్ అధిష్టానం దైర్యంగా తెలంగాణా ఏర్పాటుకి సిద్దపడుతోంది.

 

ఇక, తెలుగు ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఆలోచించుకొనే వ్యవధి ఈయకూదదని కాంగ్రెస్ భావిస్తే ఈనెలలో లేదా వచ్చేనెలాఖరులోగానో మధ్యంతర ఎన్నికల ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో రెండుప్రాంతలలో పరిస్థితి తనకనుకూలంగా మారినట్లయితే కాంగ్రెస్ డిశంబర్ లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బాటు ఇక్కడ కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదు.

By
en-us Political News

  
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.