Publish Date:Jul 29, 2021
అబ్బాయి..హాయ్ గీత.. ఎలా ఉన్నావ్.. అమ్మాయి ఎవరు ? అబ్బాయి నువ్వు నాకు తెలుసు..? అమ్మాయి ఎలా తెలుసు ? ఏం తెలుసు? మళ్ళీ అబ్బాయి నువ్వు చాలా బాగుంటావని తెలుసు.. నీ స్మైల్ బాగుంటుందని తెలుసు..అనగానే అమ్మాయి మరి అన్ని తెలిస్తే షీ టీంకి కంప్లైంట్ చేస్తారని తెలియదా? అనగానే అబ్బాయి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పానుగా బేబీ నన్ను ఎవరు పట్టుకోలేరని.. అన్నాడు ఇంట్రెస్టింగా ఉంది కదా..? ఇది తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ మధ్య జరిగే సీన్ కాదు.. సంభాషణ అంతకంటే కాదు.. సామాన్య మైన కామంతో కొవ్వు ఎక్కిన అబ్బాయికి, ఒక సాధారణమైన అమ్మాయికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ ఎప్పుడు ఈ చాటింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కామంతో, రిమ్మతెగులుతో రెచ్చిపోయాడో పోకిరీ. వాట్సాప్లో యువతికి మెసేజులు పంపుతూ నిత్యం వేధింపులకు దిగాడు. నువ్వు అందంగా ఉంటావంటూ మాటల్లో పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఏం కావాలని ఆ అమ్మాయి అడిగితే కొంటెగా గుండెల్లో చోటు అన్నాడు.. అక్కడ అయితే ఇవ్వలేను కానీ.. జైల్లో ఖాళీ ఉంటుందేమో అంటూ ఆ అమ్మాయి ఘాటుగానే రిప్లై ఇచ్చింది. అయినా నన్నెవరు పట్టుకోలేరు బేబీ అంటూ పలికాడు కామ గురుడు. అయితే యువతి షీ టీం ఒక్క చాన్స్ ఇద్దామంటూ యువతి షీ టీం పేరుతో షాకిచ్చింది. ఆ తర్వాత మెసేజులు ఆగిపోయాయి. సుమారు గంట తర్వాత ఏంటి రిప్లై లేదు అని మెసేజ్ చేస్తే.. షీం టీం రిప్లై చూసి యువతి హ్యాపీ. సుమారు 48 నిమిషాల తర్వాత మళ్లీ మెసేజ్ చేసిన యువతికి షీ టీం నుంచి మెసేజ్ వచ్చింది.గంటలోనే గురుడికి షాకివ్వడంతో ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వైరల్గా మారింది.
కట్ చేస్తే.. అయితే రంగంలోకి దిగి కేటుగాడి పనిపట్టారు సైబరాబాద్ షీ టీం పోలీసులు. యువతిని వేధింపులకు గురిచేసిన గంటలోనే పోకిరీకి ఊహించని షాకిచ్చారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిపోయాయి. అదే ఆ మెసేజ్. ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చని షీ టీం భరోసా ఇస్తూ చేసిన మెసేజ్కి యువతి థాంక్స్ చెప్పింది. ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ బయటికి రావడంతో వైరల్గా మారింది. అసలు ఆ గంటలోపే ఏం జరిగిందనేని ఆసక్తికరంగా మారింది. అయితే యువతి షీ టీంకి ఫోన్ చేయడం.. వెంటనే అతన్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి మరి. సో ఇదండీ మ్యాటర్ ఇక మీద ఎవరైన అమ్మాయిలను వేధించేవాళ్లు ఉంటే, అమ్మాయిలను వేదించాలని అనుకుంటే ఆ ఆలోచనని పురిటి లోనే చంపేస్తే బెటర్ మరి.. ఎందుకంటే రోజులు బాగాలేవు.. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది.. సో జాగ్రత్త అలాంటివి మానుకుని భవిష్యత్తు గురించి ఆలోచించండి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hi-gita--you-are-my-lover-young-man--she-team-into-the-field-25-120599.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.