టీసీఎస్ లో మహిళా ఉద్యోగులకు వేధింపులు.. పని ప్రదేశంలో భద్రతపై వెల్లువెత్తుతున్న సందేహాలు

Publish Date:Apr 14, 2026

Advertisement

కంఠమనేని సీతారాం

దేశంలోనే దిగ్గజ ఐటీ సంస్థ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ విభాగంలో చోటుచేసుకున్న వరుస సంఘటనలు ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కార్యాలయంలో ఉద్యోగినుల పట్ల అనుచిత ప్రవర్తన, మానసిక వేధింపులు,  మతపరమైన ఒత్తిళ్లకు సంబంధించి వెలుగులోకి వచ్చిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసు యంత్రాంగం,  సంస్థ అంతర్గత విభాగం దర్యాప్తును ముమ్మరం చేశాయి.

దర్యాప్తు సంస్థల ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ కేసులో ప్రధానంగా  మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లేదా సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారిపై ఒత్తిడి పెంచుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికంగా విధుల్లో చేరకముందే ఈ బాధితులను గుర్తించి, ఒక పద్ధతి ప్రకారం వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో హెచ్‌ఆర్ ,  ట్రైనింగ్ విభాగాలకు చెందిన కొందరు వ్యక్తులు ఒక నెట్‌వర్క్‌లా ఏర్పడి పనిచేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను సేకరించడం, వాటిని ప్రత్యేక వాట్సాప్ గ్రూపుల ద్వారా షేర్ చేసుకోవడం వంటి చర్యలకు వీరు పాల్పడినట్లు సమాచారం.

శిక్షణ సమయంలోనే బాధితులతో సన్నిహితంగా ఉంటూ వారి విశ్వాసాన్ని చూరగొని, ఆపై వారిని తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మరీ ముఖ్యంగా, బాధితులపై మతపరమైన ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. హిందూ ధర్మాన్ని కించపరచడం, ఆహారపు అలవాట్లను బలవంతంగా మార్చడం అంటే.. బీఫ్ తినమని ఒత్తిడి చేయడం, నమాజ్ ఆచరించడం వంటి  మతాచారాలను పాటించాలని వేధించడం వంటి చర్యలకు పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. మానసిక విశ్లేషణల ద్వారా వారి నమ్మకాలను దెబ్బతీస్తూ, వ్యక్తిగత దూషణలతో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఉదంతంలో నిధారా ఖాన్ అనే హెచ్‌ఆర్ అధికారిణి పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ను నడపడంలో ఆమె కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు సమాచారం.

  ప్రస్తుతం పరారీలో ఉన్న నిధారా ఖాన్  కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న టీమ్ లీడర్లు, ట్రైనర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదంపై టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలను సంస్థ ఏమాత్రం సహించబోదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సీఓఓ   ఆర్తి సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ అంశంపై అంతర్గత విచారణ జరుపుతోందని, చట్టపరమైన దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఈ ఉదంతం కార్పొరేట్ కార్యాలయాల్లో ఉద్యోగుల భద్రత,  మత స్వేచ్ఛపై పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. బలహీన వర్గాల ఉద్యోగులకు పని ప్రదేశాల్లో  ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.