ఇంధన భద్రతే లక్ష్యంగా భారత్ అడుగులు.. గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక దౌత్యం

Publish Date:Apr 24, 2026

Advertisement

చమురు సరఫరా ఆగకూడదు, దేశ ఆర్థిక వ్యవస్థ వెనకడుగు వేయకూడదు అన్న లక్ష్యంతో భారత్  గల్ఫ్ తో  భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రియాద్ పర్యటన, కేంద్ర మంత్రి జైశంకర్ యూఏఈ చర్చలు, మరో కేందర్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ సందర్శన  ఇవన్నీ ఎనర్జీ సెక్యూరిటీ లక్ష్యంగా సాగినవే.  
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో  నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో  ఇండియా..  తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.  అందులో భాగంగానే.. షిప్పింగ్ మార్గాలు సురక్షితంగా, నిర్బంధం లేకుండా కొనసాగాలని కోరుతోంది.  భారత్ కు వచ్చే చమురు, గ్యాస్ లో అరవై శాతానికి పైగా గల్ఫ్ ప్రాంతంపైనే ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఇండియా గల్ఫ్ దేశాలతో దౌత్యం నెరపుతోంది. 

ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇటీవల అంటే ఈ నెల 19న  సౌదీ రాజధాని రియాద్ లో పర్యటించారు. అక్కడ ఆయన ఆ దేశ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ జీజ్ బిన్ సల్మాన్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, అలాగే ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు, ముసాయిద్ అల్–ఐబాన్ తో వరుస భేటీలు జరిపారు.  , ఈ చర్చల్లో.. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ప్రాంతీయపరిస్థితులు, ఇంధన సహకారం, సముద్ర రవాణా భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇండియాకు టాప్ మూడు చమురు సరఫరా దేశాలలో రష్యా, ఇరాక్ తో పాటు సౌదీ కూడా ఉంది. అంతే కాకుండా సౌదీలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్స్ నివసిస్తున్నారు. ఇటీవల సౌదీ, పాక్ రక్షణ ఒప్పందాలు, ప్రాంతీయ భద్రతా సమీకరణాలు, ఇరాన్, అమెరికా  ఉద్రిక్తతల నేపథ్యంలో.. రియాద్ తో నిరంతర, నేరుగా, ఉన్నత స్థాయి సంభాషణ భారత్ కు అత్యవసరం. చమురు ధరలు, సరఫరా, షిప్పింగ్ భద్రత  వీటిపై సౌదీ ఉన్నత స్ధాయి వర్గాలతో అజిత్ దోవల్ జరిపిన చర్చలు సానుకూలంగా సాగినట్లు భారత దౌత్యవర్గాల సమాచారం.  
 
 అజిత్ దోవల్ సౌదీ పర్యటనకు ముందు. ఈ రెండు పర్యటనలకూ ముందు కేంద్ర  విదేశాంగ మంత్రి జైశంకర్ యూఏఈలో పర్యటించారు. జైశంకర్ యూఏపీ పర్యటన కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే.. ఎందుకంటే.. యూఏఈ ఇండియాకు ముఖ్య వాణిజ్య భాగస్వామి. పెట్టుబడులు, మౌలిక వసతులు, డిజిటల్, ఫైనాన్షిల్ రంగాలలో ఇరు దేశాల మధ్యా కీలక భాగస్వామ్యం ఉంది.  

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన కూడా ఇందులో భాగంగానే జరిగింది. ఎందుకంటే ఖతార్.. ఇండియాకు ఎల్ఎన్జీ, ఎల్పీజీ ప్రధాన సరఫరాదారు.   దీర్ఘకాల గ్యాస్ ఒప్పందాలు, ధర స్థిరీకరణ, షిప్పింగ్ భద్రత ఇవన్నీ నేరుగా భారత విద్యుత్, పరిశ్రమ, గృహ వినియోగంపై ప్రభావం చూపే అంశాలు. ఈ నేపథ్యంలో ఏకకాలంలో  సౌదీ, యూఏఈ, ఖతార్ దిశగా జరిగిన ఉన్నత స్థాయి పర్యటనలు భారత్ భారత్ వ్యూహాత్మక దౌత్య అడుగులుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. 
ఇండియా ఇప్పుడు విస్పష్టంగా ఇంధన అవసరాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుంగా వివిధ సరఫరాదారులతో దీర్ఘకాలిక, స్థిరమైన ఒప్పందాలు కుదుర్చుకునే దిశగా కదులుతోంది.  

పశ్చిమ ఆసియాలో ఎవరి రాజకీయ మార్గం ఎలా ఉన్నా.. ఇండియా  మాత్రం ఇంధన భద్రత, జాతీయ భద్రత లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే దోవన్ సౌదీ నాయకత్వంతో జరిపిన చర్చలలో.. సముద్ర రవాణా భద్రత, నిర్బంధం లేకుండా వాణిజ్య నౌకల సాఫీ ప్రయాణం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లేదా నియంత్రించే దౌత్య మార్గాలు వంటి అంశాలపై ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.   

సేకరణ, సంకలనం: సీతారాం కంఠంనేని

References 
•    Hindustan Times – NSA Ajit Doval visits Saudi Arabia in outreach to key energy suppliers Hindustan Times
•    Zee News – NSA Ajit Doval visits Saudi Arabia as part of India’s outreach to key energy suppliers Zee News
•    GNN / NewsAge – India’s push to engage key energy suppliers amid Strait of Hormuz closure gnn.asia news-age.com
•    State Correspondents – MEA terms Doval’s Riyadh visit “helpful & strategic” amid West Asia crisis statecorrespondents.com

By
en-us Political News

  
400 అడుగుల బీఎస్ఎన్ఎల్ టవర్‌పై.. 560 రోజులుగా నిరసన.. పంజాబ్‌కు చెందిన పాడి రైతు
రాజేంద్రనగర్ లో విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉండడంతో అక్కడ కొంత ఉధృత వాతావరణం నెలకొంది.
ముంబై ఇండియన్స్ అభిమానులకు ఐపీఎల్ వర్గాలు ఓ గుడ్ న్యూస్ చెప్పింది.
మరో వైపు చర్చలలో పాల్గొనేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీ నేతృత్వంలో ఉన్నత స్థాయి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. అయితే అమెరికా ప్రతినిథులతో ముఖాముఖీ చర్చలకు మాత్రం నో చెప్పింది. తాము చెప్పదలచుకున్న విషయాలను పాకిస్థాన్ అధికారుల ద్వారానే అమెరికాకు చేరవేస్తామని.. అంటే పరోక్ష చర్చలకు మాత్రమే తాము సిద్ధమని ఇరాన్ చెప్పకనే చెప్పింది.
ప్రజాదరణపై ఏ స్థాయిలో ఉంటుందో రాఘవ్ చద్దా ఉదంతం మరోసారి నిరూపించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షం నిలువునా చీలిపోయింది.
వీసా నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనే నెపంతో.. ప్రైవేట్ వ్యక్తులు కెమెరాలతో భారత హఎచ్ 1బి వీసా ఉద్యోగులు పని చేస్తున్న కార్యాలయాలకు, వారి నివాసాలకూ కూడా వెళ్లి హల్‌చల్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగులను కలవరానికి గురి చేస్తున్నది.
ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన కాకినాడలోని మొబైల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
తమకు ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారతదేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు అత్యంత కీలమైన పెన్షన్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని లోక్ భవన్‌కు వెళ్లారు.
ఈ అసాధారణ పరిణామం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున 1.22 డాలర్లకు, డీజిల్ ధర 1.238 డాలర్లకు చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.