Publish Date:Apr 24, 2026
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది. దానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు.. ఎల్ అండ్ టీతో ఒప్పందం ఇప్పటికే పూర్తయ్యాయి. వాస్తవానికి మార్చి 31 నాటికి మెట్రో ప్రాజెక్ట్ ఎల్ అండ్ టీ నుంచి ప్రభుత్వ పరం అయ్యేందుకు వీలుగా ప్లాన్ జరిగినప్పటికీ.. స్వాధీన ప్రక్రియకు అవసరమైన దాదాపు రూ.13,615 కోట్ల రుణం ప్రభుత్వానికి రాకపోవడంతో ఆలస్యమైంది. మెట్రో మొదటిదశ స్వాధీన ప్రక్రియకు అవసరమైన రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఓకే చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఒప్పందం.. డాక్యుమెంట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం పీపీపీ పద్దతిలో ఎల్ అండ్ టీ - తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును పూర్తిగా టేకోవర్ చేసుకోవటానికి రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే.. స్వాధీన ప్రక్రియతో ముడిపడి ఉన్న పలు అంశాలు.. మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిపార్సులను తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి.. ఆమోదం తెలిపారు. ఐఆర్ఎఫ్ సీ ఇచ్చే దాదాపు రూ.13,615 కోట్ల రుణాన్ని 20 ఏళ్ల కాల వ్యవధిలో మెట్రో రైలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. కీలక అంశం ఏమంటే.. ఐఆర్ఎఫ్ సీ తొలుత అంగీకరించిన రూ.12,750 కోట్ల కంటే తాజాగా రూ.13,615 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది.
ఐఆర్ఎఫ్ ఎసీ రుణంగా ఇచ్చిన మొత్తానికి అదనంగా ఇవ్వాల్సిన మొత్తాన్ని హెచ్ఎండీఏ ఇవ్వనుంది. ఈ మొత్తం తక్షణం అందజేస్తేనే గడువు లోపు లావాదేవీ పూర్తి అవుతుందని హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వాన్ని కోరగా.. ఈ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించారు. మెట్రో స్వాధీనం తర్వాత నిర్వాహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎల్ అండ్ టీ ఎంఆర్ హెచ్ఎల్ ఉద్యోగులు 115 మందిని ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించింది. ఇందుకు అయ్యే వేతనాల ఖర్చును కూడా హెచ్ఎంఆర్ఎల్ భరిస్తుంది. అదే సమయంలో మెట్రో కార్యకలాపాలపై సూచనలు.. సలహాల కోసం ఆర్నెల్ల కాలానికి ఎల్ అండ్ టీకి చెందిన సీనియర్ ఎక్స్ పీరియన్స్ అధికారిస్థాయిలోని ఏడుగురి సేవల్ని ప్రభుత్వం తీసుకోనుంది. దీనికి అయ్యే ఖర్చును ఎల్ అండ్ టీ భరిస్తుంది. వివిధ దశలను దాటి.. ఫైనల్ గా హైదరాబాద్ మెట్రో ఈ నెలాఖరు నాటికి తెలంగాణ ప్రభుత్వ పరం కానుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/metro-in-the-hands-of-telangana-government-36-218189.html
ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ను హైదరాబాద్ సీపీ సజ్జనర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు. ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రిచ్ కిడ్స్ను మాత్రమే టార్గెట్ చేసుకొని వారితో మెల్లిమెల్లిగా సోషల్ మీడియా వేదిక ద్వారా పరిచయం పెంచుకుం టున్నారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన లైఫ్ స్టైల్ చూపిస్తూ ప్రొఫైల్ తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎస్కార్ట్ గా ఉంటూ రొమాంటిక్ మూడ్ అంటూ మైనర్లకు వల విసురుతున్నారు.
ఈ కొత్త జోన్ వచ్చెనెల మొదటి తేదీ నుంచీ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో, ఇండియన్ రైల్వేలో దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్గా అవతరించనుంది.
ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు స్టోన్ క్రషింగ్ యూనిట్లను నేలమట్టం చేయడంతో పాటు.. 12 ఆర్ఎంసీ ప్లాంట్లను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో అక్కడ మళ్లీ క్రషింగ్ కార్యకలాపాలు జరగకుండా యంత్ర సామగ్రిని స్వాధీనం చేసుకుని తరలించారు. గతంలో మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగించడంతో ఈసారి శాశ్వతంగా చెక్ పెట్టినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 21 బంతుల్లోనే ఒక ఫోరు, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
డ్రోన్ దాడి జరిగిన వెంటనే పెట్రోలియం జోన్లోని ఒక విభాగంలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సహాయక బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది.
చాందీ ఉమ్మన్, తన తండ్రి పేరిట ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధించారు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేరళలోని కన్నూర్ కు బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి మళ్లీ గెలిచారు. ఎన్టీఏ కూటమి భాగస్వామిగా రెండో సారి పదవీ స్వీకారానికి సిద్దమయ్యారు.
అవి 2021 తమిళనాడు శాసన సభ ఎన్నికలు...
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాది రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.