సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు...రేపు అందుకోనున్న అధినేత

Publish Date:Apr 24, 2026

Advertisement

 

ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు. ముంబైలో శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం అమరావతి నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తారు. 2.40 గంటలకు ముంబై  విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5.25 గంటలకు వెన్యూ అయిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్తారు. రాత్రి 9.30 వరకు ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.50 గంటలకు ముంబై నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. 

విప్లవాత్మక విధానాల అమలుకు దక్కిన గుర్తింపు 

రేపు సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకూ జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఎకనమిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డు ను ముఖ్యమంత్రికి ప్రధానం చేయనుంది. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు లాంటి విప్లవాత్మక విధానాలు అమలుకు గాను ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డుకు సీఎం చంద్రబాబును ఎంపిక చేసింది.  గతంలో అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, జై శంకర్ తదితర ప్రముఖులకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది.

సీబీఎన్ బ్రాండ్ ఇమేజ్‌తో ఏపీకి పెట్టుబడులు

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు-పారిశ్రామిక అనుకూల పాలసీలు తీసుకు రావడంలో చంద్రబాబు పోషిస్తున్న పాత్రను ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏపీకి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు రావడంలో విజయవంతం కావడం, పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ అమలు చేస్తున్న సంస్కరణలు, టెక్నాలజీ , ఇన్నోవేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్,  గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఆయన చేస్తున్న కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన అనుభవంతో పాటు, ప్రస్తుతం అమరావతి, విశాఖపట్నం వంటి నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

By
en-us Political News

  
గత కొద్ది కాలంగా ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆ ఆపరేషన్ పెద్దగా ఫలించలేదు. పైపెచ్చు అమెరికా వ్యూహాల డొల్లతనం ప్రపంచానికి ప్రస్షుటమంది. దీంతో ఈ ఆపరేషన్ పేరు మార్చి మరింత పదునైన వ్యూహాలతో, మరింత తీవ్రమైన దాడులను చేపట్టాలని అగ్రరాజ్యాధినేత ట్రంప్ నిర్ణయించారు
ఉష చిలుకూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన వడ్లూరు గ్రామం. ఆమె తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు కావడంతో, చిన్నతనం నుంచే ఆమెకు చదువుపై మక్కువ పెరిగింది. అమెరికాలోనే పుట్టి పెరిగినప్పటికీ, ఉషా చిలుకూరి భారత సంస్కృతిని, విలువలను ఎప్పుడూ మర్చిపోలేదు. యేల్ యూనివర్సిటీలో లా చదువుతున్న సమయంలోనే ఆమెకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది.
స్టార్ బ్యాటర్ విరాట్ కింగ్ కోహ్లీ అద్భుత శతకంతో చెలరేగడంతో కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆర్సీబీ మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమని ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సీఎం చంద్రబాబు తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించారు.
రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత పటిష్ట పరిచేందుకు వ్యవస్థలో సామర్ధ్య పెంపు జరగాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
ప్రజాస్వామ్యం వచ్చింది. పాలకుండలాంటి ఓటు హక్కును తెచ్చింది.
నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని చివరకు సస్పెన్షన్‌కు గురయ్యాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.