కరోనా ఎఫెక్ట్.. ఏకంగా దేశ ప్రధాని పై 900 కోట్లు కట్టాలని ఆ దేశ ప్రజల దావా..
Publish Date:Dec 24, 2020
Advertisement
కరోనాతో దాదాపుగా గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక తమ ఐనవాళ్ళ కడసారి చూపుకు కూడా నోచుకోని వారి బాధ ఐతే వర్ణనాతీతం. తాజాగా కరోనా కట్టడిలో ఇటలీ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రి విఫలమయ్యారని.. వారికీ వ్యతిరేకంగా సుమారు 500 మంది ప్రజలు కోర్టును ఆశ్రయించారు. దేశ ప్రధాని కారణంగా తమకు తీరని నష్టం జరిగిందనీ.. అందువల్ల తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు కోర్టును కోరారు. గత సంవత్సర కాలంగా కరోనా కాటు వల్ల సొంతవాళ్లను పోగొట్టుకున్న ప్రజలు.. సాక్షాత్తు ఇటలీ ప్రధాని గిసెప్పే కొంటేపై కోర్టులో దావా వేశారు. ఈ దావాలో ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజాతోపాటు, లాంబార్డీ ప్రాంత గవర్నర్ అట్టిలియో ఫొంటావా పేర్లను కూడా చేర్చారు. దావా వేసిన ప్రజల ముఖ్య ఆరోపణ ఏంటంటే.. కరోనా విజృంభిస్తున్న సమయంలో తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ఈనేతలంతా విఫలమయ్యారని కోర్టులో వేసిన దావాలో ఆరోపించారు. ఈ ముగ్గురి నిర్లక్ష్యం కారణంగా తాము అయినవాళ్లను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయానికి దేశ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రితోపాటు గవర్నర్ కూడా పూర్తి బాధ్యత వహించి.. నష్టపరిహారంగా 100 మిలియన్ యూరోలు (సుమారు రూ. 900కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా. ఇటలీలో ఫిబ్రవరి 20న మొట్టమొదటి కరోనా కేసు బయటపడింది. ఇప్పటివరకు ఆ దేశంలో కరోనా కారణంగా 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాలలో ఇటలీ ఐదో స్థానంలో ఉంది.
http://www.teluguone.com/news/content/families-of-corona-victims-approach-court-against-italian-pm-39-108125.html





