సముద్ర జలాల నుంచి విద్యుత్.. అద్భుతాన్ని ఆవిష్కరించిన జపాన్.!

Publish Date:Jul 9, 2026

Advertisement

టెక్నాలజీ ఆవిష్కరణల్లో ప్రపంచాన్ని తరచుగా విస్మయానికి గురి చేస్తూ ఉండే జపాన్.. ఇప్పుడు ఇంధన రంగంలో మరో ఆవిష్కరణకు తెరలేపింది.  నదులు వచ్చి సముద్రంలో కలిసే ప్రతిసారీ, మంచినీరు, ఉప్పునీరు మిళితమయ్యే క్రమంలో కొంత శక్తి నిశ్శబ్దంగా వృథా అవుతుంటుంది. ఈ సహజ సిద్ధమైన ప్రక్రియను ఎవరూ ఊహించని రీతిలో ఒడిసిపట్టి..  ఏకంగా సముద్రపు ఉప్పునీటి నుండి కరెంట్ తయారు చేసే సరికొత్త సాంకేతికతను జపాన్ శాస్త్రవేత్తలు సక్సస్ ఫుల్ గా ఆవిష్కరించారు. జపాన్‌లోని తీరప్రాంత నగరం ఫుకుయోకాలోని  మామిజుపియా డీశాలినేషన్ కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి ఒస్మోటిక్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి జపాన్ ఇంధన రంగంలో వినూత్న విప్లవానికి నాంది పలికింది.  డెన్మార్క్  తర్వాత ప్రపంచంలోనే ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నడుస్తున్న రెండో ప్లాంట్ ఇదే కావడం విశేషం. సాధారణంగా నగరాలు వదిలేసే అత్యధిక ఉప్పు సాంద్రత కలిగిన వ్యర్థ నీరు, మురుగునీటి ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని ఉపయోగించి ఈ ప్లాంట్ లో  విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

ఈ విప్లవాత్మక ప్లాంట్ సైన్స్ లోని  ఒస్మోసిస్ అంటే ద్రవాభిసరణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. దీనిని శాస్త్రీయంగా  ప్రెజర్ రిటార్డెడ్ ఒస్మోసిస్ అంటారు. ఈ ప్రక్రియలో అత్యధిక ఒత్తిడితో కూడిన ఉప్పునీటి వైపుకు మంచినీరు అత్యంత వేగంగా దూసుకురావడం వల్ల అక్కడ నీటి పరిమాణంతో పాటు ప్రవాహ ఒత్తిడి అనూహ్యంగా  పెరుగుతుంది. ఈ తీవ్రమైన నీటి ప్రవాహ ఒత్తిడిని ఉపయోగించి భారీ టర్బైన్లను వేగంగా తిప్పుతారు, ఆ తర్వాత దానికి అనుసంధానించిన జనరేటర్ సహాయంతో కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ మొత్తం ప్రయోగంలో ఎలాంటి సాంప్రదాయ ఇంధనాన్ని వాడకపోవడం, అలాగే పర్యావరణానికి హాని చేసే కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు   విడుదల కాకపోవడం విశేషం.  

 సాధారణ సముద్రపు నీటిలో 3.5 శాతం మాత్రమే ఉప్పు ఉంటే, ఈ డీశాలినేషన్ కేంద్రంలో మంచినీటిని వేరు చేసిన తర్వాత మిగిలే వ్యర్థ   నీటిలో ఏకంగా 8 శాతం అత్యధిక ఉప్పు సాంద్రత ఉంటుంది. మరోవైపు మంచినీటి విభాగంలో మురుగునీటి ప్లాంట్ నుంచి సేకరించిన శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. ఈ రెండు రకాల నీళ్ల మధ్య ఉప్పు సాంద్రత తేడా ఎంత ఎక్కువగా ఉంటే, నీటి ప్రవాహ ఒత్తిడి అంత బలంగా మారి అంత ఎక్కువ విద్యుత్ జనరేట్ అవుతుంది. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా నడుస్తున్న ఈ ప్లాంట్ ఏడాదికి ఏకంగా 8 లక్షల 80 వేల కిలోవాట్ అవర్ల విద్యుత్‌ను  ఉత్పత్తి చేస్తోంది. ఈ కరెంట్ దాదాపు 300 జపనీస్ కుటుంబాల వార్షిక గృహ అవసరాలకు సరిపోతుంది.

మనం సాధారణంగా చూసే సౌరశక్తి, పవన విద్యుత్ లాంటి పునరుత్పాదక ఇంధన వనరులకు వాతావరణ పరిస్థితులతో సంబంధం ఉంటుంది. ఎండ లేకపోయినా, గాలి వీచకపోయినా వాటి ఉత్పత్తి నిలిచిపోతుంది. కానీ, జపాన్ కనిపెట్టిన ఈ సరికొత్త పవర్ ప్లాంట్ వాతావరణ మార్పులతో   సంబంధం లేకుండా, ఏకధాటిగా 90 శాతం గరిష్ట సామర్థ్యంతో రోజుకు 24 గంటలూ నిరంతరాయంగా క్లీన్ ఎనర్జీని అందిస్తుంది. ఫిల్టర్లు త్వరగా పూడుకుపోవడం వంటి కొన్ని చిన్న చిన్న సాంకేతిక సవాళ్లు   ఎదురవుతున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా నదీ ముఖద్వారాల వద్ద ఈ  బ్లూ ఎనర్జీ ని   భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు జపాన్ చేసిన ఈ అద్భుత ప్రయోగం ఒక దిక్సూచిలా నిలుస్తుంది. 

japan osmotic power plant, saltwater electricity generation, blue energy technology

By
en-us Political News

  
నిత్యం వందలాది మంది కార్మికులు పని చేసే ఆ బహుళ అంతస్తుల ఫ్యాక్టరీ భవనంలో.. గురువారం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఎం జరుగుతోందో అర్థమయ్యేలోగానే 28 మంది కార్మికులు ఆ మంటల్లో సజీవదహనమయ్యారు. పలువురు గాయపడ్డారు.
న్నవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన 8 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం శుక్రవారం స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు నిర్వహించింది. గంటల తరబడి సాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు, సమాజంలో అశాంతిని రేకెత్తించేలా సాగిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ మొత్తం తనిఖీ ప్రక్రియ పోలీసులు వీడియో రికార్డింగ్ చేశారు.
బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం లక్ష్యంగా జరిగిన ఈ దాడుల ప్రభావంపై ఇరాన్ ప్రభుత్వ మీడియా స్పందించింది. అమెరికా జరిపిన ఈ దాడుల ధాటికి బుషెహర్ అణు కేంద్రం ప్రాంగణంలోని ఒక ముఖ్యమైన భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. కేవలం అణు కేంద్రమే కాకుండా, ఇరాన్ రక్షణ రంగానికి, వాణిజ్యానికి అత్యంత కీలకమైన బందర్ అబ్బాస్, కొనారక్ వంటి తీరప్రాంత నగరాలపై కూడా అమెరికా దాడులు చేసింది. ప్రధానంగా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇఖ నాలుగో టి20 విషయానికి వస్తే.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ టీమ్ ఇండియాపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, మోసపూరిత మార్గాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన వారిపై ఉక్కుపాదం మోపింది. సుదీర్ఘ కాలంగా సాగిన విచారణ అనంతరం ఏకంగా 3 వేల 35 మంది టీచర్లను ఒకేసారి విధుల్లోంచి తొలగిస్తూ బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
మే 8న హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైంది. మే 16వ తేదీన భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుండి అంటే దాదాపు 45 రోజులకు పైగా అతడు చర్లపల్లి జైలులోనే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
తమ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నందుకు ప్రతీకారంగానే పాక్ సైనిక కేంద్రాలపై దాడులు చేస్తున్నామని బలూచ్ రెబల్ గ్రూపులు హెచ్చరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ సైన్యంపై మరిన్ని భారీ ఎత్తున దాడులు చేస్తామని స్పష్టం చేశాయి.
తంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది. ఖాసిం సులేమానీ మతికి ప్రతీకారంగా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ఎత్తుగడలు వేస్తోందని నిఘావర్గాలు చెబుతున్నాయి.
అంతర్జాతీయ నివేదికలు, రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది.
స్టాక్ మార్కెట్లో సరైన ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేసి ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నానో ఈ వెబ్ స్టోరీలో చూడండి. కొత్త ఇన్వెస్టర్లు ఫోమో FOMO, స్టాప్ లాస్ లేకపోవడం వంటి ఏ తప్పులు చేయకూడదో మరియు రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల FII 60 బిలియన్ డాలర్ల అమ్మకాల సునామీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. ముడి చమురు ధరల తగ్గుదలతో మారిన మార్కెట్ సమీకరణాలు మరియు దేశీయ ఇన్వెస్టర్ల రికార్డు కొనుగోళ్లపై పూర్తి విశ్లేషణ.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తొలిసారి అధికారికంగా కరూర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధితుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ పత్రాలను అందజేయడంతో పాటు, నూతన పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కేవలం 4 నెలల్లోనే 140 శాతం పెరిగి, 3 రోజుల్లో 18 శాతం లాభంతో సరికొత్త రికార్డు సృష్టించిన స్మాల్‌క్యాప్ ఏరోస్పేస్ స్టాక్ ఏక్వస్ (Aequs) గురించిన పూర్తి వివరాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.