ప్రపంచ వ్యాప్తంగా బుధవారం (డిసెంబర్ 31) రాత్రి నుంచి గురువారం (జవవరి 1) తెల్లవారు జాము వరకూ నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. విశ్వనగరం హైదరాబాద్ లో కూడా నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ పలు ఈవెంట్లు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకలలో నగర యువత యువత ఆటపాటలతో సందడి చేశారు. సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో మందుబాబులు కూడా పండుగ చేసుకున్నారు. పబ్ లు బార్ లలో అర్ధరాత్రి వరకూ తాగి చిందులేశారు. అక్కడితో ఆగకుండా నిబంధనలను ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసులకు పట్టుబడిన వారి సంఖ్య కూడా హైదరాబాద్ లో అధికంగానే ఉంది.
మద్యం సేవించి రోడ్లపైకి వాహనాలతో వచ్చిన వారికి పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. నగర వ్యాప్తంగా అన్ని కీలక ప్రాంతాలలోనూ డంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని అడ్డుకున్నారు. భారీగా జరిమానాలు విధించారు. గురువారం డిసెంబర్ 31) అర్ధరాత్రి ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drunk-and-drive-cases-on-new-year-eve-36-211881.html
హిడ్మా ఎన్కౌంటర్ వెనుక టీపీసీసీ నేత పాత్ర ఉందని మావోయిస్టులు లేఖ సంచలనం విడుదల చేశారు
టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు.
నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు.
రేపు కొండగట్టు ఆంజనేయస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదల పరిష్కారానికి కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించాయి.
ఆ మేరకు సిఫారసు లేఖలు, వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు వచ్చే వారు కూడా టికెట్ తీసుకునే దర్శనం చేసుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు చెప్పారు.
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్పై నమోదైన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది
మావోయిస్టు అగ్రనేత హెడ్మా ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ సాయిధ బలగాల వ్యవహారాలు చూస్తున్న బర్సే దేవా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లేనని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
దుర్గం చెరువును అక్రమంగా ఆక్రమించారన్న ఆరోపణలపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసు నమోదు అయింది.
కలెక్టర్ లైఫ్ జాకెట్ ధరించి ఉండటం.. అక్కడే ఉన్న స్విమ్మర్లు వెంటనే అప్రమత్తమై ఆయనను ఒడ్డుకు తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆయనను వేరే పడవలోనికి చేర్చారు.
నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే పాతాళ మెట్ల మార్గానికి సమీపంలోనే స్థానికుల నివాస ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి చోట చిరుత సంచారం భయాందోళనలకు కలిగిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులు ఆమోదం తెలిపింది