డ్రగ్స్ డీల్ భగ్నం.. పోలీసులపైకి కారును దూసుకెళ్లించిన యువకుడు..!

Publish Date:Jul 26, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నిఘా నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు కారుతోనే దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. డ్రగ్స్ డీల్‌ను భగ్నం చేసిన పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు కారు రివర్స్‌లో వేగంగా నడిపి ఓ కానిస్టేబుల్ కాలుపై నుంచి దూసుకెళ్లాడు. అనంతరం నగర రహద రులపై కొంత దూరం వరకు ఛేజ్ ఆసక్తికరంగా సాగింది. చిట్ట చివరకు పోలీసులు అఫ్జల్‌గంజ్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు కాలు ఫ్రాక్చర్ కాగా, హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్‌తో పాటు మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

 వివరాల్లోకి వెళితే.. ! 

హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు అబిడ్స్ ప్రాంతంలో డ్రగ్స్ కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నట్లు విశ్వస నీయమైన సమాచారం అందింది. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.. హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందంతో కలిసి అబిడ్స్ ప్రాంతంలో మాటు వేసి నిఘా చేపట్టారు.
కొద్దిసేపటికే నీలం రంగు బలెనో కారు అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ సమీపానికి చేరుకుంది. కారులో ఉన్న వ్యక్తికి బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద ప్యాకెట్ అందజేయడాన్ని పోలీసులు గమనించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్యాకెట్ అందిం చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం కారులో ఉన్న హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన సైఫ్‌కు పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించి వాహనం నుంచి దిగాలని సూచించారు. మొదట సహకరిస్తున్నట్లు నటిస్తూ సైఫ్.. ఒక్కసారిగా కారు రివర్స్ గేర్‌లో వేగం గా నడిపాడు. అధిగమనించిన కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో రెచ్చిపోయిన సైఫ్ కారు ఆపకుండా కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలుపై నుంచి దూసుకెళ్ల డంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.అయినా నిందితుడు ఆగకుండా అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే హెచ్-న్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌తో పాటు ఇతర సిబ్బంది కారును వెంబడిం చారు. నగర వీధుల్లో కొంతసేపు ఉత్కంఠభరితంగా సాగిన ఛేజ్ అనంతరం పోలీసులు చివరకు అఫ్జల్‌ గంజ్ వద్ద కారును అడ్డ గించి సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కారు కాలుపై నుంచి వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ కాలు విరిగింది. ఆయనను వెంటనే సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అంది స్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ ఫిర్యాదు మేరకు నిందితుడు సైఫ్‌పై అబిడ్స్, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో హత్యాయత్నం తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హెచ్-న్యూ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ నెట్‌వర్క్‌తో అతనికి ఉన్న సంబంధాలు, ప్యాకెట్‌లోని మాదకద్రవ్యాల గురించి, సరఫరాదారుల వివరాలపై లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.

Drug deal busted, Constable Mahender Yadav, Abids, Hussaini Alam,  CP Sajjanar, Hyderabad police, DCP C.V. Anand


 

By
en-us Political News

  
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
ఇంత కాలంగా ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అదనపు బాధ్యతలు స్వీకరించినప్పుడు లేదా వేర్వేరు ప్రాజెక్టుల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి పదవికి ఒక వాహనం చొప్పున బహుళ వాహనాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2022 నాటి పాత మార్గదర్శకాలకు అనుబంధంగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్థిక శాఖ వ్యయ విభాగం అటువంటి సదుపాయాలకు చెక్ పెట్టాయి.
హక్కుల హననానికి తోడు పీవోకేలో గళమెత్తుతున్న ప్రజలపై పాక్ బలగాలు పాశవిక అణచివేతకు పాల్పడుతున్నారు. గత రెండు రోజులుగా రావల్‌కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడులు, కాల్పుల్లో 40 మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. పీవోకేలో జనం ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం యుద్ధం ప్రకటించింది.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది
మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు, ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.