మన్యంలో కుప్పకూలిన డ్రోన్.. ఏంజరిగిందంటే?
Publish Date:Mar 27, 2026
Advertisement
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో డ్రోన్ కుప్పకూలిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొని ఉండటం.. నిత్యం డ్రోన్ దాడులకు సంబంధించి వార్తలు వినవస్తుంటంలో ఆకాసం నుంచి ఓ డ్రోన్ వచ్చి పడటంతో స్థానికులు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. జి.మాడుగుల మండలం బొయితిలి సమీపంలో ఈ ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు అత్యవసరమైన వైద్య సేవలు అందించేందుకు రెడ్ వింగ్ సంస్థతో కలిసి ప్రభుత్వం డ్రోన్ల ద్వారా అత్యవసర మందులను వేగంగా తరలించేందుకు సంకల్పించింది. ఇందుకోసం ఎమర్జెన్సీ మెడికల్ ట్రయల్ రన్ చేపట్టింది. ఆ ట్రయల్ రన్ లో ఉన్న డ్రోన్ బొయితిలి గ్రామ పరిసరాల్లో కూలిపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రోన్ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించేందుకు జరుగుతున్న ట్రయల్ రన్ లో భాగంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఎటువంటి ఆందోళనా అవసరం లేదని భరోసా ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/drone-crashes-in-the-agency-area-36-216264.html





