వివేకా అంటే జ‌గ‌న్‌కు కోపం!.. హ‌త్య కేసులో మ‌రింత సంచ‌ల‌నం

Publish Date:Mar 5, 2022

Advertisement

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు మిస్టరీ ఛేదించడంలో సీబీఐ అధికారులు మరింతగా దూకుడు పెంచారు. రాజకోట రహస్యం మాదిరిగా జరిగిన పులివెందుల కోట హత్య కేసులో ఒక్కొక్కరి వాంగ్మూలమూ వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్ గా మారిన ముద్దాయి దస్తగిరి వాంగ్మూలం మొదలు.. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇతరులు సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాలన్నీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపైనే వేలు పెట్టి చూపిస్తుండడం గమనార్హం. ఈ హత్య కుట్ర వెనుక వైఎస్ జగన్ పథక రచన చేసి ఉండవచ్చని రాజశేఖర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేసిన విషయం ఆయన ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెలుగులోకి వచ్చింది. అందుకు ఆయన కొన్ని సంఘటనలను ఉదహరించారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకుని జగన్, అవినాష్ రెడ్డి లబ్ధిపొందారని చెప్పడం విశేషం. వివేకా కుమార్తె సునీత కూడా అవినాష్ రెడ్డినే సూత్రధారి అంటూ వాంగ్మూలం ఇచ్చారు. అంతటితో ఆగకుండా ఆమె లోక్ సభ స్పీకర్ కు కూడా లేక రాయడం విశేషం.

కాగా.. ఇప్పుడు వివేకానందరెడ్డి బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం  అవినాష్ రెడ్డి, జగన్ ల మీద అనుమానాలు మరింతగా పెంచే విధంగా ఉంది. వివేకా హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని సీబీఐకి శివప్రకాశ్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో ఆయన పేర్కొన్న పెద్ద నాయకులు ఎవరనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు. అయితే.. శివప్రకాశ్ రెడ్డి వ్యక్తం చేసిన అనుమానాల వెనుక అసలు విషయం అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి ఆ పెద్ద నాయకులు కావచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. వివేకానందరెడ్డి గొడ్డలి పోటుతో మరణించినప్పటికీ దాన్ని ‘గుండెపోటు’ అంటూ ప్రచారం చేసిన వ్యక్తులకు ఈ హత్య కుట్రలో ప్రమేయం ఉందని వాంగ్మూలంలో చెప్పడం. హత్య కుట్రలో తమ పాత్ర లేకపోతే ఘటనా స్థలంలో ఆధారాలను చెరిపించాల్సిన అవసరం వారికి ఎందుకు వచ్చిందనేది వివేకానందరెడ్డి బావమరిది సూటి ప్రశ్న. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, చిన్నాన్న మనోహర్ రెడ్డి సమక్షంలో ఆధారాల ధ్వంసం జరిగిందని చెప్పారు.

శివప్రకాశ్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో మరో కఠిన వాస్తవాన్ని కూడా స్పష్టంగా బయటపెట్టారు. తన బావ వివేకానందరెడ్డికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2004 ఎన్నికల నుంచే విభేదాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఆ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ తనకే కావాలంటూ జగన్ పట్టుపట్టారట. అయితే.. అప్పుడు ఆ టికెట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు వైఎస్ వివేకాందరెడ్డికే వచ్చింది. ఇది జగన్ కు ఏమాత్రం ఇష్టంలేకపోయిందట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో వివేకానందరెడ్డి చేరారు. అది కూడా జగన్ కు ఏమాత్రం నచ్చలేదట. జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి 2010 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం వివేకానందరెడ్డి ఇష్టం లేదట. అందుకే తొలుత వైసీపీలో వివేకా చేరలేదనే విషయం శివప్రకాశ్ రెడ్డి బయటపెట్టారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ విజయమ్మ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. తర్వాత వివేకా సోదరుడు సుధీకర్ రెడ్డి, వివేకా అనుచరులు వైసీపీలో చేరాలని కోరడంతో ఆ పార్టీలో చేరారని శివప్రకాశ్ రెడ్డి బయటపెట్టారు. అయితే.. వివేకానందరెడ్డిని వైసీపీలో చేర్చుకోడానికి జగన్ రెడ్డి ముందు నో చెప్పారట. తర్వాత జగన్ ఒప్పుకోవడంతో 2012 డిసెంబర్ లో వివేకానందరెడ్డి వైసీపీలో చేరారు.. అయినప్పటికీ వివేకా- జగన్ మధ్య విభేదాలు కొనసాగేవని ఆయన బావమరిది శివప్రకాశ్ వాంగ్మూలంలో చెప్పడం ఈ హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉంటుందో ఊహించవచ్చని అంటున్నారు.

మరో పక్కన సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి కన్నా వైఎస్ అవినాష్ రెడ్డితోనే జగన్ కు బాగా దోస్తీ ఏర్పడడానికి వైఎస్ భారతి దగ్గరి బంధువు కావడం ఒక కారణం అనేది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి వాంగ్మూలాన్ని బట్టి అర్థం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు. జగన్ సతీమణి వైఎస్ భారతి తల్లి.. వైఎస్ భాస్కర్ రెడ్డికి స్వయానా సోదరి. జగన్- భారతి పెళ్లి తర్వాత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఈ బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని జగన్ కు బాగా దగ్గరయ్యారట. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ రావడానికి మూడు కారణాలున్నట్లు శివప్రకాశ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెల్లడవుతోంది. మొదటిది అవినాష్ రెడ్డి వైఎస్ భారతి స్వయానా మేనమామ కొడుకు కావడం.. రెండోది వైఎస్ విజయమ్మపై 2011 లో కడప ఉప ఎన్నికల్లో వివేకానందరెడ్డి పోటీ చేయడం.. మూడోది వివేకానందరెడ్డికి టికెట్ విషయంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అనుకూలంగా లేకపోవడం. ఇంకో పక్కన వివేకానందరెడ్డి వైసీపీలో చేరడం కూడా వారికి సుతరామూ ఇష్టం లేదట. ఆ క్రమంలోనే వివేకాకు 2017లో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు శివప్రకాశ్ రెడ్డి వాంగ్మూలం వెల్లడిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా వివేకా వైసీపీ తరఫున తిరగడం భాస్కర్ రెడ్డి కుటుంబానికి రుచించలేదట. వాటికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కారణం అని వివేకా రగిలిపోయే వారట. అవినాష్ రెడ్డి గ్రూపుతో తన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి జట్టు కట్టడం వివేకాకు నచ్చలేదు. అందుకే గంగిరెడ్డిని వివేకా దూరం పెట్టారు. ఇలాంటివన్నీ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చేందుకు కారణం అయ్యాయని ఆయన బావమరిది శివప్రకాశ్రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా వెల్లడవుతున్న అంశాలు.

ఇప్పుడు సీబీఐ ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆ క్రమంలోనే వివేకా హత్యకేసులో ఒక్కక్కరి వాంగ్మూలం బయటికి వస్తున్నాయి. వివేకా మర్డర్ కేసులో ఏ వాంగ్మూలం చూసిన అవినాష్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నాయి. సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వారి ఇంటికి వెళ్లినా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాటిని తీసుకోలేదు. దాంతో సీబీఐ అధికారులు కడప కోర్టును ఆశ్రయించారు. కోర్టు అనుమతితో ఆయనకు నోటీసులు ఇచ్చి, అరెస్టు చేసేందుకు రంగం చేస్తున్నారని తెలుస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.