Publish Date:Mar 18, 2026
సూపర్స్టార్ రజనీకాంత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున క్షమాపణలు చెప్పి ఆ వివాదానికి తెర దించే ప్రయత్నం చేశారు. తమ నాయకుడు విజయ్కే నాయకుడైన సూపర్స్టార్ని బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఆ వివాదం చాలా విచారం కలిగించిందని పేర్కొన్నారు. బుధవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అర్జున.. రజనీపై తన వ్యాఖ్యల గురించి స్పందించారు. ఇటీవల అర్జున ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలనుకున్న సమయంలో డీఏంకే నేతలు ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.
అలాంటి ఒత్తిళ్లకు విజయ్ తలొగ్గరని అన్నారు. డీఎంకే బెదిరింపులకు భయపడి రజనీ రాజకీయంగా వెనకడుగు వేశారనిఅర్థం వచ్చేలా, అర్జున చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి . డీఎంకే నేతలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. రజనీ కూడా అర్జున వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీవీకే ఉన్నతస్థాయి నేత ఒకరు నా మీద చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యం. ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే.. కాలం సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది' అని ఎక్స్ వేదికగా రజనీకాంత్ స్పందించారు. ఈ నేపధ్యంలో రజనీకాంత్ను కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని, అది డీఎంకే కుట్ర అని మాత్రమే తాను చెప్పానని, రజనీ నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చని, ఈ వివాదం తనకు చాలా విచారం కలిగించిందని అదవ్ అర్జున అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/controversial-comments-on-rajinikanth-36-215727.html
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యుత్ శాఖలో కలకలం రేగింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట.
యుద్దం ముంగిపునకు ఇరాన్పై వత్తిడి తెచ్చేలా అమెరికా పలు షరతులు విధిస్తూ డెడ్ లైన్ విధించింది.
అమరావతికి తాము కట్టుబడి లేమంటూ బొత్స చేసిన వ్యాఖ్యల వెనక సారమేంటి? అయితే వైసీపీ తిరిగి మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నట్టా?
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ప్రజలపై మోయలేని భారం పడుతోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరగడంతో శ్రీలంకకు మళ్లీ ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి.
రఘురామకృష్ణం రాజుపై రాజద్రోహం కేసు ఎవరు పెట్టమన్నదెవరు? రాతపూర్వకంగా ఆదేశాలు ఉన్నాయా? ఉంటే ఎవరిచ్చారు? సాక్ష్యాలు ఫేకా అన్న విషయం పరిశీలించారా?
ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, హోర్ముజ్ జలసంధి గుండా భారత్ స్థిరమైన సముద్ర రవాణాను కొనసాగించింది. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్పై జరిపిన దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసిన ఫిబ్రవరి 28 నుండి, భారత నౌకలకు చెందిన కనీసం ఎనిమిది నౌకలు ఈ కీలకమైన జలసంధి గుండా ప్రయాణించాయి.
తాజా నిబంధనల ప్రకారం, వాహనదారులు టోల్ రుసుమును ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఒకవేళ వాహనానికి ఫాస్టాగ్ లేకపోతే, యూపీఐ ద్వారా సాధారణ రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది.
చరిత్రలో అమెరికాకు తగిలిన అతిపెద్ద మిలిటరీ సెట్ బ్యాక్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరిత్ర పునరావృతమవుతుంది అని పేర్కొంటూ.. 1980లో అమెరికా ఎదుర్కొన్న ఘోర పరాజయాన్ని ఆ పోస్టులో ఇరాన్ పేర్కొంది.