పండుగలతో ప్రజల జీవనశైలి ఆరోగ్యకరం : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 19, 2026

Advertisement

 

విజయవాడలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై సందడి చేశారు.మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం ఉగాది పచ్చడి రుచి చూశారు. జీవితంలో తీపి, చేదు, పులుపు వంటి అనుభవాల సమ్మేళనం అనే సందేశాన్ని గుర్తు చేస్తూ పచ్చడి ప్రాధాన్యతను వివరించారు. 

 

 

అనంతరం పండితుడు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం వినిపించగా సభలోని అందరూ ఆసక్తిగా విన్నారు.తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం… కొత్త సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సంతోషం, సుభిక్షం నెలకొనాలని కోరుకున్నారు. 

 

 

పండుగలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుస్తాయని సీఎం అన్నారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుందని తెలిపారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి 6,787 మందికి రూ. 55.63 కోట్లు ఫైల్‌పై సంతాకం చేసి నిధులు విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు మరింత ఉత్సాహాన్ని తెచ్చారు.

 


 

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం
హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది.
ఈ నెల 20వ తేదీన దేశంలోని అన్ని మెడికల్ షాపులు పూర్తి స్థాయిలో మూతపడనున్నాయి.
కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఏపీలోని పలు రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టింది.
చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో పోలీస్ విభాగానికే చెందిన కానిస్టేబుల్‌కు భారీ శిక్ష పడింది.
బండి సంజయ్‌ తన కుమారుడిని వెంట తీసుకుని వచ్చి విచారణను ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్‌లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం లభించింది.
తెలంగాణలో ఆదివారం పెట్రోల్ బంకుల మూసివేతపై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో, అధికారులు ఏమన్నారో ఈ స్టోరీలో తెలుసుకోండి.
హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.