కొత్తనీరు అంతా మంచిదే కాకపోవచ్చును:తెదేపా కార్యకర్తలు

Publish Date:Dec 30, 2013

Advertisement

 

ఎన్నికల సమర శంఖం పూరించిన చంద్రబాబు నాయుడు, తెదేపా నుండి గతంలో ఇతర పార్టీలలోకి వెళ్ళినవారిని తిరిగి పార్టీలోకి రప్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటపడాలనుకొంటున్నసమర్దులయిన నేతలను కూడా పార్టీలోకి ఆకర్షించాలని ప్రయతిస్తున్నారు. 

 

చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అవినీతిమయమయిన కాంగ్రెస్ పార్టీలో చాలా మంది దొంగలు ఉన్నపటికీ, కొందరు సమర్ధులు, ప్రజాదారణకల నేతలు కూడా ఆ పార్టీలో ఉన్నారని, అటువంటి వారు తెదేపాలోకి రాదలిస్తే మనం వారిని స్వాగతిద్దాము” అని అన్నారు.

 

వైజాగ్ నుండి మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు తెదేపాలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ గంటా రాకను తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. అదేవిధంగా తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి తెదేపాలోకి రావడాన్ని పరిటాల వర్గం తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. తోట శ్రీరాములు, వంగా గీత తదితరలు కూడా తెదేపాలోకి వచ్చేఆలోచనలో ఉన్నారు. నెల్లూరు నుండి కాంగ్రెస్ శాసనసభ్యుడు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, సర్వేపల్లి నుండి అడ్డాల ప్రభాకర్ రెడ్డి తెదేపాలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకా అనేకమంది కాంగ్రెస్ శాసనసభ్యులు, కొత్తగా రాజకీయాలలోకి ప్రవేశించేందుకు ఆసక్తి చూపుతున్న గల్లా జయదేవ్ వంటివారు అనేకమంది తెదేపాలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.

అయితే వారి రాకవల్ల పార్టీలో అలజడి లేవకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఎవరయినా ఇతర పార్టీల నేతలను తెదేపాలోకి చేర్చుకొనే ముందు స్థానిక తెదేపా నేతల, కార్యకర్తలని సంప్రదించి, తప్పనిసరిగా వారి అభిప్రాయలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే కొత్తవారిని చేర్చుకొంటామని ఆయన చెపుతున్నారు. వారిమాట కాదని బలవంతంగా కొత్తవారిని తెచ్చివారి నెత్తిన పెట్టబోమని కూడా ఆయన హామీ ఇచ్చారు.

 

ఒకేసారి బయట నుండి అనేకమందిని పార్టీలోకి ఆహ్వానిస్తే, చిరకాలంగా పార్టీని అంటిపెట్టుకొని సేవ చేస్తు టికెట్స్ఆశిస్తున్నవారు ఆందోళన చెందడం సహజం, అందువల్ల చంద్రబాబు నాయుడు, కొత్తావారిని పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నపటికీ, చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగయినా పార్టీ గెలవడం అత్యవసరమయినప్పటికీ, ఆ తొందరలో ఎవరినిపడితేవారి నమ్మిఅవకాశావాదులకు టికెట్స్ ఇస్తే, ఎన్నికలలో గెలిచిన తరువాత వారు పార్టీని మోసం చేసి వేరే పార్టీలలోకి మారిపోయే ప్రమాదం ఉంది.

 

కొన్ని నెలల క్రితం దాదాపు 11మంది తెదేపా శాసనసభ్యులు ఒకేసారి వైకాపాలోకి చేరడం, వారిపై స్పీకర్ ని అనర్హత వేటు వేయమని పిర్యాదు చేయవలసిరావడం వంటి అంశాలను మరిచిపోకూడదని తెదేపా కార్యకర్తలు కోరుతున్నారు. కొత్త నీరు అంతా మంచిది. పాతనీరు పనికి రాదని బయటపారబోసుకోవడం మంచిది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు వారి సలహాలను పాటిస్తారో లేదో, వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారో లేదో క్రమంగా తేలుతుంది.

By
en-us Political News

  
అవును. ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జి షీట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ,లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలను ఎ1,ఎ2గా పేర్కొన్న నేపధ్యంలో గాంధీలు జైలుకు వెళతారా? అనే ప్రశ్న దేశంలో ప్రముఖగా వినిపిస్తోంది.
జగన్ హయాంలో ప్రభుత్వం అడుగు తీసి అడుగేయాలంటే ఆయన అనుమతి అవసరం. రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలైనా సరే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ముందుకు సాగుతాయి. అంతెందుకు జగన్ ను కలవాటంటే ముందుగా ఆయనను కలవాలి. ఆయన ఓకే చేస్తేనే జగన్ దర్శనం లభిస్తుంది. ఇంతకీ ఎవరాయన అంటారా? అక్కడికే వస్తున్నా.. ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ రాజకీయ ముఖ్య సలహాదారు.
తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారి పోతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత పరుగులు తీస్తోంది, ప్రభుత్వ ప్రతిష్ట అంతే వేగంగా దిగజారుతోంది. సర్కార్ గ్రాఫ్ పడిపోతోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయట సమస్యలు ఎదుర్కుంటున్నారు, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రెక్కలు కత్తిరించింది చేతులు కట్టేసింది. కాళ్ళకు సంకెళ్ళు, నోటికి తాళం వేసింది. సెక్రటేరియట్ గాంధీ భవన్ కు మారింది, గాంధీ భవన్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి నటరాజన్ సమాంతర సర్కార్ నడుపుతున్నారు. మీట నొక్కితే చాలు ఇలాంటి వార్తలు తెర మీద వాలిపోతున్నాయి.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. స్వ‌యాన సీఎం రేవంత్ రెడ్డిసైతం కేటీఆర్ ను జైలుకు పంపిస్తానంటూ బ‌హిరంగ స‌భ‌ల్లో పేర్కొన్నారు. కేటీఆర్ కూడా జైలుకెళ్లేందుకు, సిద్ధ‌మ‌ని చెప్పడమే కాకుండా, జైల్లో యోగా చేసుకొని, మంచి ఫిట్ నెస్ తో బ‌య‌ట‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తానంటూ ప్రకటన కూడా చేశారు. త్వరలో కేటీఆర్ జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి‌.
జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది.
  తెలంగాణలో పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహించింది.  మద్యానికి బానిసలైన  కుటుంబాలు దీనవస్థను ఎదుర్కొన్నాయి. గత డిసెంబర్ లో కెసీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు .
మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా తీరు గురువింద గింజమాదిరగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పేటందుకె నీతులు ఉన్నాయి అన్నట్లు.. తాను చేసిన తప్పులు మరిచిపోయి ఇప్పుడు ఎదుటివారిపై విమర్శలకు తహతహలాడుతున్న రోజా తీరు చూస్తుంటే గురువింద గింజ సామెతే గుర్తుకు వస్తోందంటున్నారు పరిశీలకులు.
నందమూరి బాలకృష్ణ, నటసింహం. సినిమాలలో ఆయన అన్ స్టాపబుల్.. అలాగే రాజకీయాలలో అన్ స్టాపబుల్ ఎవరు? ఈ ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అలాంటిది తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని స్వయంగా చంద్రబాబే చెబితే.. ఔను తాను రాజకీయాలలో అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్వయంగా చెప్పారు.
భార‌త‌దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మ‌వుతోన్న వేళ‌ బీజేపీ అధినాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్టీ నాయ‌క‌త్వంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయ‌న్న చర్చ బీజేపీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో.. ఆయ‌న వార‌సుడిని ఎంపిక చేసే ప‌నిలో పార్టీ పెద్ద‌లు నిమ‌గ్న‌మ‌య్యారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో  రెండు రోజుల క్రితం జరిగిన లాఠీ చార్జిపై బిజెపి సీరియస్ గా ఉంది బిజెపి నేత ఈటెల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది . మజ్లిస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు
కేసీఆర్... ఈ మాట వినగానే నిన్నమొన్నటి వరకూ అందరి నోటా మాటల మాంత్రికుడు, రాజకీయ చాక్యుడు.. ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందే ఉంటారు. వారు వ్యూహ రచన చేయడానికి ముందే వాటికి విరుగుడు వ్యాహాలను అమలు చేసి వారిని నిరుత్తరులను చేస్తారు. అన్న మాటలే వినిపించేవి. అయితే ఇదంతా బీఆర్ఎస్ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితం కావడానికి ముందు వరకూ మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ రాజకీయాలను తట్టుకోవడం కష్టమని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరించేసిన పరిస్థితి.
పరిచయం అక్కర్లేని పేరు సల్మాన్ ఖాన్.. కండల వీరుడిగా అశేషమైన ప్రేక్షకాభిమానం కలగిన స్టార్ హీరో. దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలో ఆయనకు అభిమానులు ఉన్నారు. హీరోగా ఆయన స్థాయే వేరు. తెరపై విలన్లను భయభ్రాంతులకు గురి చేసి, వారిని చీల్చి చెండాని గెలిచే పాత్రలలో సల్మాన్ స్టైలే వేరు. ఎదురులేని హీరోగా ప్రేక్షకుల నీరాజనాలందుకునే సల్మాన్ ఖాన్ ఇప్పుడు భయంతో వణికి పోతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దారులన్నీ మూసుకుపోయాయి. రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. తన తీరు మార్చుకోక తప్పదని అర్ధమైంది. వైసీపీకి ఎటూ పొలిటికల్ ఫ్యూచర్ జీరో అని అవగతమైంది. ఇప్పుడు రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలంటే కాంగ్రెస్ వినా మరో దిక్కు లేదని అవగతమైంది. కాంగ్రెస్ కు అనుకూలంగా ఎన్ని ప్రకటనలు చేసినా.. అడగకుండానే ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నా.. అటు నుంచి ఎటువంటి స్పందనా కనిపించడం లేదు. ఇందుకు కారణం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షరాలిగా ఉన్న తన సొంత చెల్లి షర్మిల అనే విషయం బోధపడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.