కన్నుల పండువగా బ్రహ్మంగారి మఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం

Publish Date:Feb 26, 2026

Advertisement

 

శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 12వ మఠాధిపతిగా  శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ పట్టాభిషేక మమోత్సవం మంగళవారం (ఫిబ్రవరి 24) నుంచి    గురువారం (ఫిబ్రవరి 26) వరకూ     నభూతో న భవిష్యత్తు అన్నరీతిలో వేలాదిమంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.

 వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం  ప్రస్తుత మేనేజర్ ఈశ్వరయ్య ఆచారి ,మఠాధిపతి సోదరులు  నొస్సం దత్తాత్రేయస్వామి,  వీరభట్లయ్య స్వామి, మఠాధిపతి బావమరిది, భవిష్యత్  మేనేజర్ పి.పి.ఎన్. ప్రసాద్ పర్యవేక్షణలో కన్నులపండువగా నిర్వహించారు. గురువారం (ఫిబ్రవరి 26)  సాయంత్రం మఠాధిపతి   వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారికి  తులాభారం కార్యక్రమం నిర్వహించారు.    ఈ పట్టాభిషేక మహో త్సవాన్ని వీక్షించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ  మఠాధిపతులు, పీఠాధిపతులు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులుపెద్ద  సంఖ్యలో తరలి వచ్చారు.

పూర్వపు మఠాధిపతి శ్రీ వీర భోగ వసంత వెంకటేశ్వర స్వామిజ్యేష్ట కుమారుడు వెంకటాద్రి స్వామికి మఠాధిపతి బాధ్యతలు అప్పగించారు. . తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూద నాచారి, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్      కే.యం. కిరణ్ కుమార్ తోపాటు మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, వైసీపీ నాయకులు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి, మండల టిడిపి అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, సహకార పరపతి బ్యాంకు చైర్మన్ యల్లటూరి సాంబశివరెడ్డి, టిడిపి మండల నాయకులు ఎస్సార్ శ్రీనివాసులు రెడ్డి, ఎం పోలిరెడ్డి, పూజా శివ యాదవ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ యం. రామ గోవిందరెడ్డి, డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ ఈ.తిరుపాల్రెడ్డి తోపాటు కందిమల్లయ్యపల్లె పుర సంస్థాన ప్రజలు, వివిధ రాష్ట్రాల నుండి స్వామి శిష్యులు భక్తులు పాల్గొని పట్టాభిషేక మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం వసతి సౌకర్యం, భోజనం సౌకర్యం ఏర్పాటు చేశారు .జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  వివిధ మండలాల నుండి పోలీస్ సిబ్బంది ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. మఠం పురవీధుల గుండా, ప్రాంగణమంతా చలువ పందిళ్ళు విద్యుద్దీపాలంక రణలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

By
en-us Political News

  
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి సంక్లిష్ట పరిణామాల మధ్య, ఇరాన్‌తో నేరుగా లేదా పరోక్షంగా చర్చలు జరపడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలని అమెరికా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గెలుస్తామో లేదో తెలియని యుద్ధాన్ని కొనసాగించేకంటే.. ఏదో ఒకలా ఏదో మేరకు శాంతి కుదిరితే అదే పదివేలన్న భావనలో అమెరికా ఉందన్న చర్చ అంతర్జాతీయ రాజకీయ వేదికలపై జోరుగా సాగుతున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.