ఇండియాలో... ఎక్కువ డబ్బున్నోళ్లు ఎక్కువ మంది ఎక్కుడున్నారో తెలుసా?

Publish Date:Feb 28, 2017

Advertisement

ఊళ్లలో వుండే వారికి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. శుద్ధమైన నీరు వుంటుంది. కలుషితం కాని ఆహారం దొరుకుతుంది. మనిషి బతకటానికి ఇవి మూడు కాకుండా ఇంకేం కావాలి? నిజానికి ఏమీ అక్కర్లేదు! కాని, ఈ ఆదునిక కాలంలో డబ్బు అన్నిటికంటే ప్రముఖంగా కావాలి. ఆ డబ్బు ఎక్కువగా దొరికేది నగరాల్లోనే. ఇంకా సమృద్దిగా దొరికేది మహానగరాల్లోనే. అందుకే, రోజూ కొన్ని లక్షల మంది ప్రశాంతమైన గ్రామాల్ని వదిలి సిటీల బాట పడుతుంటారు. వలస కూలీల వద్ద నుంచీ కోటీశ్వరుల దాకా అందరిదీ ఇదే అవస్థ... 

 


నగరాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే దేశంలోని సంపదంతా నగరాలు, మహానగరాల్లోనే పోగైపోతుందా అనేలా కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి ఒక సర్వేలో! నేషనల్ వెల్త్ వాల్డ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఒక్కో నగరంలో ఎంత మంది బలియనీర్లు, ఎంత మంది మిలియనీర్లు వుంటున్నది బయటపడింది. ఆ లెక్కలు చూస్తే సిటీల్లో సంపద ఎంతగా పెరిగిపోతోందో మనకు ఇట్టే అర్థమైపోతుంది! ఇండియా మొత్తంలో అత్యధిక సంపద పోగై వున్న నగరం ముంబై! లక్ష్మీ దేవీ ధనాగారంలో వెలిగిపోతోంది మన ఆర్దిక రాజధాని. ఇక్కడ 28బిలియనీర్లు, 46వేల మంది మిలియనీర్లు వున్నారట! తరువాతి స్థానంలో 18మంది బిలియనీర్లు, 23వేల మంది మిలియనీర్లతో ఢిల్లీ రెండో ర్యాంక్ లో వుంది! ఇక మూడో స్థానం చెన్నై, కోల్ కతాలది కాదు. వాటి తరువాత అభివృద్ధి అయిన బెంగుళూరుది! అక్కడ 8మంది బిలియనీర్లు, 7వేల 700మంది మిలియనీర్లు వున్నారట!

 


బిలియనీర్లు, మిలియనీర్ల సంఖ్యలో వేలాది కోట్ల సంపదతో... అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో వున్నాయి కోల్ కతా, చెన్నై, పూణే, గుర్గ్రామ్ నగరాలు! మన భాగ్య నగరం భాగ్యవంతుల లిస్ట్ లో నాలుగో స్థానం ఆక్రమించింది. మన దగ్గర 6 మంది బిలియనర్లు వుంటే, 9 వేల మంది మిలియనీర్లు వున్నారట! ఇన్ని వేల మంది కోటీశ్వరులు కోట్లు వేసుకుని హడావిడి చేస్తున్నారు కాబట్టే హైద్రాబాద్ కార్లతో కళకళలాడిపోతోంది! షాపింగ్స్ మాల్స్ కౌంటర్లతో వెలిగిపోతున్నాయి! 

 


నగరాల్లో వేలాది కోట్లున్న కుబేరులు నివాసం వుండటం అత్యంత సహజం. కాని, రోజు రోజుకీ నగరాలు ధనికంగానూ, దేశానికి వెన్నెముక లాంటి గ్రామాలు పేదగానూ మారిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. గ్రామాల నుంచి జనం వలస రాకుండా, నగరాల్లో మాదిరిగానే అక్కడా కోటీశ్వరులు, లక్షాధికారుల సంఖ్య పెరిగేలా చేయగలిగితే... భారతదేశం నిజంగా అభివృద్ధి చెందుతుంది! లేదంటే తలనొప్పితో బాధపడుతోన్న రాజు నెత్తిన బంగారు కిరీటం పెట్టుకున్నట్టు... బరువు తప్ప సుఖం ఎంత మాత్రం మిగలదు! 

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.