ఏపీ మద్యం కుంభకోణం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్

Publish Date:May 13, 2025

Advertisement

అరెస్ట్.. రాజ్ కేసిరెడ్డి అప్రూవర్? వాట్ నెక్స్ట్!
 

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.   ఈ కేసులో నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. గోవిందప్ప భారతీ సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలన్ని ఆయనే చక్కబెడతారని అంటారు. 

మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి   సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురినీ విజయవాడ కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఈ ముగ్గురూ కూడా నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం వీరికి అరెస్టు నుంచి  మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది.

జగన్‌కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితులు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్‌రెడ్డి,  గోవిందప్పలతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర ఉంది. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సిట్‌ ఇప్పటికే తేల్చింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్‌ కేసిరెడ్డి వీరికి చేరవేస్తే.. వీరు దాన్ని జగన్‌కు అందజేసేవారని ఇప్పటివరకూ అరెస్టైన నిందితులకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టుల్లో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్‌ అరెస్ట్‌ చేసింది.

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటికే కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్ లను అరెస్టు చేసింది. ఇరువురిరీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించింది. ప్రస్తుతం ఇద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన ముగ్గురి కోసం వేట మొదలెట్టింది. అందులో భాగంగా జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్పను అరెస్టు చేసింది. గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు జగన్ కు అత్యంత సన్నిహితులు. ఈ ముగ్గురినీ అరెస్టు చేస్తే ఏపీ మద్యం కుంభకోణం గుట్టు విడిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ ముగ్గురిలో గోవిందప్ప అరెస్టయ్యారు. ఇక నేడో రేపో మిగిలిన ఇద్దరూ అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిల అరెస్టు కూడా ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధమైనట్లు వార్తలు వినవస్తున్నాయి. అదే జరిగితే మొత్తం జగన్ దోపిడీ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారతారనడానికి ఆయన న్యాయవాది కోర్టులో చేసిన వాదనలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో పెద్దలంతా తప్పించుకుని తన క్లయింట్ రాజ్ కేసిరెడ్డిని బలిపశువుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఈ ప్రయత్నాలను సహించబోమనీ, అన్నీ బయటపెడతామనీ సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.  ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి లాయర్ ఏకంగా కోర్టులోనే తన క్లయింట్ ను బలిపశువును చేశారంటే చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇవే ఆరోపణలు రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారనున్నట్లు దర్యాప్తు అధికారులకు పంపిన సందేశంగా కూడా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

By
en-us Political News

  
మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు. ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు.
దాదాపు 500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతోనేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.