బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Publish Date:Mar 3, 2026
Advertisement
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ప్రధాన మంత్రి పదవి వారసత్వ హక్కు కాదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు..కాంగ్రెస్ యాక్టింగ్ కోర్సులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం దేశానికి “గ్రహణం” లాంటిదని సంజయ్ వ్యాఖ్యానించారు. “ప్రధానమంత్రి కుర్చీ చిరునవ్వు, తల ఊపంతో బహుమతిగా ఇచ్చే కుటుంబ వారసత్వం కాదు” అని ఆయన అన్నారు. ‘రాహుల్ గ్రహణం’ ఇప్పటికే దేశాన్ని మూడు సార్లు చీకటిలోకి నెట్టడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ, ప్రధానమంత్రి నరేందర్ మోడీ నాయకత్వంలో అభివృద్ధి కిరణాలు ఎల్ల ప్పుడూ ప్రకాశిస్తాయని పేర్కొన్నారు. “ఇది ప్రజాస్వామ్యం, నిజాం తరహా దర్బార్ కాదు” అని విమర్శించారు. దేశంలో ప్రధానమంత్రి పదవికి ఎలాంటి ఖాళీ లేదని, 140 కోట్ల భారతీయులు ఇప్పటికే మూడు సార్లు నరేంద్ర మోదీపై తమ మద్దతు ముద్ర వేశారని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఎన్నిక ప్రజల ఓట్ల ద్వారానే జరుగుతుందని, హైదరా బాద్ సభల నినాదాలతో కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్పై అవినీతి ఆరోపణలు చేస్తూ, ప్రజలు ‘హామీలు’ మరియు ‘రాకుమారుడి ఆశయాల’పై విసుగుతో ఉన్నారని సంజయ్ అన్నారు. తిరస్కరణను ఎదుర్కొన్న నాయకుడిని ఎలాంటి ప్రచారం కప్పిపుచ్చలేదని పేర్కొన్నారు.అలాగే తెలంగాణ ప్రభుత్వంపై కూడా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైడ్రా చర్యలతో పేదల ఇళ్లు కూల్చివేత....విద్యార్థుల రీయింబర్స్మెంట్ల నిలుపుదల...రైతు భరోసా హామీల అమలు లోపాలు... మూసి పునర్నిర్మాణం పేరుతో నిరాశ్రయ సమస్య.. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల పెండింగ్... వాటి ఈ అంశాలను ప్రస్తావిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి తన బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని రేవంత్ రెడ్డికే తెలుసని, కాబట్టి భజన ఆపి పరిపాలనపై దృష్టి సారించాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
http://www.teluguone.com/news/content/bandi-sanjays-sensational-comments-36-214922.html





