లోకేష్ విషయంలో వెనక్కు తగ్గిన సీఐడీ.. జగన్ కు పిక్చర్ క్లియర్!

Publish Date:Oct 6, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అయిన వారానికే ఆయన కుమారుడు, పార్టీ జాతీయ  ప్రధాన కార్యదర్శ నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని అధికార వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన చేసిన తెలిసిందే. వైసీపీ మంత్రుల నుండి సలహాదారుల వరకూ అంతా మీడియా ముందుకొచ్చి లోకేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు చెప్పారు. అప్పటికి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. జాతీయ స్థాయి నేతలను కలిసి రాష్ట్రంలో సాగుతున్న కక్షపూరిత పాలన గురించి వివరించారు. స్వతహాగా చంద్రబాబు తత్వం, ఆయన పరిపాలన, రాజకీయ సిద్ధాంతాల గురించి తెలిసిన జాతీయ స్థాయి నేతలంతా అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. మరో వైపు లోకేష్ జాతీయ మీడియా సంస్థల   లైవ్ డిబేట్లలో పాల్గొని వైసీపీ అరాచకాలను జాతీయ స్థాయిలో ఎండగట్టారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి చూపు ఏపీ వైపు మళ్లింది. ఇదే సమయంలో వైసీపీ ఆయనపై కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసేందుకు  సిద్ధమైంది. ఒక కేసులో బెయిల్ దక్కినా ఎన్ని కేసులైనా పెట్టి ఆయనను కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు శపథాలు చేశారు. 

అప్పటికే రాష్ట్రంలో మధ్యలో బ్రేకులు పడిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం చేయనున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రకటించారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు. కానీ.. పలు దఫాలుగా సమాలోచనలు చేసిన అనంతరం చంద్రబాబు కేసు కొట్టివేత లేదా బెయిల్ దక్కే వరకూ లోకేష్ పాదయాత్ర ప్రారంభించకుండా నేతలు, టీడీపీ శ్రేణులకు అండగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు క్యాష్ పిటిషన్, బెయిల్ అంశాలపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతూ మరికొన్ని రోజులు లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ లోకేష్ ను అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. ఇంతలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసులో కూడా లోకేష్ ని ఇరికించిన సీఐడీ.. ఆ కేసులో అయినా లోకేష్ ను అరెస్ట్ చేయాలని చూసారు. కానీ, ఏమైందో ఏమో కానీ తర్వాత ఆ ఊసే లేకుండా పోయింది.

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు, లోకేష్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు ముఖ్య నేతలను కూడా అరెస్టు చేసి నాయకత్వం లేకుండా చేయాలని భావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా కేసులు పెడతామని వైసీపీ నేతలు బహిరంగంగానే బెదిరించారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల కేసులో పవన్ కూడా అరెస్ట్ అవుతారని వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. అయితే, లోకేష్ కానీ, పవన్ కానీ దేనికైనా సిద్ధమని ప్రకటించారు. నిజానికి లోకేష్ అరెస్టు అనే ప్రచారం జరిగే నాటికి లోకేష్‌పై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా చేర్చారు. స్కిల్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా లోకేష్ పేరు ఉందని సీఐడీ అధికారులు చేస్తున్న ప్రచారంతో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు లోకేష్ ఢిల్లీలో ఉండడంతో జరుగుతున్న డ్యామేజ్ తో తనను ఎలాగైనా ఏపీకి రప్పించాలని లోకేష్ ఏపీకి రావాలంటే భయపడుతున్నారని వైసీపీ ముమ్మర ప్రచారం చేసింది. 

కాగా, ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ బండారం బయటపడింది. ఏ14గా లోకేష్ ను చేర్చినా.. ఎఫ్ఐఆర్‌లో సెక్షన్లు మారిపోయిందని, అందుకే 41A నోటీసులు ఇస్తే అరెస్టు ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఇక స్కిల్ కేసులో అసలు లోకేష్ పేరు ఎఫ్ఐఆర్ లో ఉందో లేదో కూడా తనకు స్పష్టత లేదన్న ఏజీ.. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు ఎఫ్ఐఆర్‌లో లోకేష్ పేరే లేదని హైకోర్టుకు చెప్పారు. ఇలా లోకేష్ విషయంలో ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఆధారాలు లేనివేనని తేలిపోయింది. ఇలాంటి కేసులతో లోకేష్ ను అరెస్ట్ చేసినా రేపు ఇబ్బందులు తప్పవనే సీఐడీ వెనక్కు తగ్గినట్లు కనిపించింది.

ఇప్పటికే చంద్రబాబు కేసును ఎలాగైనా నిరూపించాలని నానాయాతన పడుతున్నారు. అలాగే జరిగిన నష్టంపై కూడా వైసీపీ పెద్దలు సమాలోచన చేస్తున్నారు. మొత్తం మీద జగన్ ఆదేశిస్తే  చాలు తాము ఎవరినైనా అరెస్టు చేస్తాం, ఏ కేసైనా పెడతాం అన్నట్లు వ్యవహరించిన ఏపీసీఐడీ అడ్డగోలుగా, ఇష్టారీతిన కేసులు నమోదు చేసి న్యాయస్ధానాల ముందు నిలవలేమని గుర్తించి వెనక్కు తగ్గినట్లే కనిపిస్తోంది. అలాగే అధికారం చేతిలో ఉన్నంత మాత్రానా ఇష్టారీతిగా వ్యవహరిస్తే బొక్కబోర్లా పడకతప్పదన్న క్లారిటీ జగన్ కు వచ్చినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్లున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.