ఇదే ఏపీ ఎన్నికల ముఖచిత్రం.. క్లారిటీ వచ్చేసిందిగా!

Publish Date:Oct 6, 2023

Advertisement

నిన్న మొన్నటి వరకూ ఏపీ రాజకీయాలు బుల్లెట్ రైలు కంటే వేగంగా మారుతూ కనిపించాయి. అయితే, ఇప్పుడు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తుంది. ఎన్నికలు ఏడాది నుండి నెలల వ్యవధిగా మారడంతో అంతే వేగంగా ఎన్నికల ముఖచిత్రంలో స్పష్టత వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు అరెస్టుకు ముందు.. అరెస్ట్ తర్వాత అన్న చందంగా ఏపీ రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ఎక్కడో ఏమూలో మిణుక్కు మిణుక్కు మంటూ వైసీపీలో విజయం మీద ఉన్న ఆశ.. అరెస్టు తరువాత ఆవిరైపోయింది. ఆ విషయం వైసీపీకే కాదు.. ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది.  నెల రోజుల కిందటి వరకూ అంటే చంద్రబాబు అరెస్టు ముందు వరకూ రానున్న ఎన్నికలలో ఏపీలో ఎవరు ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్తారనే డైలమా కనిపించేది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టుల ప్రయాణం ఎలా ఉంటుందోనన్న అనుమానాలు ఉండేవి. తెలుగుదేశం, జనసేన కలిసి నడిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు భావించినా అధికారిక ప్రకటనలు లేవు. అలాగే బీజేపీని కూడా కలుపుకు వెళ్తారా అనే అనుమానాలు వినిపించేవి. కానీ, నెల తిరిగేసరికి పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

రానున్న ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. నాలుగు సీట్లు దక్కించుకొని.. నాలుగు సీట్లు వదులుకొని అనే లెక్కల జోలికి పోకుండా   ఈ రెండు పార్టీల పొత్తు   ఫెవికాల్ బంధంలా అతుక్కుపోయింది. ఇక బీజేపీ వీరితో కలవడం కూడా సాధ్యం కాదన్నది కూడా తేలిపోయింది. ఒకవైపు చంద్రబాబు అరెస్టుపై కేంద్ర పెద్దల నుంచి కనీస స్పందన లేకపోవడంతో బీజేపీ రంగు తేలిపోయింది.  అసలు బీజేపీ పెద్దల ప్రమేయంతోనే జగన్ మోహన్ రెడ్డి అరెస్టు కథ నడిపిస్తున్నారన్నది  తెలుగుదేశం క్యాడరే కాదు, జనసేన, వామపక్షాలు, సామాన్య ప్రజలూ కూడా బలంగా నమ్ముతున్నారు. రాజకీయ చర్చలలో కూడా ఈ మాటే గట్టిగా వినిపిస్తోంది.   అదే సమయంలో బీజేపీతో పొత్తుతో లాభాల కన్నా నష్టమే ఎక్కువ అని సర్వేల ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.  మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ నుండి బయటకు వచ్చేశాన్న సంకతాలు ఇచ్చేశారు. మొత్తంగా టీడీపీ-జనసేన బీజేపీకి దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసేసుకున్నట్లు కనిపిస్తోంది.
 
ప్రతిపక్షాల సంగతి ఇలా ఉంటే..  అధికార  వైసీపీ కూడా స్పష్టంగానే ఉంది. వైసీపీ మరోసారి పొత్తులు లేకుండా సింగిల్ గానే పోటీ చేయనుంది. టీడీపీ,జనసేనలు బీజేపీని దూరం పెడితే మాత్రం వైసీపీ బీజేపీతో అనధికారిక పొత్తులో ఉంటుంది. గత నాలుగేళ్లుగా బహిరంగ రహస్యంగా ఉన్న ఈ రహస్య పొత్తు అలాగే కొనసాగనుంది. అయితే  ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైసీపీతో దోస్తీపై ఎలా స్పందిస్తారన్నది చూడాలి. ఇప్పటికే జగన్ సర్కార్ అరాచకాలు, అడ్గగోలు అప్పులపై విమర్శల దాడి చేస్తున్న పురంధేశ్వరి.. ఏపీ పరిస్థితులను కేంద్రానికి, బీజేపీ అధినాయకత్వానికి వివరించేందుకు ఏపీ బీజేపీ నేతల బృందంతో హస్తిన పర్యటనకు వెళ్లే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.  ఇక, కమ్యూనిస్టుల విషయానికి వస్తే సీపీఐ ఇప్పటికే టీడీపీ పక్షంగా కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుపై నారాయణ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఎండగడుతున్నారు. కనుక సీపీఐ టీడీపీ-జనసేనతో కలిసి నడవడం ఖాయం. కాగా, సీపీఐ కూడా ఎన్నికల సమయానికి ఈ కూటమిలోకే సర్దుకొనే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తంగా చూస్తే ఏపీలో ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉండగానే ఎన్నికల ముఖ చిత్రంపై స్పష్టత వచ్చేసింది. 

ఎన్నికలు, పొత్తులే కాదు.. ఫలితాలు కూడా స్ఫష్టంగానే కనిపిస్తున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయని తాజా సర్వేలు కూడా పేర్కొంటున్నాయి. ఏదో ఒకటీ రెండు సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ జపం చేస్తున్నా వాస్తవం ఏమిటన్నది  క్రిస్టల్ క్లియర్ గానే కనిపిస్తుంది. మెజారిటీ సర్వేల ఫలితాలు కూడా తెలుగుదేశం పార్టీదే  విజయం అని బల్లగుద్ది చెప్తుండగా జనసేన కూడా కలిస్తే వైసీపీకి కోలుకోలేని పరాజయం తప్పదని తేల్చేస్తున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ దక్కించుకున్న ఘన విజయం ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమి దక్కించుకోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ సింగిల్ గా పోటీ చేసినా వైసీపీ గట్టిపోటీ ఇవ్వలేదని అభిప్రాయపడుతున్నారు. అసలే అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రజలు.. చంద్రబాబు అరెస్టు తరువాత జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు.  చంద్రబాబు అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు గోబెల్స్  ప్రచారం చేయడం, ప్రభుత్వ లాయర్లు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు టీవీలకు ఎక్కి చంద్రబాబును దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వంటివి ఎబ్బెట్టుగా మారిపోయాయి. అసలు రాష్ట్రంలో పాలన అన్నదే మరుగున పడి చంద్రబాబు, లోకేష్ సహా విపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా వేధింపులకు గురి చేయడం, కేసులు బనాయించడం అన్న దానిపైనే జగన్ సర్కార్ దృష్టి కేంద్రీకరిస్తోందన్న భావన సర్వులలోనూ వ్యక్తం అవుతోంది. ఇదే పరిశీలకులు, రాజకీయవర్గాలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో ఒక క్లారిటీకి వచ్చేయడానికి కారణమైంది. 

By
en-us Political News

  
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.