సిట్టింగ్ స్థానాల్లోనూ పట్టు కోల్పోతున్న వైైసీపీ?!

Publish Date:Apr 24, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన వైసీపీకి, వచ్చే ఎన్నికలలో ఆ సంఖ్యైనా మిగులుతుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులలోనే వ్యక్తమౌతున్న పరిస్థితి. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం..  వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 11 నియోజకవర్గాల్లో కనీసం నాలుగు స్థానాల్లో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ గెలవడం సాధ్యం కాదని అంటున్నారు.   సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలలో.. కనీసం నాలుగింటిలో ఇప్పుడు వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి పులివెందుల తరువాత అంతటి సురక్షిత స్థానంగా చెప్పుకునే పుంగనూరులో ఆ పార్టీ ప్రస్తుతం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందని తెలుస్తోంది. పుంగనూరు పుడింగిగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ఎన్నికలలోనే చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో పెద్దిరెడ్డికి పుంగునూరులో వచ్చిన మెజారిటీ కవేలం 6వేల ఓట్లు మాత్రమే. అయితే ప్రస్తుతం చూస్తే.. ఆ నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదని అంటున్నారు. పెద్దిరెడ్డి కేవలం వ్యాపారాలు, కోర్టు కేసులకే పరిమితమై ప్రజలకు దూరంగా ఉండటమే ఇందుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇక  కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితులే ఉన్నాయి. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి సుధ విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆమె పనితీరు పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే ఎన్నికలలో బద్వేలు వైసీపీ చేజారడం ఖాయమని చెబుతున్నారు.  

అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో కూడా వైసీపీకి గడ్డుపరిస్థితులే నెలకొని ఉన్నాయంటున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు.  అయితే.. ఆయన నియోజకవర్గ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన అక్కడి ప్రజలలో వ్యక్తం అవుతోంది. మరో వైపు తెలుగుదేశం నేత గొట్టిపాటి రవి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. దీంతో వైసీపీ నియోజకవర్గంలో పట్టు కోల్పోయిన పరిస్థితి ఉందని అంటున్నారు. . 

ఇక అరకు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి రేగం మత్స్యలింగం ఇ విజయం సాధించారు. అయితే ఆయన కూడా నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదనీ, ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో తెలుగుదేశం కూటమి నేతలు క్షేత్రస్థాయిలో చురుకుగా, చొరవగా పని చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. దీంతో అరకులో కూడా ఆ పార్టీకి మరో చాన్స్ దక్కే అవకాశాలు అంతంతమాత్రమే అంటున్నారు.  

అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒక సారి పార్టీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టగానే, గాలి వైసీపీవైపు మళ్లడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ లో, ప్రజలలో వైసీపీ పట్ల ఒకింత అసంతృప్తి ఉన్నమాట నిజమే అయినా..
జగన్ మోహన్ రెడ్డి త్వరలో చేపట్టబోయే పాదయాత్ర  దానిని పటాపంచలు చేస్తుందనీ, మళ్లీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నది.   అయితే పరిశీలకులు మాత్రం ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకుని ప్రజలతో మమేకం కాకుండా వైసీపీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.