స్టీల్ బ్రిడ్జ్ ఈ -13 రోడ్డు నిర్మాణాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Publish Date:May 17, 2026

Advertisement

 

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని, అక్కడ శరవేగంగా జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ కుతంత్రాలు పన్నుతూనే ఉంది. అభివృద్ధి పనుల్లో లోపాలు, అవినీతి అంటూ విషం చిమ్ముతూనే ఉంది. అందులో భాగంగా అమరావతిని 16వ నెంబరు జాతీయ రహదారితో కలుపుతూ బ‌కింగ్ హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గ‌డ్డ‌ర్లు ఒరిగిపోయాయంటూ వైసీపీ తన అనుకూల మీడియాలో విషప్రచారం మొదలుపెట్టింది. అయితే ఆ వార్త‌లు పూర్తిగా అవాస్త‌వమని అమరావతి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ తెలిపింది. బ్రిడ్జి నిర్మాణం అత్యంత భద్రతా ప్రమాణాలతో కొనసాగుతోందని.. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాబట్టి ప్రజలెవరూ వైసీపీ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని అమ‌రావ‌తి డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఏడీసీఎల్) స్పష్టం చేసింది.

అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతిని నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేసేందుకు బ‌కింగ్ హామ్ కెనాల్‌పై స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జిని ఈ ఫిబ్రవరికి పూర్తిచేయాలనుకున్నా సాధ్యపడలేదు.. అయితే త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు. ఇంతలో స్టీల్ బ్రిడ్జి ఒరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారం మొదలైంది. ఈ బ్రిడ్జికి సంబంధించి రెండో వంతెన మధ్యలో గడ్డర్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఒంగిపోయాయని ప్రచారం జరుగుతోంది. గడ్డర్లు వంకర ఉన్నచోట్ల తొలగించి మళ్లీ బిగించి శ్లాబు వేస్తున్నారని చెబుతున్నారు.
స్టీల్ బ్రిడ్జి గ‌డ్డర్లు ఒరిగిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఏడీసీఎల్ స్పందించింది. 

బ్రిడ్జి ఒరిగిపోయిందంటూ వ‌స్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఈ స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో ప్రత్యేక సాంకేతిక విధానాలతో పొడవైన గడ్డర్లను తయారుచేసి జాయింట్ చేస్తారని ఏడీసీఎల్ తెలిపింది. గడ్డర్లకు సంబంధించి ఇంజినీరంగ్ ప్రమాణాలకు తగిన విధంగా చిన్న సవరణలు మాత్రమే చేపట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రక్రియలో గడ్డర్లు మిల్లీమీటర్ల స్థాయిలో బేరింగ్‌లపై అమర్చాల్సి ఉంటుందన్నారు. స్ట్రీల్ బ్రిడ్జి నిర్మాణంలో, భద్రత అంశాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దన్నారు.
ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా ఈ అంశంపై స్పందించింది. 

బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు ఒరిగిపోయాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తీవ్రంగా ఖండించింది. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో పొడవైన గడ్డర్లు జాయింట్ చేస్తారని, బేరింగ్‌లపై గడ్డర్లు అనుసంధానించేటప్పుడు.. ఒక్కోసారి గడ్డర్ల జాయింట్లను విడదీసి సరిచేస్తారని , అంతే కానీ గడ్డర్లు ఒరిగిపోతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వివరించింది. మరోవైపు మంగళగిరి ఎయిమ్స్  సమీపంలో పర్యావరణ శాఖ కళ్ళుకప్పి కొండలను అక్రమంగా తవ్వేస్తూ, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. 

అమరావతిని, మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానించే అత్యంత ప్రతిష్టాత్మకమైన E13 రోడ్డు నిర్మాణ పనులు సక్రమంగానే జరుగుతున్నాయని వెల్లడించింది. మంగళగిరి ఎయిమ్స్ మీదుగా అమరావతి కోర్ క్యాపిటల్‌కు వెళ్లే రహదారి మార్గంలో కొండ భాగం అడ్డుగా ఉందని, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి ప్రభుత్వం అధికారికంగా 'హిల్ కట్టింగ్' పనులను చేపట్టిందని వివరించింది. 

వాస్తవానికి ఏడీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల పర్యావరణ.అధికారిక అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారమే ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని అమరావతి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న E13 రహదారి అభివృద్ధి పనులను, సోషల్ మీడియాలో కొందరు అక్రమ కొండల తవ్వకం, ప్రకృతి విధ్వంసం అంటూ తప్పుడు రంగు పులిమి తప్పుదారి పట్టిస్తున్నారని, కాబట్టి ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
 

By
en-us Political News

  
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి భగీరథ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి చేరుకుంది.
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన ఒక వింత దొంగతనం ఘటన సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది.
బండి భగీరథ్ చుట్టూ తిరుగుతున్న పోక్సో కేసు వ్యవహారం గత కొన్ని రోజులుగా తీవ్ర చట్టపరమైన, రాజకీయ మలుపులు తిరుగుతోంది.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
తాను పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడినిని సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి.
మళ్లీ ఐ బొమ్మ పేరు తెరపైకి రావడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది.
మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ఆరంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మత్తులో కొందరు యువకులు చేస్తున్న పనులు తీవ్ర కలకలం రేపుతున్నాయి
బండి భగీరథ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.
తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.