విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ : రజినీకాంత్

Publish Date:May 17, 2026

Advertisement

 

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించి, ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన ద్రావిడ పార్టీలను కాదని, ఒంటరిగా పోరాడి విజయ్ సీఎం కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ రాజకీయ మార్పుల మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ చుట్టూ కొన్ని వివాదాలు, విమర్శలు ముసురుకున్నాయి. 

ఎన్నికల ఫలితాల తర్వాత రజినీకాంత్ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ను కలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడానికే రజినీకాంత్ ఈ భేటీ నిర్వహించారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేశాయి. దీనికి తోడు విజయ్ విజయంపై రజినీకాంత్ మౌనంగా ఉన్నారంటూ మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని తన పోయెస్ గార్డెన్ నివాసంలో రజినీకాంత్ ఆదివారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదాలన్నింటికీ అత్యంత ఘాటుగా, స్పష్టంగా సమాధానమిచ్చారు.  

మీడియాతో మాట్లాడిన తలైవా, తనపై వస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. "నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నాపై వస్తున్న అసత్య ప్రచారాలను అలాగే వదిలేస్తే అవే నిజాలని జనాలు నమ్మే ప్రమాదం ఉంది. రజినీకాంత్ ఎప్పుడూ చౌకబారుగా ఆలోచించే వ్యక్తి కాదు" అని ఆయన స్పష్టం చేశారు. మాజీ సీఎం స్టాలిన్‌తో తనకున్న సంబంధం గురించి చెప్తూ, తమ మధ్య ఉన్నది కేవలం రాజకీయామైన స్నేహమని రజినీకాంత్ పేర్కొన్నారు. 

గత 38 నుండి 40 ఏళ్లుగా తామిద్దరం మంచి స్నేహితులమని, ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమని అన్నారు. కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోవడం తనకు వ్యక్తిగతంగా బాధ కలిగించిందని, అందుకే ఒక స్నేహితుడిగా ఆయనను పరామర్శించడానికి మాత్రమే వెళ్లానని వెల్లడించారు. ఈ భేటీని విజయ్‌కు వ్యతిరేకంగా చిత్రీకరించడం ఎంతమాత్రం సమంజసం కాదని రజినీకాంత్ హితవు పలికారు.

ఇక నూతన ముఖ్యమంత్రి విజయ్ గురించి మాట్లాడుతూ, ఆయనపై తనకు ఎలాంటి అసూయ లేదని సూపర్ స్టార్ తేల్చిచెప్పారు. "నేను ఎప్పుడో రాజకీయాల నుంచి తప్పుకున్నాను. నేను రాజకీయాల్లో లేనప్పుడు విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది? ఒకవేళ నా సమకాలీనుడు కమల్ హాసన్ సీఎం అయి ఉంటే నేను కాస్త అసూయపడేవాడినేమో" అంటూ రజినీకాంత్ నవ్వుతూ చమత్కరించారు. 

విజయ్‌కు తనకు మధ్య దాదాపు 25 ఏళ్ల వయోభేదం ఉందని, చిన్నప్పటి నుంచి చూసిన అబ్బాయి ఇంతటి ఉన్నత స్థానానికి ఎదగడం తనకు ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని ఇచ్చిందని కొనియాడారు. కేవలం 52 ఏళ్ల వయసులోనే ద్విధ్రువ రాజకీయాలను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒంటరిగా ఎదుర్కొని విజయ్ సాధించిన విజయం సామాన్యమైనది కాదని ప్రశంసించారు. లెజెండరీ నటులు ఎంజీఆర్, ఎన్టీఆర్ సైతం తమ తొలి ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం సాధించలేదని, విజయ్ వారిని మించి సాధించారని రజినీకాంత్ కొనియాడారు.  

తాను విజయ్‌ను అభినందించలేదనే వార్తల్లో కూడా నిజం లేదని రజినీకాంత్ స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజున ఫలితాలు రాగానే తాను 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విజయ్‌కు, టీవీకే శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశానని గుర్తుచేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎందుకు హాజరుకాలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, తనకు గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్లే అలవాటు లేదని స్పష్టం చేశారు. 

విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వంపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని, ఆయన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు తలైవా పేర్కొన్నారు. విజయ్ సరికొత్త రాజకీయ ప్రస్థానానికి తన సంపూర్ణ మద్దతు, శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని రజినీకాంత్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ వివరణతో రజినీకాంత్, విజయ్ అభిమానుల మధ్య నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లయింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మత్తులో కొందరు యువకులు చేస్తున్న పనులు తీవ్ర కలకలం రేపుతున్నాయి
బండి భగీరథ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. 80 మందికి పైగా మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర సంఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.
వాహనదారులపై ఇంధన ధరల భారం మరోసారి తీవ్రరూపం దాల్చింది.
హైదరాబాద్‌లో ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తాను 3 నెలల పాటు తాత్కాలికంగా మూసివేశారు
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథకు మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు.
బండి సంజయ్ తన కుటుంబంపై వచ్చిన వివాదాల మధ్య సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.