ఎయిరిండియా క‌ష్ట‌న‌ష్టాల ప‌రంప‌ర ఇంకా ఆగ‌లేదా?

Publish Date:Jun 17, 2025

Advertisement

యువ‌ర్ అటెన్ష‌న్ ప్లీజ్. హాంకాంగ్ టూ ఢిల్లీ ఫ్లైట్ నెంబ‌ర్ ఏ1- 315 బోయింగ్ 787-8 డ్రీమ్ లైన‌ర్ చిన్న సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతో తిరిగి హాంకాంగ్ లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయ‌బోతున్నామ‌ని ప్ర‌కటించ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌యాణికుల గుండెలు అర‌చేతిలోకి వ‌చ్చేశాయి. ఎవ‌రి ఇష్ట దైవాన్ని వారు త‌లుచుకోవడం మొద‌లు పెట్టారు.తిరిగి హాంకాంగ్ లో ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక బ‌తుకు జీవుడా! అంటూ ఎటు వాళ్లు అటు పారిపోయారు. ఇంతా చేస్తే ఎయిరిండియా అధికార ప్ర‌తినిథి చెప్పిందేంటంటే.. వారి ప్ర‌యాణాన్ని రీషెడ్యూల్ చేస్తాం. లేదంటే టికెట్ డబ్బులు రీఫండ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో దాదాపు అంద‌రు ప్ర‌యాణికుల నుంచి వ‌చ్చిన మెసేజ్ రీఫండ్ చేయ‌మ‌ని.  యూపీలోని ఘ‌జియాబాద్ నుంచి కోల్ క‌తా వెళ్లే ఫ్ల‌యిట్ సిట్యువేష‌న్ ఇంకో ర‌కం. గంట సేపు సాంకేతిక లోపం కార‌ణంగా ఆగిపోయిందీ ఫ్లైట్ నెంబ‌ర్ ఐఎక్స్- 1511, ఆ గంట సేపు ప్రయాణికులు ఊపిరి బిగ‌బ‌ట్టి అలాగే కాలం గ‌డిపారంటే వారి ప‌రిస్థితేమిటో ఊహించుకోవ‌చ్చు.

మ‌రో భ‌యంక‌ర‌మైన ప్ర‌యాణ అనుభ‌వం విష‌యానికి వ‌స్తే.. ఆరోజు స‌రిగ్గా జూన్ 12వ తేదీ. ఆ టైంలో అహ్మ‌దాబాద్ లో ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగింది. దుబాయ్ నుంచి జైపూర్ రావ‌ల్సిన ఐఎక్స్- 196 దుబాయ్ లో రాత్రి 7. 44కి బ‌య‌లు దేరాల్సింది మ‌రునాటి వేకువ జాము 12. 44కి బ‌య‌లు దేరింది. అంటే ఏకంగా ఐదు గంట‌లు.  ఈ ఐదుగంట‌లూ ఆ ఫ్లైట్ లో న‌ర‌కం చూశారు ప్ర‌యాణికులు. ఏసీ లేదు. నీళ్లు, ఆహారం అందివ్వ‌లేదు. పిల్ల‌లుంటే వారు ఆ ఉక్క‌పోత‌లో ఆక‌లిద‌ప్పుల‌తో అల‌మ‌టించినా ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ప‌క్క రోజు వేకువ జాము 2. 44కి ఈ ఫ్లైట్ జైపూర్ లో ల్యాండ‌య్యింది. ఆ స‌మ‌యంలో  ఈ ఎయిరిండియా ప్ర‌యాణికుల ఫీలింగ్ ఏంటో తెలుసా? హ‌మ్మ‌య్యా మ‌నం  కూడా కాలి బూడిద‌వకుండానే నేల‌పై అడుగు పెట్టాం. గంటో అర‌గంట‌లో ప్రాణాల‌తో ఇంటికెళ్తాం. బాప్ రే బ‌చ్ గ‌యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 

కాళ‌రాత్రులంటారే స‌రిగ్గా అలాంటి ప్ర‌యాణ అనుభ‌వాన్నిస్తోంది ఎయిర్ ఇండియా. దాని టైం బ్యాడో.. లేక దాన్నెక్కే ప్ర‌యాణికుల టైం స‌రిగా లేదో తెలీదు గానీ.. ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి చ‌స్తున్నారొక్క‌క్క‌రూ. ఇండిగో త‌ర్వాత సెకండ్ బెస్ట్ ఎయిర్ లైన‌ర్ ఎయిర్ ఇండియా.  మొత్తం 102 దేశ విదేశీ తీరాల‌కు ప్ర‌యాణికుల‌ను చేర్చే ఎయిర్ ఇండియా చ‌రిత్ర ఈ నాటిది కాదు. ఇది 1932 నాటిది. దీని ఆప‌రేష‌న‌ల్ హెడ్డాఫీస్ ఢిల్లీ. బెంగ‌ళూరు, ముంబై వంటి ప్రాంతాల్లోనూ నెట్ వ‌ర్క్ విస్త‌రించి ఉంది. ఇక హ‌ర్యానాలోని గుర్గాంలో మెయిన్ ఆఫీసుంది. ప్ర‌స్తుతం ఎయిరిండియాలో డెబ్భై ఐదు శాతం వాటా టాటాల‌ది కాగా మిగిలిన ఇర‌వై ఐదు శాతం సింగ‌పూర్ ఎయిర్ లైన్స్ ది. 

ఎయిరిండియా మ‌ధ్య‌లో చేతులు మారినా ఇటీవ‌లే తిరిగి  టాటాల ప‌ర‌మైంది. ఆనాటి నుంచి 14 శాతం మేర లాభాల‌ను అర్జించింది. ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్- 24 కంటే, 25లో మెరుగైన‌ ట‌ర్నోవ‌ర్ర సాధించింది. ప్ర‌స్తుతం కూడా 11 శాతం  పెరుగుద‌ల‌తో 7 బిలియ‌న్ డాల‌ర్ల మేర ట‌ర్నోవ‌ర్ సాధిస్తోంది. అంతా బాగుంద‌నుకునే లోపు ఇదిగో ఈ వ‌రుస న‌ష్టాలు. అహ్మాదాబాద్ లో ఏమని అనుమానాస్ప‌ద ఘోర విమాన ప్ర‌మాదం జ‌రిగిందో అప్ప‌టి నుంచీ ఈ ఎయిర్ లైన‌ర్ టైం పూర్తిగా తిర‌బ‌డిన‌ట్టుంది. ప్ర‌యాణికుల‌కు మెరుగైన ప్ర‌యాణ  సౌక‌ర్యం అందిస్తామంటోన్న  ఎయిర్ ఇండియా.. వారి పాలిటి య‌మ‌పాశ‌మై.. దారుణంగా దెబ్బ తీస్తోంది.

ఇప్పుడెంత‌టి న‌ష్ట‌మంటే కేవ‌లం అహ్మ‌దాబాద్ డ్రీమ్ లైన‌ర్ కుప్ప‌కూల‌డంతో దాని విలువ 120 మిలియ‌న్ డాల‌ర్లు. అంటే దాదాపు వెయ్యి కోట్లు. అత్య‌వ‌స‌ర నిధి కింద పాతిక‌ల‌క్ష‌ల మేర ఈ ప్ర‌యాణ బాధితుల‌కు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించింది ఎయిరిండియా. ఆల్రెడీ కోటి రూపాయ‌లు ఒక్కొక్క‌రికీ న‌ష్ట‌ప‌రిహారం ఇస్తామ‌ని చెప్పింది. ఈ మొత్తం విలువ సుమారు 300 కోట్లు. ఇక ప్ర‌మాదం జ‌రిగిన రోజు బోయింగ్ తో స‌హా ఇండిగో త‌దిత‌ర విమాన యాన షేర్ల‌న్నీ కుప్ప‌కూల‌డంతో ఈ మొత్తం న‌ష్టం విలువ సుమారు 6 ల‌క్ష‌ల కోట్లు. దీంతో ఇటు తామే కాకుండా అటు బోయింగ్ సంస్థ ఆర్డ‌ర్ల‌ను కూడా ఎయిరిండియా ప్ర‌భావితం చేస్తోన్న మాట వినిపిస్తోంది. 

మ‌రి ఈ న‌ష్టాల నుంచి ఎయిరిండియాను గ‌ట్టెక్కించేవారేరీ. ఈ విష‌యాలు తెలిసిన ప్ర‌యాణికులు ఎయిర్ ఇండియా అంటేనే హ‌డ‌లి పోతున్నారు. కార‌ణం టేకాఫ్ అయిన 45 సెక‌న్ల‌కే కుప్ప‌కూలిపోయే విమానాలున్న ఈ సంస్థ మెయిన్ టైన్స్ స‌రిగా లేద‌న్న పేరు రావ‌డంతో వారంతా ఈ ఫ్ల‌యిట్ బుకింగ్స్ కి ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచిస్తున్నారు. ఫ‌స్ట్ మీ ద‌గ్గ‌రున్న అన్ని ర‌కాల  విమానాలు, వాటి ఫిట్నెస్ ని ఒక‌సారి  థార్డ్ పార్టీ చెకింగ్ చేసి మీ అధికారిక వెబ్ సైట్ల‌లో వాటిని పోస్ట్ చేస్తే త‌ప్ప‌.. ప్ర‌యాణికుల్లో న‌మ్మ‌కం రాద‌న్న మాట వినిపిస్తోంది విమాన‌యాన రంగ నిపుణుల నుంచి. 

తాజా వార్త ఏంటంటే మంగ‌ళ‌వారం ఉద‌యం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఫ్ల‌యిట్ నెంబ‌ర్ ఏఐ- 180 విమానం ఇంజిన్లో సాంకేతిక లోపం క‌నిపించ‌డంతో ప్ర‌యాణికుల‌ను కోల్ క‌త‌లో దింపేసింది. దీన్నిబ‌ట్టీ ఎయిర్ ఇండియాకేదో దుర‌దృష్టం వెంటాడుతోంది. ఇది ప్ర‌యాణికుల‌కు చుక్క‌లు చూపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.