ఖర్గేదే కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కానీ...పెత్తనం మాత్రం?

Publish Date:Oct 15, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో , అక్టోబర్ 17 పోలింగ్ జరుగుతుంది. 19 కౌంటింగ్. అయితే  ఫలితం కోసం అంతవరకూ ఆగవలసిందేనా అంటే  అవసరం లేదు. నిజమే ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత జరుగతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత శశి థరూర్ పోటీ పడుతున్నారు. 

అయితే, ‘కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది’ అన్నట్లు నామినేషన్  వేసిన నాడే, శశి థరూర్ భవిష్యత్ ఏమిటో, తెలిసి పోయింది. ఎంత కాదన్నా, మల్లికార్జున ఖర్గే  సోనియా గాంధీ సెలెక్ట్ చేసిన పార్టీ అధిష్టానం అఫీషియల్ కాండిడేట్. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కరలేదు. గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతే ఎవరు పోటీ చేసినా తటస్థంగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైనా ఎవరైనా పోటీ చేయవచ్చని  సోనియా గాంధీ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  చివరకు ఏమి జరగాలో అదే జరిగింది. 

నిజానికి సోనియా గాంధీ ఏరికోరి  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ ను ఎంపిక చేశారు. అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. అందుకు ఆయన అంతగా సుముఖత చూపక పోయినా, ఆయన్ని ఒప్పించారు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేక గేహ్లోట్ అనూహ్యంగా ‘దమ్కీ’ ఇవ్వడంతో సోనియా గాంధీ  దిగ్విజయ్ వైపు కొద్దిగా మొగ్గుచూపినా చివరకు  మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ  ఎనిమిది పదుల ఖర్గేను  నామినేషన్ కు సిద్ధం చేశారు. 

ఇక శశి థరూర్  సంగతి చెప్పనే అక్కరలేదు. గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. సో, సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేదు. సో ..సో రేపు గెలిచేది ఎవరో గాంధీల ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అందుకునేది ఎవరో వేరే చెప్పనక్కరలేదు. కొంచెం ఆలస్యంగానే అయినా, శశి థరూర్ కు విషయం అర్థమైనట్లుంది. అందుకే ఆయన తీరిగ్గా అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని  అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు  కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవును మరి నాడా దొరికిందని గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుంది. 

అయితే నిజానికి ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అవుతారు అనేది అసలు ప్రశ్నే కాదు. ‘జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది’ అన్నట్లు అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయాసంగా అధ్యక్ష పదవిని అందుకుంటారు. అందులో సందేహం లేదు. అయితే  ఇప్పుడు ప్రశ్న అది కాదు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు  అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పటిలానే  అన్నదే సమాధానం. శశి థరూర్, తనకు అవకాశం ఇస్తే  అధిష్టానం సంస్కృతి చేరిపేస్తానని చెప్పారు. కానీ ఖర్గే ఇతర విధేయ నాయకులు  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా కావచ్చుని కానీ, సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా కొనసాగుతారని చెపుతున్నారు. ఖర్గే అధ్యక్షుడిగా ఉంటారు. రాహుల్ గాంధీ నాయకుడిగా కొనసాగుతారు. అంతే కాదు 2024 ఎన్నికలలో రాహుల్ గాంధీనే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి అవుతారు. ఇది కాంగ్రెస్ విధేయ నాయకులలోనే కాదు  అందరిలో ఉన్న అభిప్రాయం. 

అయితే  ఇందుకు సంబధించి ఖర్గే  కాసింత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ నిర్ణయం ఏదో పార్టీ అధిష్టానం తీసుకుంటుందని కాకుండా  అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ నిర్ణయం ఏదో  తానే తీసుకుంటానని అన్నారు. అంతే కాదు, ‘బక్రీద్ మే బచేంగే తో.. మొహారం మే నాచేంగే’  అంటూ ఉర్దూ సామెతను ఉటంగించారు. అంటే, బక్రీద్ వేటు నుంచి బయటపడితే మొహారంలో నాట్యం చేయచ్చని చెప్పారు.   

అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని పరిశీలకులు చెబుతున్నారు.  2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీయే ఉండాలని ఖర్గే సహా కాంగ్రెస్ నాయకత్వమంతా ఉమ్మడిగా కోరుకుంటోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాహులే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కోరుకున్నారు. అయితే అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అన్నారు.

సోనియా కుటుంబం బయటవారే ఈసారి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించాలని రాహుల్ పట్టుబట్టారు. అందుకే ఖర్గే,  థరూర్ బరిలో నిలిచారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పార్టీ తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే  బాధ్యతలు లేని అధికారానికి అలవాటుపడిన రాహుల్ గాంధీ అందుకైనా అంగీకరిస్తారా? మోడీని ఢీ కొంటారా? అంటే అనుమానమే .. అంటున్నారు.

By
en-us Political News

  
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.