హైదరాబాద్‌లో కల్తీ మాంసం దందా బట్టబయలు

Publish Date:Mar 11, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల బెడద రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే టీ పౌడర్, అల్లం- వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, నూనెలు వంటి అనేక కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తుండగా మరోవైపు తాజాగా కల్తీ మాంసాన్ని విక్రయిస్తూ... దండిగా డబ్బులు సంపా దిస్తున్న కేటుగాడు వ్యవహారం బయటపడింది. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కొందరు వ్యాపారులు లాభాల కోసం అపరిశుభ్రమైన, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

విశ్వస నీయమైన సమాచారం ఆధారంగా గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, మంగళ్‌హాట్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. మంగళ్‌హాట్‌లోని చిస్టీ చెమాన్ ప్రాంతంలో ఉన్న  షాప్‌పై తనిఖీలు చేపట్టి... ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి భారీ ఎత్తున అపరిశుభ్రమైన, కుళ్లిన మాంసం నిల్వ ఉంచిన సుమారు 300 కిలోల కుళ్లిన మేక, గొర్రె మాంసంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాంసం విలువ దాదాపు రూ.25 వేలుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. 

ఈ సందర్భంగా గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ....  ఈ ఘటనలో మాంసం వ్యాపారి మహ్మద్ ఆఫ్రూస్‌ను అరెస్టు చేశామని అన్నారు. నిందితుడు మేక మరియు గొర్రెల వధశాలల వద్ద మిగిలిపోయే అవశేషాలను సేకరించి వాటిని డీప్ ఫ్రీజర్లలో నిల్వ ఉంచి తాజాగా ఉన్నట్లు చూపిస్తూ కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో బయటపడింది. అంతేకాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ తదితర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మాంసాన్ని తెచ్చి నగరంలో విక్రయి స్తున్నట్లుగా డీసీపీ  తెలిపారు. ఇదే వ్యాపారిపై గతంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించి జరిమానా విధించినప్పటికీ కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.

 ముఖ్యంగా తక్కువ ధరకు మాంసం అందిస్తాడని తెలుసుకొని ఫంక్షన్లు నిర్వహించే వారు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నట్లు కూడా విచారణ లో తేలింది. ప్రజల ఆరో గ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. అపరిశుభ్రమైన లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు ఎక్కడైనా తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసు కుంటున్నట్లు  తెలిపారు. నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయా లపై ప్రత్యేక దృష్టి పెట్టి తరచూ తనిఖీలు కొనసా గిస్తామని  గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ వెల్లడించారు

By
en-us Political News

  
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తున్న ఈ రోజుల్లో, టెక్నాలజీ ప్రభావం సమాజంలోని ప్రతి వర్గానికీ ఎలా చేరుతోందో చూపించే ఆసక్తికర ఉదాహరణ ఇది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామంలో ఓ రైతు పొలం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం—ప్రాణ భద్రత.
77 ఏళ్ల గణపతి ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అంటే డయాబెటిస్, కీళ్లనొప్పులు, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు పార్టీ ఆయనను అడవుల నుంచి బయటకు పంపిందని సమాచారం.
అమెరికా విధించిన రెడ్ లైన్స్ వెనుక బలమైన కారణం ఉందన్న జేడీ వాన్స్, ఇరాన్ గనుక అణ్వాయుధాన్ని సాధిస్తే, అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధ పోటీకి దారితీస్తుందన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం ఒక్క అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచ శాంతికే ముప్పన్నారు.
హైదరాబాద్ వాతావరఖ కేంద్రం విడుదల చేసిన తాజా బులిటెన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. . రానున్న పది రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నైతొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఈ దుర్ఘటనలో ప్రముఖ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాస్ రావు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ వార్త న్యాయవాదుల వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పలువురు న్యాయవాదులు సంతాపం తెలిపారు.
నీతి, నిజాయితీలతో కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ (ఈ3) కార్యక్రమం చేపడతామన్నారు.
బీహార్‌కు చెందిన యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడుతున్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. 2025-26 సంవత్సరాల్లో గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, నెటిజన్లు సూర్యవంశీ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అందులో మొదటిది- వైభవ్.. వయసు, పుట్టిన తేదీ వివరాలు. ఇది నెటిజన్లు వేసిన టాప్ క్వశ్చిన్ గా నిలుస్తోంది. కేవలం 13-14 ఏళ్లకే ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఆడటం వల్ల వైభవ్ సూర్యవంశీ రియల్ ఏజ్ అనే పదం ఎక్కువగా ట్రెండ్ అవుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.